India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ కాయల సంత ప్రారంభమైంది. గురువారం టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.24,500 పలికాయి. మార్కెట్కు నిన్న 520 టన్నుల చీనీ కాయలు వచ్చాయి.
☞ ఇక కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా రూ.8 పలికింది. కనిష్ఠంగా రూ.5 ప్రకారం విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్కు 270 టన్నుల సరకు వచ్చింది.
శింగనమల నియోజకవర్గం జంతులూరు గ్రామంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ప్రభుత్వం తరఫున అరకు కాఫీ స్టాల్ ఎమ్మెల్యే బండారు శ్రావణి మంత్రి సంధ్యారాణిని కోరారు. సచివాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే నియోజకవర్గంలోని ఎస్టీలకు సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం మంత్రి గొట్టిపాటిని కలిసి నియోజకవర్గంలో విద్యుత్ లైన్ మ్యాన్ల కొరత లేకుండా చేయాలని కోరారు.
ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు కుమారుడు ద్వారకనాథ్ (4) గురువారం నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తాత, నానమ్మ పనిలో ఉండగా బాలుడు ఇంటి వెనకాల ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
ఉరవకొండ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై ఉంచి చిన్న రథంపై ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. అనంతరం యథాస్థానానికి చేర్చారు. అంతకుముందు చంద్రమౌళీశ్వరస్వామి వారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
గుంతకల్లు మండల పరిధిలోని కసాపురంలో వద్ద జరిగిన పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి రామాంజనేయులు, బావ మారుతి కలిసి భారతి (21)ని హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కాగా కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో తండ్రి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా కదిరి నియోజవర్గం తలుపుల మండలానికి చెందిన పూల శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారీగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకం అమలులో జిల్లాని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
గుంతకల్లు మీదుగా ప్రయాణం సాగించే పలు ప్యాసింజర్ రైళ్లు కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తిరిగి ఆ రైళ్లు గుంతకల్లుకు చేరుకునేందుకు ఈ నెల చివరి వరకూ పడుతుందని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి-కదిరిదేవరపల్లి (57405) ప్యాసింజర్ రద్దును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించామన్నారు. కదిరిదేవరపల్లి-తిరుపతి(57406) ఈనెల 31, గుంతకల్లు-తిరుపతి(57404) 30, తిరుపతి-గుంతకల్లు(57403) 31వ తేదీ వరకు తిరగవన్నారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు 1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ కోసం ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 8న నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.