India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో అంబేడ్కర్ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మధు ప్రసాద్ ఏపీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ను కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. మధు మాట్లాడుతూ.. జిల్లాలో గురుకుల కళాశాల ఏర్పాటు, వంట వర్కర్ల జీతాలు, టెండర్ల విషయం, గురుకుల పాఠశాలలో సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జేఏసీ నాయకులు చిరంజీవి, వెంకి, నాగరాజు పాల్గొన్నారు.

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Adhoc-Contract-Base) పోస్టులకు ECE (4), CSE (3), సివిల్ (2), ఇంగ్లీష్ (1), ఫిజిక్స్ (1)కు నేడు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వారి బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు కళాశాలలోని ప్రధాన భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్నారు.

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 60 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. ఫిర్యాదుదారులతో ఆయన మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు వినతులు పంపారు. గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతపురం జిల్లాలో సివిల్, ఏపీఎస్పీ విభాగాలకు ఎంపికైన 488 మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉండగా 470 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా మిగిలిన 18 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సివిల్ -278 మంది గానూ 266, APSP- 210 మందికి గానూ 204 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మొత్తం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

CM సెప్టెంబర్ మొదటి వారంలో అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం పర్యటన కోసం అనంతపురం పరిధిలోని SK యూనివర్సిటీ వద్ద అనంతపురం- కదిరి జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని కలెక్టర్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు.

తాడిపత్రిలోని వినాయక కాంప్లెక్స్లో ఏటా వివిధ రూపాలలో గణనాథుడిని ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి చాక్లెట్ లంబోదరుడిని కొలువుదీరుస్తున్నట్లు తెలిసింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 20 ఏళ్ల నుంచి వినూత్న రీతిలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ఇసుక, టెంకాయ పీచు, విభూది, కాంతార విగ్రహాలను ఇది వరకు ఏర్పాటు చేశామని చెప్పారు.

సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సెప్టెంబర్ 3న రానున్నారు. ఈ నేపథ్యంలో గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు పనులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించుకున్నారు.

సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సెప్టెంబర్ 3న రానున్నారు. ఈ నేపథ్యంలో గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు పనులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించుకున్నారు.

ఈ నెల 25న కలెక్టరేట్లో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలు నుంచి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు 1100 నంబర్కు ఫోన్ చేసి తమ అర్జీ సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

ఈనెల 15న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో మహిళలు వినియోగించుకున్నారు. జిల్లాలో 303 బస్సులను స్త్రీ శక్తి పథకానికి అధికారులు వర్తింపజేశారు. 4,12,054 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి రూ.2,17,48, 677 మేర లబ్ధి పొందారు. స్త్రీలతో పాటు ఉచితాలకు వినియోగించిన బస్సుల్లో 75,5,354 మంది పురుషులూ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.