Chittoor

News August 15, 2024

CTR: మహిళల స్నానం వీడియోలతో బెదిరింపులు

image

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పలమనేరు పట్టణం గంటావూరు కాలనీలో బాలు అనే యువకుడు మహిళలు స్నానాలు చేసే సమయంలో వీడియోలు తీస్తున్నాడని బాధితులు వాపోయారు. కాలనీలోని బహిరంగంగా ఉండే స్నానపు గదుల్లో ఈ పనులు చేస్తున్నాడని ఆరోపించారు. సంబంధిత వీడియోలు చూపించి మహిళలను బెదిరిస్తున్నాడని తెలిపారు. గతంలో ఓసారి మందలించినా తీరు మారకపోవడంతో పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 14, 2024

త్రివర్ణ కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ బిల్డింగులు విద్యుత్ కాంతులతో త్రివర్ణ పతాక రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ త్రివర్ణ పతాక విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ సంసిద్ధం అవుతున్నారు.

News August 14, 2024

తిరుపతి: దేశభక్తి ఉట్టిపడేలా కార్యక్రమాలు

image

రేపు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరుపుకోనున్న 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పెద్ద ఎత్తున జాతీయతా భావం దేశ భక్తి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరంగా యాత్ర కూడా ప్రజా ప్రతినిధులతోనూ కలిసి ఘనంగా నిర్వహించాలని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేయాలని తెలిపారు.

News August 14, 2024

కల్లూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పులిచెర్ల మండలం చల్లావారిపల్లి సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద బుధవారం అదుపుతప్పి స్కూటర్ బోల్తా పడటంతో సోమల మండల కేంద్రానికి చెందిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కల్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 14, 2024

పెద్దిరెడ్డిపై పిటిషన్.. విచారణ వాయిదా

image

సతీమణి ఆస్తులను అఫిడవిట్‌లో పొందుపరచని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ BCY అధినేత రామచంద్రయాదవ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇవాళ విచారణ జరిగింది. పెద్దిరెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో తెలిపాలని హైకోర్టు కోరింది. ఈ మేరకు పెద్దిరెడ్డిపై పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.

News August 14, 2024

SVU : డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జనవరి నెలలో డిగ్రీ ( UG) BA/BCOM/BSC/BCA/BBA మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 14, 2024

కుప్పం : రేపు మాంసం విక్రయాలు బంద్

image

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాలు చేపట్టకూడదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మాంసం విక్రయాలు చేపట్టిన లేక హోటల్లో నాన్-వెజ్ వండిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News August 14, 2024

తిరుపతి: చిన్ననాటి కల నెరవేర్చుకున్న పవన్ కళ్యాణ్

image

శ్రీహరికోట సందర్శనతో తన చిన్ననాటి కల నెరవేరిందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ చెప్పారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పవన్‌ పాల్గొన్నారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగ నమూనాను పవన్‍కు బహూకరించారు. అనంతరం అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పవన్‍ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

News August 14, 2024

చిత్తూరు అమ్మాయి.. అమెరికా అబ్బాయి

image

ప్రేమకు కులం, మతం, భాష, దేశం అడ్డు కాదని ఓ జంట నిరూపించింది. చిత్తూరు నగరానికి చెందిన దయాసాగర్ రెడ్డి, లావణ్యల కుమార్తె మంజూశ్రీ 2018లో MS చేసేందుకు అమెరికా వెళ్లింది. ఆమెకు మైఖేల్ జాక్‌మెన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇరువురు కలిసి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. అబ్బాయి కుటుంబసభ్యులను రప్పించి మంగళవారం రిసెప్షన్ నిర్వహించారు. ఇవాళ వారికి పెళ్లి జరగనుంది.

News August 14, 2024

తంబళ్లపల్లెలో పరువు హత్య!

image

తంబళ్లపల్లె మండలంలో పరువు హత్య కలకలం రేపుతోంది. వివరాలు..తంబళ్లపల్లె(M)మండలానికి చెందిన ఓ బాలిక అదే ఊరికి చెందిన విష్ణువర్ధన్‌ను ప్రేమించింది. తల్లిదండ్రులు మైనర్‌కు పెళ్లి చేయకూడదని మేజర్ అయ్యాక చేస్తామని చెప్పారు.దీంతో బాలిక పెద్దమండెం(M), బండ్రేవువద్ద చున్నీతో ఊరేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులు ఆ శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాల్చేయడంతో పరువుహత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.