India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. కమలనగర్లోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా జరుగుతున్నాయని వివరించారు. అధికారులు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నట్లు వెల్లడించార
ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 35°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
పార్టీ మార్పుపై ప్రచారాన్ని JC పవన్ రెడ్డి కొట్టిపారేశారు. తాను టీడీపీలో ఉన్నానని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్పడానికే మాజీ మంత్రి శైలజానాథ్ తనను కలిశారని, నిర్ణయం తీసుకున్నాక తాను ఏమి చేయగలనని, ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అనంతపురం జిల్లాలో రూ.1000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలతో ఎంవోయూ కుదర్చగలిగానని చెప్పారు.
అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నేటి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
హిందూపురంలోని ఆటోనగర్లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. బందువులు వారిని వెలికితీసి హిందూపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.
గుమ్మగట్ట మండలం గోనబావి క్రాస్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ శ్రీకాంత్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆటోలో పనిమీద రాయదుర్గం వెళ్తుండగా మార్గమధ్యలో బోల్తా పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన పేరం స్వర్ణలత నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. గతంలో ఈమె వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పని చేశారు.
వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా అనంతపురం నగరానికి చెందిన కేఎల్ దేవి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ కోసం కృషి చేస్తానని, మహిళా హక్కుల కోసం పోరాడతానని ఆమె పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా పోలీసు జాగిలం ‘డాలీ’ అందించిన సేవలు మరువలేనివి ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో డాలి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. 11 ఏళ్లు జిల్లా పోలీస్ శాఖకు సేవలందించిందని కొనియాడారు. జిల్లాలో జరిగిన అనేక హత్యలు, దొంగతనాల కేసుల్లో నేరస్థులను పట్టించిందన్నారు. డాలీ పదవీ విరమణ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.