Anantapur

News July 23, 2024

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

image

సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామంలో ఆదినారాయణ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం ఆయన ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనిలో నిమగ్నమైన ఆయన ఆకస్మికంగా కిందపడ్డారు. అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటన పెద్దన్నవారిపల్లిలో విషాదం నింపింది.

News July 23, 2024

రాజధానికి రూ.15 వేల కోట్లు.. మంత్రి సత్యకుమార్ ట్వీట్

image

ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయించడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఏపీ ​ప్రజల కలల రాజధాని నిర్మాణం కోసం స్పెషల్​ సపోర్ట్​కింద కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాదికి గానూ రూ.15,000 కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి ట్వీట్ చేశారు.

News July 23, 2024

అనంతపురం జిల్లాకు హెలికాప్టర్ల తయారీ సంస్థ రాబోతుందా?

image

భారత్‌లో H125 హెలికాప్టర్ల కోసం ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌బస్‌ 8 ప్రదేశాలను ఎంపిక చేసింది. 2015-16 మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మం. పాలసముద్రం దగ్గర ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. 250 ఎకరాలు కేటాయించేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్‌బస్ 8 ప్రాంతాలను ఎంపిక చేయటంతో అందులో అనంతపురం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.

News July 23, 2024

అనంతపురంలో 2, సత్యసాయి జిల్లాలో ఒక హత్య: ఏపీ పోలీస్

image

కూటమి ప్రభుత్వంలో 40 రోజుల్లో 31 మందిని రాజకీయంగా హత్య చేశారని వైసీపీ చేసిన ట్వీట్‌ను పోలీసులు ఖండించారు. జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో 4 హత్యలు జరిగాయని తెలిపారు. అందులో అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కో హత్య జరిగిందని చెప్పారు. మృతుల్లో ముగ్గురు టీడీపీ, ఒకరు వైసీపీ అని తెలిపారు. పాత కక్షలు, రాజకీయ విభేదాలతో శ్రీసత్యసాయి జిల్లాలో ఒక హత్య జరిగిందని వివరించారు.

News July 23, 2024

అనంతపురం జెడ్పీ ఛైర్‌పర్సన్ గన్‌మెన్ల తొలగింపు

image

అనంతపురం జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మకు రాష్ట్ర ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది. గత ప్రభుత్వం ఆమెకు 1+ 1 గన్‌మెన్లను కేటాయించింది. తాజాగా ఉన్నతాధికారులు గన్‌మెన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారు బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.

News July 23, 2024

పెనుకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

పెనుకొండ మండలం మునిమడుగుకి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో సోమవారం రాత్రి మృతి చెందారు. మునిమడుగు చెందిన అశోక్, నరేంద్ర బైక్‌లో గుట్టూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుతున్నారు. బైకు అదుపుతప్పడంతో అశోక్ అక్కడిక్కడే చనిపోయారు. నరేంద్రను పెనుకొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై కియా ఎస్ఐ రంగడు పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి మృతదేహాలను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.

News July 23, 2024

అక్రమ మద్యం, నాటు సారాపై దృష్టి పెట్టండి: శ్రీసత్యసాయి ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో అక్రమ మద్యం, నాటు సారా, గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాలోని సేబ్ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, పనితీరు, వారి విధుల గురించి ఎస్పీ ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 23, 2024

కలెక్టరేట్‌లో ‘అనంత మమతా నిలయం’ ప్రారంభం

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వినూత్నంగా ఆలోచించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు, కలెక్టరేట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా అనంతపురం కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. ఆ గదికి ‘అనంత మమతా నిలయం’ అనే పేరు పెట్టారు. చిన్నారులు ఆడుకునేలా బొమ్మలు, గోడలపై అందమైన చిత్రాలను చిత్రీకరించారు.

News July 23, 2024

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి: అనంత ఎస్పీ

image

మీకోసం కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను పోలీస్ సిబ్బంది వెంటనే పరిష్కరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ మురళీ కృష్ణ కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 109 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.

News July 23, 2024

పారా క్రీడాకారులను అభినందించిన అనంత కలెక్టర్

image

కర్ణాటకలోని బెంగళూరు వేదికగా కంఠీరవ స్టేడియంలో జులై 15 నుంచి 17 వరకు జరిగిన 13వ జాతీయ స్థాయి సబ్ జూనియర్, జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2024లో పతకాలను సాధించిన అనంతపురం జిల్లా పారా క్రీడాకారులను కలెక్టర్ వినోద్ కుమార్ అభినందించారు. జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. దేశం తరపున పాల్గొనేందుకు ఇప్పటి నుంచే సాధన చేయాలని క్రీడాకారులకు కలెక్టర్ సూచించారు.