Anantapur

News September 2, 2024

BREAKING: అనంతపురం చేరుకున్న భారత క్రికెటర్లు

image

అనంతపురం జిల్లాలో 5వ తేదీ నుంచి జరగనున్న దులీప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు అనంతపురం చేరుకున్నారు. బెంగళూరు నుంచి నగరానికి చేరుకున్న వారికి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతపురం వచ్చిన వారిలో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, హర్హదీప్ సింగ్, పడిక్కల్, తుషార్ దేశ్ పాండే, తదితర ఆటగాళ్లు ఉన్నారు. అలెగ్జాండర్, మాసినేని స్టార్ హోటళ్లలో బస చేయనున్నారు.

News September 2, 2024

ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి అనంతపురం జిల్లా జయకేతనం

image

నరసరావుపేటలో అండర్-14, 19 బాలబాలికల విభాగాలలో జరిగిన 18వ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి అనంతపురం జిల్లా రెండో స్థాయిలో నిలిచిందని జిల్లా కార్యదర్శి మనోహర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు గుంటూరు జట్టుతో తలపడగా అనంతపురం జట్టు 4-0 గోల్స్‌తో గెలిచిందన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో చిత్తూరు జిల్లా జట్టుతో ఒక గోల్ తేడాతో ఓడిపోయిందన్నారు.

News September 2, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రామదాసు పేట వద్ద బైక్ కింద పడి యువకుడు దుర్మరణం చెందాడు. నార్పలకు చెందిన రాజశేఖర్ బైక్‌లో గుత్తి నుంచి అనంతపురం వస్తుండగా కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 2, 2024

భూసేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

image

వివిధ జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్, AP ట్రాన్స్కో, రైల్వే, APIIC, తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చిత్తశుద్ధితో చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.

News September 2, 2024

గుమ్మగట్ట నుంచి టీచర్స్ అటెండెన్స్ చాలా తక్కువగా నమోదు: కలెక్టర్

image

జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతిరోజు టీచర్స్ అటెండెన్స్‌పై దృష్టిపెట్టాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. పుట్లూరు నుంచి 100% అటెండెన్స్ నమోదయిందని, గుమ్మగట్ట నుంచి టీచర్స్ అటెండెన్స్ చాలా తక్కువగా నమోదయిందన్నారు. టీచర్స్ అటెండెన్స్ పెరిగేలా చూడాలన్నారు. మున్సిపల్, మండల పరిధిలో ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టాలని ఆదేశించారు.

News September 2, 2024

జిల్లా పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 132 ఫిర్యాదులు

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి 132 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ పీ.జగదీశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన, నాణ్యతగా పరిష్కారం చూపాలనే ప్రభుత్వం సంకల్పం మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.

News September 2, 2024

‘పెర్త్’ తరహాలో అనంతపురం పిచ్‌!

image

మరో మూడ్రోజుల్లో అనంతపురం వేదికగా దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ నెల 5న జరగనున్న తొలి మ్యాచ్‌లో C, D జట్లు తలపడతాయి. ఈ టోర్నీకి వేదిక కానున్న RDT మైదానంలోని పిచ్ ఆస్ట్రేలియాలోని ‘పెర్త్‌’ను పోలి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమట. ఈ గ్రౌండ్‌లో 2004 నుంచి 2013 వరకు 15 మ్యాచులు జరగ్గా పేసర్లు 345, స్పిన్నర్లు 96 వికెట్లు తీశారు.

News September 2, 2024

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారూ: బండారు శ్రావణి

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల కోసం పనిచేసే గొప్ప వ్యక్తి అని కొనియాడుతూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు తమ అధినేత బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు చోట్ల అల్పాహారం పంపిణీ, రోగులకు పండ్లు, బ్రెడ్లు వంటివి అందజేస్తున్నారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

News September 2, 2024

నేడు SKUలో జరగాల్సిన పరీక్షలు వాయిదా

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలను భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. నేడు జరగాల్సిన పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహిస్తామని ఈ మార్పును విద్యార్థులు గమనించాలని కోరారు.

News September 2, 2024

నేడు అనంతపురానికి భారత క్రికెటర్లు

image

అనంతపురంలో జరగనున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు నేడు నగరానికి చేరుకోనున్నారు. సీ, డీ జట్ల ప్లేయర్లు మాత్రమే నేడు వస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత వారు నగరానికి చేరుకుంటారు. త్రీ స్టార్ హోటల్ అలెగ్జాండర్‌లో బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సీ జట్టుకు రుతురాజ్, డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహిస్తారు. 8వ తేదీ తర్వాత బెంగళూరు నుంచి ఏ, బీ జట్లు అనంతపురానికి చేరుకుంటాయి.