India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL-2025: గువాహటి వేదికగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచులో CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
CSK: గైక్వాడ్, రచిన్, త్రిపాఠి, ధోనీ, జడేజా, విజయ్ శంకర్, అశ్విన్, నూర్ అహ్మద్, పతిరణ, ఓవర్టన్, ఖలీల్
RR: జైస్వాల్, శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మేయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ.
TG: రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. దీంతో 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.
‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బాధ్యతల కోసం పిల్లలను వద్దనుకున్నట్లు చెప్పారు. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తన భార్య సపోర్టుతో చెల్లెలికి పెళ్లి, తమ్ముడిని సెటిల్ చేసినట్లు వెల్లడించారు. పిల్లలు ఉంటే స్వార్థంగా బతుకుతామని ఆలోచించి తన భార్యతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘MAD’కు సీక్వెల్గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’కు హిట్ టాక్ రావడంతో కలెక్షన్లలో దూసుకెళ్తోంది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు బ్లాక్బస్టర్ మ్యాక్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇవాళ, రేపు కూడా సెలవులు ఉండటంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
భూకంపం మరో దేశాన్ని వణికించింది. పసిఫిక్ ద్వీప దేశం టోంగాలో భూమి కంపించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత నమోదైనట్లు తెలిపాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించాయి. రెండు రోజుల క్రితం మయన్మార్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
మిచెల్ స్టార్క్ తొలిసారి టీ20ల్లో ఐదు వికెట్లు తీశారు. ఈ 35 ఏళ్ల ప్లేయర్ టెస్టుల్లో 15, వన్డేల్లో 9 సార్లు ఐదేసి వికెట్లు తీశారు. అయితే టీ20ల్లో 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఐపీఎల్-2025లో డీసీ తరఫున ఈ ఘనత సాధించారు. SRHతో మ్యాచులో కీలక వికెట్లు తీసి ఆ జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేశారు.
ఇప్పటికే ఎన్కౌంటర్లలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా 50మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 14మంది తలలపై రూ.68లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని అధికారులు తెలిపారు. PM మరికొన్ని గంటల్లో ఛత్తీస్గఢ్లో పర్యటించనుండగా ఈ లొంగుబాటు జరగడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో 25మంది నక్సలైట్లు లొంగిపోయారు.
* ఏప్రిల్: 6, 16, 18, 20, 23, 30
* మే: 1, 8, 9, 11, 17, 18, 28
* జూన్: 1, 2, 5, 6, 7, 8 * జులై: 16, 30
* ఆగస్టు: 1, 4, 7, 8, 9, 10, 13, 14, 17
* సెప్టెంబర్: 26, 27
* అక్టోబర్: 1, 2, 3, 4, 6, 8, 10, 11, 22, 24
* ఫిబ్రవరి(2026): 19, 20, 21, 22, 25, 26, 27
* మార్చి: 4, 5, 7, 8, 11
* జూన్ 26- జులై 24, ఆగస్టు 24-సెప్టెంబర్ 21, నవంబర్ 21- ఫిబ్రవరి 18(2026), మార్చి12-19(2026) మధ్య ముహూర్తాలు లేవు.
AP: పార్టీలో రెండు టర్మ్లు ఓ పదవిలో పనిచేసినవారు పై స్థాయికి వెళ్లాలి లేదా టర్మ్ గ్యాప్ తీసుకోవాలన్న మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు TDP సీనియర్లు మద్దతు పలికారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్కొన్నారు. ‘లోకేశ్ ప్రతిపాదనకు మద్దతునిస్తున్నాం. 2012 నుంచి నేను టీడీపీ పొలిట్బ్యూరోలో ఉన్నాను. నా స్థానంలో వేరొకరికి అవకాశమివ్వాలనుకుంటే నేను సిద్ధం’ అని పేర్కొన్నారు.
AP: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.
Sorry, no posts matched your criteria.