India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు వద్ద మత్య్సకారులకు భారీ చేప చిక్కింది. మండల పరిధిలోని పెండేకల్లు రిజర్వాయర్లో చేపలు పట్టగా దాదాపు 25 కేజీల చేప వలలో పడింది. దానిని విక్రయించేందుకు యాడికికి తీసుకువెళ్లారు. ఈ చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు. మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు.
తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 200 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 200 మంది పోలీసులు, 30 మంది స్ట్రైకింగ్ బలగాలతో పట్టణ శివారుల్లో పికెట్, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రిడ్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
జిల్లాలోని అర్హులైన రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక బృందాలకు రుణాల మంజూరు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో 2024-25 త్రైమాసిక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యసాధన ప్రగతిపై బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి రుణాల మంజూరు చేయాలని ఆదేశించారు.
అనంతపురం జిల్లా అదనపు ఎస్పీగా రమణమూర్తి బుధవారం బాద్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పని చేస్తామని తెలిపారు.
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కంప్యూటరైజేషన్ ప్రక్రియను 100% సెప్టెంబర్ మూడో తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈఓలతో ఫాక్స్ కంప్యూటరైజేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైతుల సభ్యత్వానికి సంబంధించి 21 శాతం మాత్రమే ఆన్లైన్ చేశారనిని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని శ్రీ సత్యసాయి కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన వినతులను సంబంధిత శాఖల హెచ్వోడీలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో కురిసిన వర్షాలకు పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. అరటి, టమాటా, ఎండు మిరప, పచ్చిమిరప, వరి, పత్తి, మొక్కజొన్న, వేరుసెనగ వంటి పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 920 హెక్టార్లలో రూ.4,07 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. దీనిని ప్రభుత్వానికి పంపుతాయని జిల్లా వ్యవసాయాధికారిణి ఉమా మహేశ్వరమ్మ తెలిపారు.
అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండల పరిధిలోని కడప రోడ్డులో లారీ, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు తుదిశ్వాస విడిచారు. ఘటనపై తాడిపత్రి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
కేటాయించిన లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని జిల్లా పరిషత్లో ఉన్న డీపీఆర్సీ భవనంలో జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. గత జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం ఎన్నికల సమయం కావడంతో ప్రజలకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వలేకపోయారన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అనంతపురం ఎస్పీ జగదీశ్ తాడిపత్రికి చేరుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని తాడిపత్రిలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. తాడిపత్రిలో అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.