India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, కదిరితో పాటు మండల కేంద్రాలలో స్థిరమైన ధరలకు నిత్యవసర వస్తువులు అందిస్తున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కెర, బియ్యం మిల్లుల యజమానులతో చర్చించి నాణ్యమైన నిత్యావసర వస్తువులు స్థిరమైన ధరలకు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని వినియోగదారులు వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని గుండుమలలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించిన విషయం తెలిసిందే. ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు పలువురు చంద్రబాబుతో కలిసి ఫొటో దిగేందుకు పోటీపడ్డారు. సీఎం తమ గ్రామానికి వచ్చి గ్రామ వీధుల్లో తిరుగుతుండటంతో హర్షం వ్యక్తంచేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘మమ్మల్ని క్షమించండి కామ్రేడ్. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు తమ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. 5 ఏళ్ల పరదాల ప్రభుత్వం పోయినా కొంతమంది పోలీసుల తీరు మారలేదు’ అంటూ Xలో పోస్టు చేశారు.
మడకశిర నియోజకవర్గంలో సీఎం పర్యటన విజయవంతమైందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రజా ప్రతినిధులు, కానీ శాఖల అధికారుల సహకారంతో పర్యటన విజయవంతం అయిందన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ముగిసింది. మడకశిర మండలం గుండుమలలో ప్రసంగం అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 6.05 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకున్నారు. ఇక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం బయలుదేరి వెళ్లారు. వర్షం కారణంగా హెలికాప్టర్ ఆలస్యంగా పుట్టపర్తికి చేరుకుంది.
CM చంద్రబాబు మడకశిర మండలం గుండమలలో గురువారం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రజావేదిక వద్ద మాట్లాడారు. కాగా, ప్రసంగం ప్రారంభంలో ‘ఎల్లరూ చెన్నాగిదిరా’ అంటూ కన్నడలో మాట్లాడి సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. అంతకుముందు ఆయన పలువురు పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. గుండుమల ప్రాంతం కర్ణాటకకు దగ్గర ఉండటంతో ఎక్కువమందికి కన్నడపై అవగాహన ఉంటుంది.
పెన్షన్ లబ్ధిదారురాలు ఓబులమ్మకు ఇల్లు కట్టిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ను ఆదేశించారు. మడకశిర మండలం గుండుమలలో చంద్రబాబు ఓబులమ్మకు పెన్షన్ అందజేసిన అనంతరం ఆమె సభపై మాట్లాడారు. కుమారులు వేరేచోట ఉద్యోగాలు చేసుకుంటున్నారని, తనకు ఇల్లు సరిగా లేకపోవడంతో వారు ఇంటికి కూడా రావడం లేదని అన్నారు. దీంతో సీఎం స్పందిస్తూ త్వరలోనే ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అవుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ‘రాప్తాడు నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉంది. నియోజకవర్గ మహిళలు అనంతపురం, సత్యసాయి జిల్లాల పరిధిలో ఎక్కడైనా ఫ్రీగా తిరిగే విధంగా అనుమతివ్వాలని సీఎం చంద్రబాబును కోరతాం’ అని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పింఛన్ పంపిణీ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలో 90.93, సత్యసాయి జిల్లాలో 88.66 శాతం పంపిణీ పూర్తయింది. అనంతపురం జిల్లాలో 2,85,219 మందికి గానూ 2,59,356 మందికి, సత్యసాయి జిల్లాలో 2,69,207 మందికి గానూ 2,38,681 మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు.
తన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ర్పచారం చేస్తున్నారని అనంతపురం <<13742806>>ఎమ్మెల్యే<<>> దగ్గుబాటి ప్రసాద్ మండిపడ్డారు. ‘అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా అనంతపురం క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పా. పేకాట నిర్వహణకు సహకరిస్తానని చెప్పలేదు. నేను అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. పేకాట శిబిరాలతో డబ్బు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు’ అని ఎమ్మెల్యే తెలిపారు.
Sorry, no posts matched your criteria.