News June 13, 2024
వంటపని మహిళలదే కాదని చెప్పేందుకు..!
లింగభేదాన్ని అరికట్టేందుకు కేరళ సర్కారు వినూత్న ప్రయోగం చేపట్టింది. కొత్త పాఠ్యపుస్తకాల్లో మహిళలతో పాటు పురుషులూ వంటలో పాల్గొనే చిత్రపటాలను రూపొందించింది. ‘పుస్తకంలోని ఫొటోలో ఓ తండ్రి కొబ్బరి తురుము చేయడం చూసి ఆశ్చర్యపోయానని, అది మా నాన్నకు చూపించి నువ్వు ఎందుకు చేయవని ప్రశ్నించా’ అని ఓ మూడో తరగతి విద్యార్థిని చెప్పింది. ఈ ప్రయత్నం వల్ల లింగభేదం తగ్గుతుందని అధికారులు తెలిపారు.
Similar News
News October 6, 2024
PHOTOS: ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి విహారం
తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు కనులపండువగా సాగాయి. ఇవాళ శ్రీమలయప్పస్వామి ముత్యాల పందిరిపై విహరించారు. శ్రీవారిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు. తిరుమల గిరులు శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగాయి. వేంకటేశ్వరుడి విహారం సందర్భంగా మాడవీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
News October 6, 2024
రజినీ-మణిరత్నం కాంబోలో సినిమా?
సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కలిసి చివరిగా 1991లో ‘దళపతి’కి పనిచేశారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా అనౌన్స్మెంట్ రావొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కమల్ హాసన్తో సైతం ‘థగ్ లైఫ్’ ద్వారా 36 ఏళ్ల తర్వాత మణిరత్నం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.
News October 6, 2024
ఆంధ్రుల హక్కు ముఖ్యమా.. పొత్తు ముఖ్యమా?: షర్మిల
AP: సీఎం చంద్రబాబుకు ఆంధ్రుల హక్కులు ముఖ్యమా, లేదంటే బీజేపీతో పొత్తు ముఖ్యమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మోదీ, అమిత్ షాను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తు ప్రయోజనాలు అంత ముఖ్యమేమీ కాదు’ అని ఆమె పేర్కొన్నారు.