India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయ పరిస్థితులపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఆగ్రో ఛైర్మన్ నవీన్ నిశ్చల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలు, నాయకులు సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
విజయవాడలో వరదలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించినట్టు ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 10,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారని పుట్టపర్తి తాలూకా ఎన్జీవో అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు.
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా వైద్య అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2023 నుంచి 2024 వరకు ఐదు మాతృ మరణాలు, 32 శిశు మరణాలు సంభవించడం దారుణమన్నారు. ప్రతి మరణానికి కారణాలు క్షుణ్ణంగా విశ్లేషించాలన్నారు. వైద్యశాలలో అన్ని సదుపాయాలు కల్పించిన తీరు మారలేదు అన్నారు. కార్యక్రమంలో సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.
భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా చరిత్ర లిఖించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు మన అనంతపురంతో ప్రత్యేక అనుబంధం ఉంది. స్వాతంత్య్రానికి ముందు తన ఉద్యోగ రీత్యా అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ సమయంలో నగరంలోని రెండో రోడ్డులో ఓ అద్దె ఇంట్లో కొంతకాలం నివసించారు.
అనంతపురంలో దులీఫ్ ట్రోఫీ మ్యాచ్కు విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ్టి మ్యాచ్కు ప్రేక్షకులు భారీగా తలివచ్చారు. స్టేడియం ఫుల్ అయింది. ఎండతాకిడి లేకుండా తడికెలు ఏర్పాటు చేశారు. బౌండరీ వెళ్లినప్పుడల్లా ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తించారు. కరవు సీమ ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుండటం ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలతో అనంతపురం స్టేడియం సుందరంగా కనిపిస్తోంది.
courtesy: sakshi
అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో డీ టీమ్ ప్లేయర్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. 48/6తో జట్టు కష్టాల్లో ఉండగా అక్షర్ 78 బంతుల్లో 53* పరుగులతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఐదుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్కే అవుటై నిరాశపరిచారు. డీ టీమ్ బౌలర్లలో విజయ్ కుమార్, హిమాన్షు, కాంబోజ్ చెరో రెండు వికెట్లతో రాణించారు. క్రికెట్ అభిమానులతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ ప్రపంచంలో గురువే సమస్తం. ఏ రంగంలో రాణించిన వారైనా, సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారైనా ఒక గురువు వద్ద పాఠాలు నేర్చుకున్న వారే. గురువు అందించిన విజ్ఞానం, ప్రోత్సాహం, స్ఫూర్తితో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారే. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించేది గురువులే. మరి మీ జీవితంలో మీ ఎదుగుదలకు తోడ్పడిన, మీకు ఎంతగానో నచ్చిన గురువు ఎవరు? కామెంట్ చేయండి..
#HappyTeachersDay
అనంతపురంలో కాసేపట్లో దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. C, D జట్లు తలపడనున్నాయి. అయితే స్టేడియంలోకి లాప్టాప్లు, కెమెరాలు, బైనాక్యులర్లు, బ్యాటరీలు, బ్యానర్లు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్స్, షార్ప్ మెటల్స్ తదితర వస్తువులను అనుమతించమని, వాటిని వెంట తీసుకురావొద్దని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల కోసం సీ, డీ, ఈ, ఎఫ్ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీరు గేట్-1 నుంచి లోపలికి ప్రవేశించాలి.
గత నెల 20న రాత్రి నల్లమాడ పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ చోరీ చేసిన దొంగను బుధవారం ఇన్ఛార్జ్ ఎస్ఐ వెంకటరమణ స్థానిక వైఎస్సార్ సర్కిల్లో అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ వై.నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు సాయికుమార్ నుంచి కంప్యూటర్ రికవరీ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా వాసులు తీసిన ‘సేద్యం‘ మూవీ పోస్టర్ను కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలపై కళ్ళకు కట్టినట్లుగా ఈ సేద్యం మూవీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సేద్యం మూవీ డైరెక్టర్ చంద్రకాంత్, తరిమెల శేషు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.