India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచులో LSG గ్రాండ్ విక్టరీ సాధించింది. 181 పరుగుల టార్గెట్ను 19.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ మార్క్రమ్ (58) హాఫ్ సెంచరీతో రాణించారు. నికోలస్ పూరన్ (1 ఫోర్, 7 సిక్సర్లతో 61 రన్స్) విధ్వంసంతో జట్టు విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రషీద్, సుందర్ చెరో వికెట్ తీశారు.
అంతరిక్షంలో పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించేందుకు మంచి ఐడియా ఇచ్చే వారికి నాసా బంపరాఫర్ ప్రకటించింది. వేస్ట్ను రీసైక్లింగ్ చేసేందుకు వినూత్న ఐడియా ఇచ్చే వారికి రూ.25 కోట్లు ($3 మిలియన్) ఇస్తామని ప్రకటించింది. 1969-72 మధ్య కాలంలో అపోలో మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపింది. దీంతో అక్కడ 96 బ్యాగుల వ్యర్థాలు పేరుకుపోయాయి. కాంటెస్ట్ పూర్తి వివరాలకు ఇక్కడ <
AP: ఇంటర్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. హర్షిణి, హేమలత, సిరి (ప్రకాశం), లాస్య (తిరుపతి)లకు సెకండియర్ MPCలో 991 మార్కులు వచ్చాయి. Bipcలో హారిక (ప్రకాశం) 991 మార్కులు సాధించింది. ఫస్టియర్ MPCలో నాదెండ్ల కృష్ణప్రియ (పొన్నూరు) 470కి 467, భాగ్యలక్ష్మి(తిరుపతి) 465, KGBV విద్యార్థిని రేవతి (అనకాపల్లి) Bipcలో 440కి 433 మార్కులు తెచ్చుకున్నారు. మీకు తెలిసిన వారిలో ఎక్కువ మార్కులు ఎన్ని? కామెంట్ చేయండి.
సరిహద్దు వివాదాలతో భారత్తో కయ్యానికి కాలుదువ్వే చైనా కొంతకాలంగా మెతక వైఖరి అవలంబిస్తోంది. ఇటీవల సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న చైనా తాజాగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత 3 నెలల్లో 85 వేల వీసాలు ఇచ్చామని చైనీస్ ఎంబసీ తెలిపింది. ‘చైనాను సందర్శించేందుకు మరింత మంది ఇండియన్ ఫ్రెండ్స్కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.
AP: దక్షిణ మధ్య రైల్వే మరిన్ని <
వాట్సాప్ సేవల్లో అంతరాయం కలుగుతోందని పలువురు యూజర్లు Xలో పోస్టులు చేస్తున్నారు. మెసేజులు సెండ్ కావట్లేదని, స్టేటస్లు అప్డేట్ అవ్వట్లేదని చెబుతున్నారు. అసలు వాట్సాప్ లాగిన్ కావడం లేదని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా మన దేశంలో ఎక్కువ మంది వినియోగించే యూపీఐ, వాట్సాప్ సేవలు ఒకేరోజు డౌన్ కావడం గమనార్హం.
TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది.
సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్/అక్టోబర్లో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్క్రీన్ ప్లే రాసేందుకు డైరెక్టర్ 6 నెలల సమయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో రెబల్ స్టార్ పోలీసుగా కనిపించనుండగా, స్టంట్స్తో కూడిన భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.
AP: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి.
*మే 12- సెకండ్ లాంగ్వేజ్
*మే 13- ఇంగ్లిష్
*మే 14- మ్యాథ్స్-1A, 2A, బోటని, సివిక్స్
*మే 15- మ్యాథ్స్- 1B, 2B, జువాలజీ, హిస్టరీ
*మే 16- ఫిజిక్స్, ఎకనామిక్స్
*మే 17- కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ
**మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్ ఉ.9-మ.12 వరకు, సెకండియర్ మ.2.30-సా.5.30 వరకు.
లక్నోపై GT ఓపెనర్ సాయి సుదర్శన్(56) మరోసారి అదరగొట్టారు. IPLలో అద్భుత ప్రదర్శనతో మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్గా అనిపించుకుంటున్నారు. ఈ సీజన్లో 6 ఇన్నింగ్స్లలో 329 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు. లాస్ట్ 10 IPL మ్యాచుల్లో కేవలం రెండుసార్లే సింగిల్ డిజిట్ స్కోర్ చేసి.. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశారు. త్వరలోనే సాయి టీమిండియాలో చోటు దక్కించుకుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.