Anantapur

News July 21, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

పుట్లూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పుట్లూరు మండలం ఏ. కొండాపురం గ్రామం వద్ద అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై లారీ-కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన నీలకంఠాచారి మృతి చెందారు. అయితే గత ఎన్నికలలో తాడిపత్రి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News July 21, 2024

ఏపీఐఐసీ భూముల పై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో టిడ్కో గృహాలు వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయో సమగ్ర నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోనే మినీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈనెల 11న పుట్టపర్తి సాయి ఆరామా సమావేశం మందిరంలో జిల్లా అభివృద్ధిపై పలు అంశాలపై ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాల సమగ్ర నివేదికలపై ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

News July 20, 2024

BREAKING: అనంత జిల్లాలో పలువురు ఉన్నతాధికారుల బదిలీ

image

అనంత జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జడ్పీ సీఈవో వైకోమ్ నిదియా దేవి, నగర పాలక కమిషనర్ మేఘా స్వరూప్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేతన్ గార్గ్‌ను రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్‌గా, వైకోమ్ నిదియా దేవిని రాజంపేట సబ్ కలెక్టర్‌గా, మేఘా స్వరూప్‌ను మదనపల్లి సబ్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. అయితే వీరి స్థానాల్లో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు.

News July 20, 2024

విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే క్షమించేది లేదు: మంత్రి సవిత

image

బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా ఉపేక్షించబోమని బీసీ సంక్షేమ మంత్రి సవిత శనివారం హెచ్చరించారు. వర్షాలు పడుతుండటం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండటంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, భోజనం, వసతుల విషయంలో రాజీ పడకుండా చూసుకోవాలన్నారు. వ్యాధులు వ్యాపించకుండా మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

News July 20, 2024

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు: కలెక్టర్

image

వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన నిబంధనల ప్రకారం జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధార పడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే ప్రతిసారి రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందుతాయని అన్నారు.

News July 20, 2024

జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా కృష్ణయ్య బాధ్యతల స్వీకరణ

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కృష్ణయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన అనంతపురం జేఎన్టీయూలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా, జేఎన్టీయూ కలికిరి ప్రిన్సిపల్‌గా, జేఎన్టీయూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పని చేశారు. తాజాగా ఇప్పుడు 2వ సారి జేఎన్టీయూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు.

News July 20, 2024

ఏపీఐఐసీ భూములపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

ఏపీఐఐసీకి కేటాయించిన భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కప్పల బండ, హిందూపురం, మడకశిర, లేపాక్షి ప్రాంతాలలో ఎలాంటి పనులు చేపట్టాలో అధికారులు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

News July 20, 2024

ధర్మవరం పరిధిలో దారుణ హత్య

image

ధర్మవరం మండలం కొత్తకోట గ్రామం సమీపంలో దారుణ హత్య జరిగింది. చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణ స్వగ్రామం తాడిమర్రి కాగా వివాహ అనంతరం వెల్దుర్తిలో నివాసం ఉంటున్నాడు. మృతుడికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

News July 20, 2024

రానున్న ఐదు రోజుల్లో అనంతపురం జిల్లాలో వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణ స్వామి తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News July 20, 2024

అనంతపురం జిల్లాలో అగ్నిగుండంలో పడిన వ్యక్తి మృతి

image

ఉరవకొండ మండల చిన్నకౌకుంట్లలో ఈ నెల 17న జరిగిన మొహర్రం వేడుకల్లో అపశ్రుతి జరిగిన విషయం తెలిసిందే. చాకలి ఆదినారాయణ (38) అనే వ్యక్తి అగ్నిగుండంలో కింద పడ్డారు. అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. పీర్ల అగ్నిగుండ ప్రవేశం సమయంలో ప్రమాదవశాత్తు పడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.