India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విడపనకల్ మండలం కొట్టాలపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ మండలానికి చెందిన ఎలక్ట్రీషియన్ చంద్ర అనే వ్యక్తి కొట్టాలపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై నిలబడిన లారీని బైక్పై వెళ్తూ ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
గుత్తి జీఆర్పీ పరిధిలోని జక్కల చెరువు-రాయల చెరువు రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 14వ తేదీ కోర్టులలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగుతుందని, కక్షిదారులు త్వరితగతిన కేసులు పరిష్కారం కొరకు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, ఎస్సై, కోర్టు కానిస్టేబుల్స్తో ఎస్పీ జామ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని భారత మాజీ క్రికెటర్లు దర్శించుకున్నారు. ఆదివారం భారత మాజీ క్రికెటర్లు చేతన్ శర్మ, అజయ్ మల్హోత్రా, ప్రస్తుత బీసీసీఐ మేనేజర్ అమిత్ సిద్దేశ్వర్, మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ షాబుద్దీన్, తదితరులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్కు విచ్చేసిన క్రీడాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
బెళుగుప్ప మండలంలోని దుద్దెకుంటలో ఆలయం నిర్మాణం కోసం తీసిన తవ్వకాలలో గ్రామానికి చెందిన క్రాంతి అనే యువకుడికి అయ్పప్ప స్వామి విగ్రహం దొరికింది. క్రాంతి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి తనకు కలలో ఈ విగ్రహం గురించి చెప్పినట్టు తెలిపారన్నాడు. విగ్రహం 500 గ్రాముల బరువు ఉన్నట్లు చెప్పాడు. స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు.
ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద హత్యకు గురైన గుమ్మగట్ట మండలం సిరిగే దొడ్డి గ్రామానికి చెందిన మహిళ శిరీషగా పోలీసులు గుర్తించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోందని, శనివారం ఇంట్లో చెప్పి వచ్చినట్లు శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.
గుంతకల్లు పట్టణంలోని ఆంటోనీ స్ట్రీట్లో సోషల్ మీడియా వినాయకుడు కొలువుదీరాడు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉన్నందున అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ల చిహ్నాలతో వినాయకుడిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ , ఇన్స్టాగ్రామ్, ట్విటర్, లింక్డ్ ఇన్, యూట్యూబ్, తదితర సోషల్ మీడియా గుర్తులతో కలిపి రూపొందించామన్నారు.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో హత్య కలకలం రేపింది. వడ్డుపల్లి కాలువ గట్టు సమీపంలో సుమారు 22 ఏళ్ల వయసున్న యువతి తలపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు మృతదేహాన్ని గుర్తించి ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
హౌరా నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు నడుస్తున్న వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు (22831/32)ను యశ్వంతపూర్ వరకు పొడిగించారు. ఇది హౌరా నుంచి ధర్మవరం వరకు యథావిధిగా నడుస్తుంది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి రాత్రి 9:30 గంటలకు చేరుకుని హిందూపురం, యలహంక(స్టాపులు) మీదుగా యశ్వంత్పూర్కి రాత్రి 12:15కు చేరుకుంటుంది. తిరిగి యశ్వంత్పూర్లో ఉదయం 5కు బయలుదేరి ప్రశాంతి నిలయానికి ఉదయం7:53కి చేరుకుంటుంది.
శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంహెచ్.ఇనాయతుల్లాను నియమిస్తూ ఎఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఆయనను హిందూపురంలోని తన నివాసంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇనాయతుల్లా మాట్లాడుతూ.. తనకు ఈ గుర్తింపు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.