India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. హోటళ్ల నుంచి ప్రత్యేక బస్సుల్లో స్టేడియానికి చేరుకున్న ప్లేయర్లు నెట్స్లో చెమటోడ్చారు. డీ టీమ్ కెప్టెన్ అయ్యర్ సుమారు గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మిగిలిన ప్లేయర్లు క్యాచింగ్, బంతి త్రో, వ్యాయామం వంటివి చేశారు. ఆటగాళ్లను బయటి వ్యక్తులు కలవకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. గురువారం నుంచి రౌండ్ 2 పోటీలు ప్రారంభం కానున్నాయి.
తాడిపత్రి ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో తాటిపల్లిగా పేరొందింది. తర్వాత తాటిపర్తిగా, కొన్నేళ్ల నుంచి తాడిపత్రిగా పిలవబడుతోంది. పూర్వం ఈ ప్రాంతంలో తాటిచెట్లు ఎక్కువగా ఉండటంతో తాటిపల్లి అనే పేరు వచ్చిందట. అలాగే తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించడంతోనూ ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇక పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఆయన కుమారుడు నిర్మించారట.
ఓబులదేవర చెరువు మండలంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహమ్మదా బాద్ చెత్త శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మొక్కలు నాటారు.క లెక్టర్ మాట్లాడుతూ.. నాటిన మొక్కలు పరిరక్షించాలని కోరారు. వీటి ద్వారా భవిష్యత్లో ఆర్థిక స్వాలంబన లభిస్తుందని తెలిపారు.
దులీప్ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి RDT స్టేడియంలోని రెండు మైదానాల్లో మ్యాచులు జరగనున్నాయి. నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండియా టీం-ఏ, ఇండియా టీం-డీ మ్యాచ్ ఆర్డీటీ ప్రధాన స్టేడియంలో జరగనుంది. ఇండియా టీం-బీ, ఇండియా టీం-సీ మధ్య మరో మ్యాచ్ క్రీడాగ్రామంలోని రెండో గ్రౌండ్లో జరగనుంది. ప్రధాన స్టేడియంలో జరిగే మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులకు అవకాశం ఉంటుంది.
రానున్న 5 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణ స్వామి తెలిపారు. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 33.9 నుంచి 35.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 23.5 నుంచి 24.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 76 శాతం, మధ్యాహ్నం పూట 45 శాతం నమోదవుతుందన్నారు.
ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థి సరిత హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్ తెలిపారు. మంగళవారం గుమ్మగట్ట మండలం వెంకటంపల్లికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, వేటకొడవలి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రేమించాలని యువతిని ఫోన్లో వేధించేవాడని, ఆమె అంగీకరించకపోవడంతో వెంటపడి హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.
అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిటీ స్కాన్, రక్త నిధి కేంద్రం, ఐసీయూ తదితర విభాగాలను ఆయన కలియ తిరుగుతూ సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగా అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నెల 14 నుంచి సత్యసాయి జిల్లాలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. స్వభావ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత పేరుతో హి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు 14 నుంచి 17 వరకు సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో ఈ నెల 13వ తేదీ లోపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆల్ ఇండియా రేడియోలో ప్రతి గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేయాలన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, ఇన్-సానిటరీ లెట్రిన్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. దీంతో సత్య సాయి జిల్లాను మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారన్నారు.
Sorry, no posts matched your criteria.