India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతపురం జిల్లాలో 48,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం 25,730 మంది, రెండో సంవత్సరం 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

టీడీపీ సీనియర్ నేత జేసీ పవన్ రెడ్డి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో జరిగిన టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ను తిలకించారు. తన స్నేహితులతో కలిసి గ్రౌండ్లో సందడి చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే మ్యాచ్ను చూడటానికి మంత్రి నారా లోకేశ్, పలువురు ఎంపీలు వెళ్లిన విషయం తెలిసిందే.

☞ అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు – కలెక్టర్ వినోద్ కుమార్ ☞ పెద్దపప్పూరులో అశ్వర్థం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు ☞ అనంతపురం రూరల్లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత భూమి పూజ☞ గుత్తిలో ఇరు వర్గాలు ఘర్షణ ☞ కుందుర్పిలో గడ్డివాములు దగ్ధం ☞ గార్లదిన్నె మండలంలో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు☞ తాడిపత్రిలో సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి

అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.

చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అనంతపురంలో ఇవాళ కిలో చికెన్ రూ.120-140 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

అనంతపురంలో కక్కలపల్లి మార్కెట్లో నిన్న కిలో టమాటా రూ.10 పలికింది. సరాసరి ధర రూ.8, కనిష్ఠ ధర రూ.7తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.20,700 తో అమ్ముడయ్యాయి.

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో 7,293 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.

గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచి ఉత్సవమూర్తికి విశేష పుష్పలతో అలంకరించి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి రథోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

☛ రేపు అనంతపురం జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు యథాతథం
☛ అనంతపురం జిల్లాలో 144 సెక్షన్
☛ అనంతపురం హైవేపై రోడ్డు ప్రమాదం
☛ గుత్తి బావిలో పదో తరగతి విద్యార్థి మృతి
☛ ఈ నెల 25న రాయదుర్గంలో జాబ్ మేళా
☛ అనంతపురం JNTU బీటెక్ పరీక్షా ఫలితాలు విడుదల
☛ పరిటాల శ్రీరాంను అభినందించిన జేసీ
Sorry, no posts matched your criteria.