News August 11, 2025
ఉమ్మడి కృష్ణాలో త్వరలో 2డిఫెన్స్ కేంద్రాలు

AP: ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 డిఫెన్స్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. నాగాయలంక గొల్లలమొద వద్ద మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం నెలకొల్పుతామని PM ప్రకటించడం తెలిసిందే. అటు బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం కోసం జగ్గయ్యపేట జయంతిపురం ప్రాంతాన్ని డిఫెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ NHకు దగ్గర్లో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో అనుకూలమని భావిస్తున్నారు. ఇవి పట్టాలెక్కితే వేల మందికి ఉపాధి లభిస్తుంది.
Similar News
News August 11, 2025
వీడిన భయాలు.. భారీ లాభాల్లో మార్కెట్లు

ట్రంప్ టారిఫ్స్ భయాల నుంచి కోలుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 746 పాయింట్లు లాభపడి మళ్లీ 80,604, నిఫ్టీ 221 పాయింట్లు వృద్ధి చెంది 24,585 వద్ద క్లోజ్ అయ్యాయి. టాటా మోటార్స్, ఎటర్నల్, ట్రెంట్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, అదానీ పోర్ట్స్, రిలయన్స్, కోటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. బెల్, ఎయిర్టెల్, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.
News August 11, 2025
మరికాసేపట్లో వర్షం

TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 1-2 గంటల్లో ఎల్బీ నగర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల్లో వాన పడుతుందని అంచనా వేసింది. అదే విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News August 11, 2025
ఆసిమ్ మునీర్ బెదిరింపులు.. భయపడేది లేదన్న భారత్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ <<17364906>>వ్యాఖ్యలపై<<>> కేంద్రం తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి ఆయన ప్రేలాపనలు చేయడం సిగ్గుచేటని మండిపడింది. అణుదాడి చేస్తామన్న బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్కు అలవాటుగా మారిందని భారత్ విమర్శించింది.