Anantapur

News July 20, 2024

భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: జేసీ

image

భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనం నుంచి వరదలు, భారీ వర్షాల విపత్తు నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News July 19, 2024

వారం రోజుల లోపు వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసిన కూలీలకు వారం రోజులలోపు మీ వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం లేపాక్షి గురుకుల పాఠశాల వెనకవైపు ఉన్న మామిడి తోటను కలెక్టర్ పరిశీలించారు. 2 నెలల నుంచి బిల్లులు అందడం లేదని కూలీలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వారంలోపు మీకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించడానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు.

News July 19, 2024

సత్యసాయి జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీఐఐసీ, పరిశ్రమల, చేనేత జౌళి, పర్యాటకశాఖ అధికారులతో ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రగతి, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలన్నారు.

News July 19, 2024

23న సాఫ్ట్ బాల్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక

image

అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఈనెల 23న జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్స్ విభాగంలో 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. జూనియర్స్ జట్టు ఆగస్టు 17 నుంచి శ్రీకాకుళంలో, సీనియర్స్ జట్టు ఆగస్టు 10 నుంచి వినుకొండలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

News July 19, 2024

ఈనెల 21న పుట్టపర్తికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాక

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి ఈనెల 21న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలను సత్యసాయి సన్నిధిలో జరుపుకోవడానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల 21న ఉదయం బెంగళూరు నుంచి రహదారి మార్గం గుండా పుట్టపర్తికి చేరుకుంటారు. గురుపౌర్ణమి వేడుకల అనంతరం తిరిగి వెళ్తారు.

News July 19, 2024

భారీ వర్షాల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాలు పడే అవకాశం ఉందని AP ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసిందని అనంతపురం కలెక్లటర్ తెలిపారు. కావున ప్రజలందరూ నీటి ప్రవాహం దగ్గరగా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. 8500292992, 08554-220009 నంబర్లకు సంప్రదించాలన్నారు.

News July 19, 2024

రిమాండు ఖైదీ పరారీ..పట్టుకున్న ఉరవకొండ పోలీసులు

image

గుత్తి మండలం టి.కొత్తపల్లికి చెందిన నరేశ్ పలు చోరీలు, గంజాయి కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. మతిస్తిమితంలేని వ్యక్తిగా ప్రవర్తిస్తుండటంతో 2నెలల కిందట విశాఖలోని పిచ్చాసుపత్రిలో చేర్చించారు. పిచ్చి నయంకావడంతో అతడిని బుధవారం అనంత ఏఆర్ పోలీసులు విశాఖ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బయలుదేరారు. రైల్వేస్టేషన్‌లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఉరవకొండ పోలీసులు నరేశ్‌ను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.

News July 19, 2024

రాయదుర్గం: అద్దెప్ప హత్య కేసులో ప్రధాన నిందితుడికి రిమాండ్

image

టీడీపీ నాయకుడు అదెప్ప హత్య కేసులో ప్రధాన నిందితుడు కేశవరెడ్డిని గురువారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈనెల 9న రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన అదెప్ప హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో హత్య కేసులో ప్రధాన నిందితుడు కేశవరెడ్డి వారం రోజుల కిందట కళ్యాణదుర్గం కోర్టులో లొంగిపోయాడు. దీంతో జడ్జి 14రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తరలించారు.

News July 19, 2024

గుంతకల్లులో చిప్పగిరి ఎంపీపీ కారు అద్దాలు ధ్వంసం

image

గుంతకల్లులోని హౌసింగ్ బోర్డులో అద్దె ఇంట్లో నివాసముంటున్న కర్నూలు జిల్లా చిప్పగిరి ఎంపీపీ హేమలతకు చెందిన కారు అద్దాలను గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి గురువారం ఎంపీపీ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News July 19, 2024

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ సైనికుల సంఘం సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సైనికుల సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.