News March 29, 2025

రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈనెల 31తో డెడ్‌లైన్ ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

News March 29, 2025

NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు: సీఎం చంద్రబాబు

image

AP: తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఒక మహనీయుడి విజన్ నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని CM చంద్రబాబు తెలిపారు. ‘పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ TDP. NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు. పుట్టాలంటే మళ్లీ ఎన్టీఆరే పుట్టాలి. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది. మనమంతా వారసులం మాత్రమే, పెత్తందారులం కాదు. TDPని లేకుండా చేయాలని చూసినవారు కాలగర్భంలో కలిసిపోయారు’ అని అన్నారు.

News March 29, 2025

OFFICIAL: 1000 మంది మరణం

image

మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం వేలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకూ 1000 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 2000 మంది గాయపడ్డట్లు పేర్కొన్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. చాలామంది సాయం కోసం ఎదురుచూస్తుండటంతో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలోనే భారత్ తనవంతు సాయంగా 15 టన్నుల ఆహారపదార్థాలను మయన్మార్‌కు పంపింది.

News March 29, 2025

రెడ్‌బుక్ పేరెత్తితే కొందరికి గుండెపోటు వస్తోంది: లోకేశ్

image

AP: తాను ఎక్కడికి వెళ్లినా రెడ్‌బుక్ గురించి ప్రస్తావన వస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘రెడ్‌బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తోంది. కొందరు బాత్రూమ్‌లో కాలుజారి పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఇగోలు వద్దు. కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పని చేద్దాం’ అని లోకేశ్ అన్నారు.

News March 29, 2025

పాస్టర్ ప్రవీణ్ మ‌ృతి దర్యాప్తు.. పోలీసుల హెచ్చరిక

image

పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి విచారణ పారదర్శకంగా జరుగుతోందని తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సీసీ ఫుటేజీల పరిశీలన, సమాచార సేకరణ జరుపుతున్నాయి. సీఎం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

News March 29, 2025

మూడు రోజులు సెలవులే!

image

ఐటీ ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం (ఉగాది) వీకెండ్ కాగా రంజాన్ సందర్భంగా సోమవారం కూడా సెలవు ఉండనుంది. దీంతో హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు వెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మరికొందరేమో మూడు రోజులు ట్రిప్స్ లేదా దైవ దర్శనాలకు వెళ్లేందుకు బయల్దేరారు. కొందరికి రంజాన్‌కు సెలవు ఇవ్వలేదని చెబుతున్నారు. మీ ఆఫీసుల్లో సెలవుందా? ఎటైనా వెళ్తున్నారా? COMMENT

News March 29, 2025

రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPనే: లోకేశ్

image

AP: రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPకే సాధ్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘NTR అనే 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం. 43 ఏళ్ల క్రితం ఆయన పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా చూపించారు. మన పార్టీకి గల్లీ, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. TDP జెండా పీకేస్తారని ప్రగల్భాలు పలికిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు’ అని పార్టీ ఆవిర్భావ సభలో తెలిపారు.

News March 29, 2025

‘ఆర్‌జీ కర్’ ఘటన గ్యాంగ్ రేప్ కాదు: CBI

image

RGకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగింది గ్యాంగ్ రేప్ కాదని కలకత్తా హైకోర్టుకు CBI తెలిపింది. సంజయ్ రాయ్ అన్న ఒకే నిందితుడు ఆ ఘోరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం తమకు లభించిన ఆధారాలు, నిపుణుల అభిప్రాయాలూ అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని వివరించింది. అయితే కేసులో మరింత పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలున్నాయని, వాటిని విచారిస్తున్నామని కోర్టుకు విన్నవించింది.

News March 29, 2025

పోలీసుల కస్టడీకి వల్లభనేని వంశీ

image

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ జైలు నుంచి కృష్ణా జిల్లా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పీఎస్‌లలో నమోదైన కేసులకు సంబంధించి ఆయన్ను విచారించనున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుల్లో వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

News March 29, 2025

పూజకు ఉత్తమ ఫలితాలు రావాలంటే..

image

పూజ చేయడం పుణ్యఫలాన్నిస్తుంది. అయితే పూజ ఎప్పుడు ఎలా చేయాలన్నదానిపై పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘సూర్యోదయమైన 2 లేదా 3 గంటల్లోపే పూజ ముగించుకోవడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటల్లోపు పూర్తయ్యేలా చూసుకోవాలి. అప్పటి వరకు ఉండే మానసిక ప్రశాంతతతో దైవంపై ఏకాగ్రత కుదురుతుంది. పూజ అలా ఉదయాన్నే చేసేవారికి రోజంతా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది’ అని వివరిస్తున్నారు.