Anantapur

News December 31, 2025

శిల్పారామంలో పార్కింగ్‌కు వేలం పాట

image

అనంతపురం శిల్పారామంలో 2026 జనవరి 1 నుంచి పార్కింగ్ యాక్టివిటీ నిర్వహణకు టెండర్‌లు ఆహ్వానిస్తున్నారు. ఈ టెండర్ ప్రక్రియ డిసెంబర్ 31, 2025న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శిల్పారామం పరిపాలన అధికారి కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు 88866 52051, 63090 29590 నంబర్లకు సంప్రదించాలని పరిపాలన అధికారి శివప్రసాద్ రెడ్డి వివరించారు.

News December 31, 2025

శిల్పారామంలో పార్కింగ్‌కు వేలం పాట

image

అనంతపురం శిల్పారామంలో 2026 జనవరి 1 నుంచి పార్కింగ్ యాక్టివిటీ నిర్వహణకు టెండర్‌లు ఆహ్వానిస్తున్నారు. ఈ టెండర్ ప్రక్రియ డిసెంబర్ 31, 2025న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శిల్పారామం పరిపాలన అధికారి కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు 88866 52051, 63090 29590 నంబర్లకు సంప్రదించాలని పరిపాలన అధికారి శివప్రసాద్ రెడ్డి వివరించారు.

News December 30, 2025

నీటి తొట్టెలో పడి అనంతపురం జిల్లా చిన్నారి మృతి

image

కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక రామాంజనేయులు, అశ్వని దంపతుల కుమార్తె ఈక్షిత (2) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఊపిరాడక మృతి చెందింది. ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్ల ముందే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 30, 2025

నూతన సంవత్సర వేడుకలపై SP ఆంక్షలు

image

అనంతపురంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా SP జగదీష్ ఆంక్షలు విధించారు. వేడుకలు రాత్రి 1 లోపు ముగించాలని ప్రకటించారు. రహదారులను బ్లాక్ చేసి వేడుకలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్ చేయవద్దన్నారు. సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం దుకాణాలను నిర్ణీత సమయానికి మూసివేయాలని హెచ్చరించారు.

News December 30, 2025

టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి సమావేశం

image

రాయదుర్గం టెక్స్‌టైల్ పార్క్‌లో త్వరితగతిన గార్మెంట్ యూనిట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఆనంద్ అనంతపురంలో నిర్వహించారు. ఇది వరకే ప్లాట్లు పొంది నేటికి యూనిట్ల నిర్మాణం చేపట్టని 47 మంది యూనిట్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇది చివరి అవకాశంగా తెలియజేసి కేటాయించిన ప్లాట్లలో తక్షణమే యూనిట్లను నిర్మాణం చేసేలాగా జిల్లా జౌళిశాఖ అధికారిని ఆదేశించారు.

News December 30, 2025

పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ఆయా శాఖల అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్ఠం చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలన్నారు. వారికి సకాలంలో సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు అందజేయాలన్నారు.

News December 29, 2025

అనంతపురం పోలీస్ కార్యాలయంలో వినతుల వెల్లువ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 70 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. చట్ట పరిధిలో ప్రతి పిటిషన్‌ను విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

News December 29, 2025

కలెక్టరేట్‌లో వినతుల వెల్లువ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొనగా, మొత్తం 467 అర్జీలు నమోదయ్యాయి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News December 29, 2025

జనవరి 7 నుంచి అనంతపురం జిల్లా స్థాయి పాల పోటీలు

image

పాడి రైతులకు మేలు జాతి పశుపోషణ, అధిక పాల ఉత్పత్తిపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన ‘అనంత పాలధార’ కరపత్రికలను ఆయన ఆవిష్కరించారు. జనవరి 7, 8 తేదీల్లో ఆకుతోటపల్లిలో జిల్లా స్థాయి పాల పోటీలు జరుగుతాయన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించి పాడి పరిశ్రమలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

News December 29, 2025

జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పూల నాగరాజు

image

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరిలు బాధ్యతలు స్వీకరించారు. వారిని ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.