India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ సచివాలయంలోని రెండో బ్లాకులోని తన ఛాంబర్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం కుటుంబసభ్యులతో ఫోటో దిగారు. తన విజయానికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందని పయ్యావుల తెలిపారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం తన కుమారులు విక్రమ్ సింహ, విజయ్ సింహ ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీరాముడు ఆంజనేయుడిని గుహుడి వద్దకు పంపి త్వరలో సీతాలక్ష్మణ సమేతుడై దర్శనమిస్తానని సందేశం పంపుతారట. దీంతో గుహుడు ఆత్మాహుతి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత సీతారామలక్ష్మణులు గుహుడికి దర్శనమిస్తారట. ఇక గుహుడు ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకున్న గుండమే నేడు ఆలయం ముందు ఉన్న గుండమని, తపస్సు చేసిన ఈ ప్రాంతం కాలక్రమంలో గూగూడుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.
పురాణాల ప్రకారం.. ప్రస్తుతం కుళ్లాయిస్వామి ఉన్న చోట గుహుడు అనే మహర్షి శ్రీరాముడి కోసం తపస్సు చేసుకునేవారు. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు తన భార్యను వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారు. గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించి మరోసారి సీతాసమేతుడై దర్శనమిస్తానని గుహుడికి తెలియజేస్తారు. గుహుడికి ఇచ్చిన మాటను మరిచిన శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్యకు వెళ్తారు. ఇది తెలిసి <<13608428>>గుహుడు<<>> ఆత్మాహుతికి సిద్ధపడతారట.
పెళ్లి కాలేదన్న మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. పుట్లూరు రైల్వే గేట్ సమీపంలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై నాగప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పట్టణంలోని పాత కోటకు చెందిన నాగయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నివీర్ పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్యాణి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ పేర్లను https:///agnipathvayu.cdac.in వెబ్ సైట్లో ఈ నెల 28వ తేదీ లోగా నమోదు చేసుకోవాలన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా జనాభా 40,81,148కు చేరుకుంది. అనంతపురం జిల్లాలో 22,41,105 మంది, సత్యసాయి జిల్లాలో 18,40,043 మంది జనాభా ఉన్నట్లు ఏయూ జనాభా అధ్యయన కేంద్రం అంచనా వేసింది. పురుషులు, మహిళల నిష్పత్తి చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ప్రతి 1000 మంది పురుషులకు 977 మంది మహిళలు ఉన్నారు.
అనంతపురం నగరంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పూల్ క్యాంపస్ డ్రైవ్ సంస్థ వైస్ ఛైర్మన్ చక్రధర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2023, 2024లో బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 8.30 గంటలకు అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరుకావాలన్నారు.
భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఇల్లూరుకు చెందిన ఎర్రిస్వామి, సువర్ణ(26) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో భార్య గొడవపడేది. నిన్న ఇద్దరూ గొడవపడగా భర్త భార్యను కొట్టడంతో ఆమె మృతిచెందింది. ఆ తర్వాత ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గూగూడులో కుళ్లాయిస్వామి పీర్లు నిన్న కొలువుదీరిన విషయం తెలిసిందే. హుసేనప్ప, తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి ప్రధాన పీరుతో సహా 21 ఉత్సవ పీర్లను బంగారు, వెండి నగలతో పాటు పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చక్కెర చదివింపులతో మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ పీర్ల మకానంలో నిత్య పూజా నివేదనా కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు.
హాకీ ఏపీ రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. హాకీ శ్రీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ సూర్యప్రకాశ్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జూనియర్ బాలుర, బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్ర జట్టుకు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మహబూబ్ బాషా, పవిత్ర, సింధు, నసీమా ఎంపికయ్యారు.
Sorry, no posts matched your criteria.