News March 29, 2025

ఎంపురాన్‌లో ఆ సీన్స్ కట్ చేస్తున్నాం: నిర్మాత

image

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమాపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని నిర్మాత గోకులం గోపాల్ స్పందించారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు పృథ్వీరాజ్‌కు సూచించినట్లు తెలిపారు. ఎంపురాన్ సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలతోపాటు ఓవరాల్‌గా కథను ఒక వర్గాన్ని కించపరిచేలా తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News March 29, 2025

మండుతున్న ఎండలు.. 150 మండలాల్లో 40+ డిగ్రీలు

image

AP: రాష్ట్రంలో వడగాలులు, ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇవాళ 150కిపైగా మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు IMD వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కొమరోలు, నంద్యాల, కమలాపురంలో 42.5, రుద్రవరం, అనకాపల్లిలో 42, కోసిగి, తాడిమర్రిలో 41 డిగ్రీలు రికార్డయినట్లు పేర్కొంది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించింది.

News March 29, 2025

ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలు క్యాన్సిల్!

image

అమెరికా యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిస్తోంది. యూనివర్సిటీల్లో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి వీసాలు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతున్నారు. అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన, లైక్ చేసిన విద్యార్థులకూ ఈ హెచ్చరికలు పంపింది. ఇందులో పలువురు భారతీయ విద్యార్థులూ ఉన్నట్లు తెలుస్తోంది.

News March 29, 2025

నా సినిమా కోసం నేనెప్పుడూ ప్రార్థించలేదు: సల్మాన్

image

తన సినిమా హిట్ అవ్వాలని కోరుతూ ఎప్పుడూ దేవుడిని ప్రార్థించలేదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘నా సినిమా విజయం సాధించడమనేది ప్రేక్షకుల దయపై ఆధారపడి ఉంటుంది. ‘మైనే ప్యార్ కియా’కి తప్పితే ఎప్పుడూ సినిమా సక్సెస్ చేయమంటూ దేవుడిని ప్రార్థించలేదు. నన్ను ప్రేమించేవాళ్లే నాకోసం ప్రార్థనలు చేస్తుంటారు. నేను ఉత్తమ నటుడిని అని ఎప్పటికీ అనుకోను’ అని పేర్కొన్నారు.

News March 29, 2025

మీరు గ్యారంటీలు ఇస్తే.. మేం నిధులివ్వాలా?: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రాలు గ్యారంటీలు ఇచ్చి, నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా? అని కేంద్ర‌ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ 10 ఏళ్లలో అనేక రహదారులు ఏర్పడ్డాయని చెప్పారు. ‘మేం ఇచ్చిన హమీల అమలు బాధ్యత మాదే. ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు. BJPలో అలా కాదు. JP నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడు. డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు’ అని ఓ మీడియా కాంక్లేవ్‌లో తెలిపారు.

News March 29, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు వరుసగా నాలుగవ రోజూ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.83,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరగడంతో రూ.91,200 వద్ద కొనసాగుతోంది. అటు వెండి మాత్రం రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది.

News March 29, 2025

రూ.వందల కోట్లు పోగొట్టుకున్నాం.. రూ.35లక్షల ఆరోపణలా?: కడప మేయర్

image

AP: కడప MLA మాధవిపై మేయర్ సురేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారుతూ పబ్బం గడిపే వారు తనపై నిందలేయడం విడ్దూరంగా ఉందన్నారు. ప్రజా సేవలో తమ కుటుంబం రూ.వందల కోట్లు పోగొట్టుకుందని, అలాంటిది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తనపై కేవలం రూ.35 లక్షల ఆరోపణలా? అని ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడిన వారే నిందలేస్తారా? అని మండిపడ్డారు. 3దశాబ్దాలుగా సేవ చేశామే తప్ప రాజకీయ లబ్ధి పొందలేదన్నారు.

News March 29, 2025

ఆ నీటిని వాడొద్దు.. చాలా ప్రమాదకరం!

image

ఎండాకాలం వచ్చేసింది. నీటి ఎద్దడి ప్రారంభమైంది. దీంతో చాలా చోట్ల, ముఖ్యంగా నగరాల్లో డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసి అవే వాడుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘క్రిములు పుట్టేది, కీటకాలు గుడ్లు పెట్టేది నిల్వ నీటిలోనే. రోజుల తరబడి స్టోర్ చేసిన నీటిని వాడితే మలేరియా, చర్మవ్యాధులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఏరోజు నీరు ఆరోజు వాడుకోవడం మంచిది’ అని పేర్కొన్నారు.

News March 29, 2025

పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నటి

image

నటి అభినయ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌తో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్టు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. సినీ అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. పుట్టుకతో చెవిటి, మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

News March 29, 2025

బయటి జ్యూస్‌లు తాగుతున్నారా?

image

బయటికెళ్లినప్పుడు వేసవి వేడికి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ జ్యూస్‌లు తాగేస్తుంటాం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. HYDలో ఫుడ్ హబ్‌గా పేరొందిన DLF ప్రాంతంలో పలు జ్యూస్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు. అక్కడ కుళ్లిన పళ్లు, మురికి ఐస్ గడ్డలు, కాలం చెల్లిన పాలు, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని గుర్తించారు. దీంతో ఆ షాప్‌లకు అధికారులు నోటీసులిచ్చారు.