Anantapur

News January 13, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి నేడు మీరూ భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకండి: ఎస్పీ

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చట్ట వ్యతిరేక వ్యతిరేక కార్యక్రలాపాల జోలికి వెళ్లకుండా ఉండాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సూచించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. భోగి మకర సంక్రాంతి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడరాదని జిల్లా ప్రజానీకానికి సూచించారు.

News January 12, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

కోడి పందేలు చట్ట విరుద్ధం: కలెక్టర్

image

కోడి పందేలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని అనంతపురం కలెక్టర్ డా. వినోద్ కుమార్ అన్నారు. అదివారం బెలుగుప్ప మండలం అంకంపల్లిలో సంబంధిత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కోడి పందేలు నిర్వహించడం, అందులో పాల్గొనడం రెండూ నేరమేనన్నారు. ఆలా చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. ప్రజలు ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదని సూచించారు.

News January 12, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

శ్రీవారి సన్నిధిలో బండారు శ్రావణి

image

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తల్లి బండారు లీలావతితో కలిసి ఆమె వేంకన్నకు మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు ఆమెను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం దక్షిణ కాశీగా పేరున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలిసి సత్కరించారు.

News January 12, 2025

అల్లుడి బైక్‌ ఢీకొని మామ మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మం. చిగమంత్ ఘట్టలో బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిత్తప్ప పొలానికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తన అల్లుడు మహేశ్ ద్విచక్ర వాహనంపై అజాగ్రత్తగా వెళ్లి చిత్తప్పను ఢీ కొన్నాడు. ఘటనలో అతడికి గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News January 11, 2025

డి.హీరేహాళ్: పోలీసుల ఉరుకుల పరుగులు.. 2 గంటల్లో కేసు క్లోజ్ 

image

డి.హీరేహాళ్ మండలం జాజరకల్లుకు చెందిన నలుగురు మైనర్‌లు శనివారం తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లిపోయారు. తల్లితండ్రులు వారిని మందలించారని ఇంటి నుంచి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు ఎస్సై గురుప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వెంకట రమణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. పిల్లలు కర్ణాటక రాష్ట్రం ఉలిగిలో ఉన్నట్లు గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు.

News January 11, 2025

M.Tech, B.Pharmacy పరీక్షా ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన M.Tech 2-1, B.Pharmacy 4-1 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News January 11, 2025

చిన్నారులకు ఆధార్ జనరేషన్ పూర్తి చేయాలి: అనంత కలెక్టర్

image

జిల్లాలో 0-6 ఏళ్ల చిన్నారులకు ఆధార్ జనరేషన్ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆధార్ డీఎల్ఎఎంసీ సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 0-6 ఏళ్ల చిన్నారులు 75,287 ఉన్నారని, ఇప్పటి వరకు 5,798 మందికి ఆధార్ జనరేషన్ పూర్తయిందని తెలిపారు.

error: Content is protected !!