Anantapur

News January 10, 2025

M.Tech, B.Pharmacy పరీక్షా ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన M.Tech 2-1, B.Pharmacy 4-1 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News January 10, 2025

పుట్టపర్తిలో వివాహిత ఆత్మహత్యాయత్నం

image

పుట్టపర్తిలోని చిత్రావతి నదిలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన నదిలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని కుమ్మరపేటకు చెందిన నాగవేణిగా గుర్తించారు. భర్త బాలరాజు ఆటోతో జీవనం సాగిస్తున్నారు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు.

News January 10, 2025

అనంతపురం జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం

image

అనంతపురం జిల్లాలో భారీ మొత్తంలో బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 12 మంది బంగారు వ్యాపారులు కేరళ నుంచి రైలులో వస్తుండగా.. సుంకం చెల్లించని దాదాపు 13 కేజీల బంగారాన్ని గుర్తించారు. పంచనామా నిమిత్తం తాడిపత్రికి వచ్చి కస్టమ్స్ కార్యాలయం నుంచి విజయవాడకు తరలించారు.

News January 10, 2025

సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ

image

బెంగళూరులోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో గురువారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించి, వాటిపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రైతులకు ఇన్సెంటివ్ అందించాలని, రీలింగ్ యూనిట్ మెషిన్లకు జీఎస్టీ రద్దు చేయాలని కోరారు.

News January 9, 2025

పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎన్హెచ్‌ఏఐ, రైల్వే, రోడ్లు భవనాలు, అటవీ శాఖ, చిన్న నీటిపారుదల, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగే భూసేకరణకు సంబంధించి జరిగే సమావేశాలలో ఎన్‌హెచ్ పీడీ హాజరుకావాలని హెచ్చరించారు.

News January 9, 2025

ఆలయాల వద్ద ప్రత్యేక భద్రత: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. శుక్రవారం జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలకు వచ్చే ప్రజలందరూ పోలీసులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

News January 9, 2025

‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే రద్దు చేశాం: బాలకృష్ణ

image

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అనంతపురంలో ఈ రోజు జరగాల్సిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. ‘తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విషాధ సమయంలో ఈవెంట్ జరపడడం సముచితం కాదు. అందుకే రద్దు చేశాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది’ అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తెలిపారు.

News January 9, 2025

మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దు

image

తిరుపతిలో తొక్కిసలాట కారణంగా మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది. బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ అనంతపురంలో జరిగే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. సినీ ప్రముఖులతోనే ఈవెంట్ యథాతథంగా కొనసాగనుంది.

News January 9, 2025

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

image

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భ్రమరాంబ దేవి తెలిపారు. అందులో ఎఫ్ఎన్‌వో 18, సానిటరీ అటెండర్, వాచ్‌మెన్ 11 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు ఈనెల 20వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 9, 2025

రాయదుర్గం కేటీఎస్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల ప్రతిభ

image

రాయదుర్గంలోని కేటీఎస్ డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ ద్వితీయ ఏడాది చదువుతున్న యోగేశ్వరి, గోపాల్ ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారిలో నిలిచారు. ఇటీవల 15 రోజుల పాటు ఉత్తర కాశీలోని హిమాలయ పర్వతారోహణకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 17 ఎన్సీసీ కమాండెంట్లకు చెందిన క్యాడెట్లు హాజరుకాగా ఏపీ తరఫున యోగేశ్వరి, గోపాల్ ఉండడం గమనార్హం. కళాశాల బృందం వారికి ఘన స్వాగతం పలికి సన్మానించారు.

error: Content is protected !!