News April 6, 2025

పిఠాపురంలో టీడీపీ నేతలపై కేసు

image

AP: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు <<15990895>>పర్యటన సందర్భంగా <<>>జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన TDP నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

News April 6, 2025

లోకేశ్ సొంత ఇలాకాలో ‘గంజాయి’: YCP

image

AP: మంత్రి లోకేశ్ సొంత ఇలాకా మంగళగిరిలో గంజాయి పట్టుబడిందని YCP ట్వీట్ చేసింది. ‘కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.2kgs గంజాయి, 8.71gms డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఒక్క చోట పట్టుకున్న గంజాయే ఇంత ఉంటే రాష్ట్రంలో ఎంత ఉందో? 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని లోకేశ్ బీరాలు పలికారు. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదా’ అని విమర్శించింది.

News April 6, 2025

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కన్నుమూత

image

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గుండెపోటుకు గురై గత కొన్ని రోజులుగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కిమ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉన్నా తల్లి కోసం రద్దు చేసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్‌కు మొత్తం నలుగురు సంతానం.

News April 6, 2025

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రేపు SCలో పిటిషన్: స్టాలిన్

image

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. దీనిని సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజా పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ SCని ఆశ్రయించారు.

News April 6, 2025

జియో వినియోగదారులకు ఆఫర్ పొడిగింపు

image

IPL సందర్భంగా జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో హాట్‌స్టార్ యాక్సెస్‌ను ఫ్రీగా అందిస్తోంది. పలు రీఛార్జ్‌లపై గతంలో ప్రకటించిన ఈ ఆఫర్‌ను తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఆలోగా ₹100/₹195/₹949తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 90days యాప్ ఫ్రీగా చూడవచ్చు. ₹100 రీఛార్జ్‌కు 5GB డేటా, ₹195కి 15GB డేటా, ₹949తో రీఛార్జ్ చేసుకుంటే 84days వ్యాలిడిటీతో డైలీ 2GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా&కాల్స్ పొందవచ్చు.

News April 6, 2025

ఆశ్చర్యకరంగా ధోనీ బ్యాటింగ్ గణాంకాలు

image

ఫినిషర్‌గా గతంలో CSKని ఎన్నో మ్యాచుల్లో గెలిపించిన ధోనీ ప్రస్తుతం తడబడుతున్నారు. నిన్న DCతో జరిగిన మ్యాచే ఇందుకు నిదర్శనం. 2023 సీజన్ నుంచి CSK ఓడిన 14 మ్యాచుల్లో 90.66 avgతో 272 రన్స్ చేసిన ఆయన, జట్టు గెలుపొందిన 13 మ్యాచుల్లో 13.80avgతో 69 రన్స్ మాత్రమే చేశారు. గెలిచిన మ్యాచుల్లో చేసిన రన్స్ కంటే ఓడిన మ్యాచుల్లో చేసిన పరుగులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

News April 6, 2025

కాంగ్రెస్, BRS పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది BJPయేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. HYDలో BJP ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అవినీతి పాలన, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, KCR కుటుంబ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. INC, BRS పార్టీల కుట్రలు, నిజస్వరూపాన్ని బయటపెట్టి BJPని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

News April 6, 2025

మార్కెట్ క్రాష్‌ను జయించిన వృద్ధుడి చాతుర్యం

image

టారిఫ్స్ ఎఫెక్ట్‌తో స్టాక్‌మార్కెట్స్ క్రాష్ అయి మస్క్, బెజోస్, బిల్‌గేట్స్ తదితర కుబేరులు రూ.కోట్ల సంపద కోల్పోయారు. అయితే టాప్10 బిలియనీర్ల జాబితాలో 94 ఏళ్ల వారెన్ బఫెట్ మాత్రమే $12.7B లాభాలతో మార్కెట్ పతనాన్ని జయించారు. కన్జూమర్ గూడ్స్, ఎనర్జీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్లలో ట్రేడింగ్‌తో పాటు ఈక్విటీ షేర్స్‌ అమ్మేసి షార్ట్ టర్మ్ US ట్రెజరీ బిల్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఆయన సక్సెస్ సీక్రెట్స్.

News April 6, 2025

ఎకనామిక్ గ్రోత్ రేట్‌.. రెండో స్థానంలో AP: మంత్రి లోకేశ్

image

ఎకనామిక్ గ్రోత్ రేట్(2024-25)లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నివేదికను పంచుకున్నారు. AP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) ₹8.73 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 9.69% గ్రోత్ రేటుతో TN తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో AP (8.21%), అస్సాం (7.94), రాజస్థాన్ (7.82), హరియాణా(7.55), ఛత్తీస్‌గఢ్ (7.51), TG (6.69) ఉన్నాయి.

News April 6, 2025

సినిమాల్లోకి సీనియర్ హీరోయిన్ కూతురు?

image

సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ కుష్బూ, దర్శకుడు సుందర్‌ల కూతురు అవంతిక తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అవంతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త హీరోయిన్ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నటించాలని తన మనసులో ఉందని, ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని గతంలో అవంతిక చెప్పారు.