News April 3, 2025
BREAKING: గురుకుల CET ఫలితాలు విడుదల

TG: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం FEB నెల 23న నిర్వహించిన TG CET ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకులాల్లో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఫలితాల్లో 36,334 మంది సీట్లు పొందారు. వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్లకు గాను త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News April 10, 2025
అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పబ్లిక్ టాక్

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదలైంది. ఇప్పటికే USలో చూసినవారు తమ అభిప్రాయాన్ని SMలో పంచుకున్నారు. మాస్ ఎంటర్టైనర్గా మూవీ ఉందని, అజిత్ ఫ్యాన్స్కు పండగేనని కొందరు పేర్కొంటున్నారు. భారీ యాక్షన్ సీన్లు, ఇంటర్వెల్ సీన్ అజిత్ కెరీర్లోనే బెస్ట్ అని పోస్టులు చేస్తున్నారు. సెకండాఫ్ స్లోగా ఉందని, మ్యూజిక్ బాగుందని అంటున్నారు. కాసేపట్లో వే2న్యూస్ రివ్యూ.
News April 10, 2025
కంచ గచ్చిబౌలిలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది. స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. దాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది. ఆ భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా HCU విద్యార్థులతో పాటు సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరికి SC జోక్యంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
News April 10, 2025
పోసాని క్వాష్ పిటిషన్పై నేడు విచారణ

AP: నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. తనపై నెల్లూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని దానిని క్వాష్ చేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Dy.CM పవన్ కళ్యాణ్తో పాటు పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఆయన బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.