News April 11, 2025

సొంత గ్రౌండులో ఆర్సీబీ చెత్త రికార్డు

image

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదిక(బెంగళూరు-చిన్నస్వామి స్టేడియం)లో అత్యధిక సార్లు(45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ ఉండే హోమ్ గ్రౌండులోనే ఇలా ఓటములు ఎదురవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో DC(44), KKR(38), MI(34), PBKS(30) ఉన్నాయి. ఈ జట్లు కూడా తమ సొంత గ్రౌండ్లలోనే ఎక్కువసార్లు ఓడిపోవడం గమనార్హం.

News April 11, 2025

ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్‌లోనే: పరిశోధకులు

image

ప్రపంచంలోనే అత్యధిక క్షయ కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయని పలువురు పరిశోధకులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. క్షయపై చర్చించేందుకు హైదరాబాద్‌లో ప్రారంభమైన సదస్సులో వారు మాట్లాడారు. ‘క్షయ కారణంగా 2023లో 3 లక్షలమందికి పైగా కన్నుమూశారు. ముందే గుర్తిస్తే టీబీ మరణాన్ని అరికట్టొచ్చు. భారత్‌కు సవాలుగా మారిన దీనిపై అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

News April 11, 2025

వడ్డీ రాయితీ గడువు పొడిగింపు

image

AP: పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. 2024-25కు గాను ప్రజలు చెల్లించాల్సిన పన్నుపై ఈ రాయితీ వర్తిస్తుంది. మార్చి నెలాఖరుతోనే గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే సెలవుల వల్ల రాయితీ ఉపయోగించుకోలేకపోయామని విజ్ఞప్తులు రావడంతో పొడిగించింది.

News April 11, 2025

అంగన్‌వాడీ పిల్లలకు శనగలు, ఎగ్‌ఫ్రైడ్ రైస్

image

AP: అంగన్‌వాడీ కేంద్రాల మధ్యాహ్న భోజన మెనూలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. రుచితోపాటు ఎక్కువ పోషకాలుండేలా పిల్లలకు వారంలో 2 రోజులు ఎగ్‌ఫ్రైడ్ రైస్, ఉదయం ఉడికించిన శనగలు అందించనుంది. అలాగే కూరల్లో మునగపొడిని వాడనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 4 జోన్ల పరిధిలోని ఒక్కో కేంద్రంలో అమలు చేశారు. త్వరలో 26 జిల్లాల్లోని ఒక్కో కేంద్రంలో అమలు చేస్తారు. బాలామృతంలోనూ చక్కెర స్థాయి తగ్గించి మార్పులు చేస్తారు.

News April 11, 2025

‘వక్ఫ్’పై ఈ నెల 16 నుంచి సుప్రీం విచారణ

image

వక్ఫ్ సవరణ బిల్లును సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీం కోర్టు ఈ నెల 16న విచారించనుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్, డీఎంకే పార్టీ నేత రాజా, ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణను 13వ అంశంగా కోర్టు లిస్ట్ చేసింది. మరోవైపు తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంలో కేవియట్ పిటిషన్ వేసింది.

News April 11, 2025

హెల్త్ చెకప్‌కోసం ఆస్పత్రికి కేసీఆర్

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇది కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పార్టీ నాయకత్వం శ్రేణులకు తెలిపింది. ఈ నెల 27న వరంగల్‌లో వజ్రోత్సవ సభకు ఆయన సిద్ధంగా ఉన్నారని వివరించింది.

News April 11, 2025

పట్టుకున్న చేప ప్రాణం తీసింది!

image

చెన్నైలో చేపలు పడుతున్న ఓ వ్యక్తి, చేప వల్లే చనిపోయాడు. మణికందన్ అనే వ్యక్తి కీలావలంలోని చేపల చెరువులో రెండు చేపల్ని పట్టుకున్నారు. ఒకదాన్ని చేతితో, మరోదాన్ని నోటితో పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వస్తుండగా నోటితో పట్టుకున్న చేప ఆయన గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడే అది ఇరుక్కుపోవడంతో మణికందన్ విలవిల్లాడారు. స్థానికులు సాయం చేసేలోపే ప్రాణాలు విడిచారు.

News April 11, 2025

చైనా ప్రతిపాదన… ఆస్ట్రేలియా తిరస్కరణ

image

అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో వేరే దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆస్ట్రేలియాను తమకు కలిసిరావాలని కోరగా బీజింగ్‌కు చుక్కెదురైంది. అమెరికా సుంకాలపై ఉమ్మడిగా పోరాడదామంటూ చైనా ఇచ్చిన పిలుపును ఆస్ట్రేలియా తిరస్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చైనా చేతిని పట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తామని పేర్కొంది.

News April 11, 2025

14,956 ఎకరాల్లో పంట నష్టం!

image

TG: అకాల వర్షాల కారణంగా 14,956 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. వాటిలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటలున్నాయని పేర్కొంది. ఒక్క గత నెలలో వానలకే 8408 ఎకరాల పంట నేలవాలిందని పేర్కొంది. ఈ నెల 3 నుంచి 9 వరకు 7 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వానలు చేకూర్చిన నష్టంపై రూపొందించిన నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.

News April 11, 2025

ALERT: వచ్చే 3 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈ మూడు రోజులూ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.