India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహాలయ పున్నమి గురించి తెలియని వారుండరు. మాంసం ప్రియులకు ఇష్టమైన పండుగ ఇది. ఇవాళ మహాలయ పౌర్ణమి. వాడుకలో ఇది మాల పున్నమిగా ఉంది. ఇవాళ మటన్ తినడం పూర్వం నుంచి వస్తుందని పెద్దలు చెబుతారు. చంద్రుడిని చూస్తూ ముక్క తినాలంటారు. అందుకే తెల్లవారుజామునే పలు గ్రామాల్లో మటన్ వండుతారు. మాలపున్నమి కావడంతో మటన్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.

రైతులకు అవసరమైన మోతాదులో యూరియాను అందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రైవేట్ వారికి 50శాతం, ప్రభుత్వ ఆధ్వర్యంలో 50శాతం విక్రయాలు జరిగేవన్నారు. ఈసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 70శాతం, ప్రైవేట్ ఆధ్వర్యంలో 30శాతం పంపిణీ జరుగుతున్నట్లు తెలిపారు. మండల అధికారులు రోజూ దుకాణాల్లో తనిఖీలు చేయాలన్నారు.-

పామిడిలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న యాదవ్ అరుణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదగా అందుకున్నారు. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్తో కలిసి అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయ వృత్తిపై మరింత బాధ్యత పెంచిందన్నారు.

ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈఫిల్ టెక్ సొల్యూషన్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించింది. 97 మంది విద్యార్థులు హాజరు కాగా, 65 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈఫిల్ టెక్ సొల్యూషన్ డైరెక్టర్ కిశోర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, ప్లేస్మెంట్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. విజయవాడలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అనంతపురం JNTU కెమికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శారదా ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్నారు. ఈమె గతంలో JNTU ఇంజినీరింగ్ కళాశాలలోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఈమె యూనివర్సిటీ NSS సెల్ కో-ఆర్డినేటర్గా ఉన్నారు.

అనంతపురం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా వీరికి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అవార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఈనెల 5న జరిగే మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ పి.జగదీశ్ ఆదేశించారు. శాంతి కమిటీల సమావేశాలు నిర్వహించి, మతసామరస్యంతో పండుగ ర్యాలీ కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ముస్లింలు నిర్వహించే ర్యాలీలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అనంతపురం జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. పామిడిలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న యాదవ్ అరుణ, ఆత్మకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉప్పరపల్లి శైలజ, గుత్తి మండలం అబ్బేదొడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బండి శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈనెల 5న సీఎం చేతుల మీదుగా విజయవాడలో అవార్డులు అందుకోనున్నారు.

పుట్లూరుకు చెందిన తలారి శ్రీనివాసులు చిన్న రైతు. కుక్కల దాడిలో తన గొర్రెలన్నింటినీ కోల్పోయి తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యారు. ముగ్గురు ఆడపిల్లలు. అందులో ఒకరు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. కుటుంబం తీవ్ర సంక్షోభంలో పడింది. పరిస్థితిని MP అంబికా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం తక్షణమే స్పందించి రూ.2.4 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఈ చర్య రైతుకు మానసికంగా మద్దతునిచ్చింది.

అనంతపురం జిల్లాలో బీడు భూములు ఉండకూడదని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. బీడు భూమిలో ఉద్యాన పంటలు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ ఉండాలని చెప్పారు. ఏడు నియోజకవర్గాలలోని ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తగా ఎంపిక చేసిన గ్రామాలకు వార్షిక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.