Anantapur

News March 4, 2025

వాట్సప్ గవర్నర్స్‌పై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

వాట్సప్ గవర్నర్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలని, పారదర్శకమైన పరిపాలన అందించాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. త్వరలో వాట్సప్ గవర్నర్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News March 3, 2025

ప్రజల నుంచి 330 ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి 330 ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు.

News March 3, 2025

రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం చేనేతకు ఆహ్వానం

image

ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్ నాగరాజుకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Vividtha Ka Amrit Mahotsav కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో ధర్మవరం పట్టు చీరల ప్రదర్శన కోసం నాగరాజు ఆహ్వానం అందుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.

News March 3, 2025

విషాద ఘటనపై మంత్రి పయ్యావుల దిగ్భ్రాంతి

image

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తన మనసును కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. కాగా ఈ విషాద ఘటనలో ముగ్గరు అక్కాచెల్లెళ్లు, మూడు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే.

News March 3, 2025

22,960 మంది విద్యార్థులు.. ఉ.9 నుంచి పరీక్ష

image

ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్‌ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. అనంతపురం జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,960 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students

News March 2, 2025

కూడేరు రోడ్డు ప్రమాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

image

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సరస్వతి(32) అక్కడిక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ(42), యోగేశ్వరి(40) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జ్ఞానాన్షిక, అచ్చిత్ కుమార్ స్వామి, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పెన్నహోబిలం నుంచి అనంతపురం PVKK కళాశాల విద్యార్థులు కారులో వస్తూ ఆటోను ఢీకొట్టారు.

News March 2, 2025

అనంత: వడిబియ్యం పోసుకొని వస్తూ తల్లి, కూతురు దుర్మరణం

image

అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూడేరు సమీపంలో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన సరస్వతి(32), ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ మృతిచెందారు. మృతురాలు గార్లదిన్నె మండలం మర్తాడులో వడిబియ్యం పోసుకొని బంధువులతో కలిసి మెట్టినింటికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదంలో గాయపడిన నీలమ్మ(50) చికిత్స పొందుతూ మృతిచెందారు.

News March 2, 2025

అనంత: విషాదం.. తల్లితో పాటు 3 నెలల కుమార్తె మృతి

image

కూడేరు మండలం కమ్మూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తె మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న సరస్వతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కుమార్తె 3 నెలల చిన్నారి మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.

News March 2, 2025

అనంత: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

image

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రాజు, ఆయన సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News March 2, 2025

ఉరవకొండ : కేజీ చికెన్ ఎంతంటే..?

image

బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు నెల రోజుల పాటు చికెన్‌కు దూరంగా ఉన్నారు. అటు మటన్ తినాలని ఉన్నా మధ్య తరగతి ప్రజలు రేట్లు చూసి తినలేక పోయారు. ప్రస్తుతం కేసులు లేకపోవడంతో చికెన్ మార్కెట్లు వద్ద ప్రజలు భారీగా కొనుగోళ్ల చేస్తున్నారు. ప్రస్తుతం ఉరవకొండలో కేజీ చికెన్ ధర రూ..170- 180 వరకు ఉంది. మటన్ కేజీ రూ.700, చేపలు రూ.120 ఉంది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.