Chittoor

News March 23, 2026

ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభించినట్లు డీఐఈఓ రఘుపతి తెలిపారు. పేపర్ కరెక్షన్ పారదర్శకంగా జరుగుతోందన్నారు. అధికారులకు నిబంధనలు వివరించామన్నారు. జిల్లాకు 1,67,700 జవాబు పత్రాలను దిద్దేందుకు ఏఈలు 480 మంది, సీఈలు 60, పరిశీలకులు 160 మంది, ఏసీఈలు 15 మందిని నియమించినట్లు తెలియజేశారు. మూల్యాంకనం 20 రోజుల్లో ముగుస్తుందని ఆయన తెలిపారు.

News March 23, 2026

ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభించినట్లు డీఐఈఓ రఘుపతి తెలిపారు. పేపర్ కరెక్షన్ పారదర్శకంగా జరుగుతోందన్నారు. అధికారులకు నిబంధనలు వివరించామన్నారు. జిల్లాకు 1,67,700 జవాబు పత్రాలను దిద్దేందుకు ఏఈలు 480 మంది, సీఈలు 60, పరిశీలకులు 160 మంది, ఏసీఈలు 15 మందిని నియమించినట్లు తెలియజేశారు. మూల్యాంకనం 20 రోజుల్లో ముగుస్తుందని ఆయన తెలిపారు.

News March 23, 2026

చిత్తూరు: నిద్రమత్తు, వేగమే కారణమా.?

image

ఈ హైవేపై ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దూర ప్రయాణాల కారణంగా డ్రైవర్ల అలసట, <<19452617>>నిద్రమత్తు<<>>లో వాహనాలు నడపడం వల్ల నియంత్రణ కోల్పోవడమే కారణంగా తెలుస్తోంది. అతివేగం మరోకారణంగా తెలుస్తోంది. గ్రామాల సమీపంలో వేగ నియంత్రణ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. పలు బ్లైండ్ స్పాట్ల వద్దే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

News March 22, 2026

23 నుంచి జనగణన ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ: DRO

image

సోమవారం నుంచి జనగణన చేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 2027 సం. జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ కోసం సంబంధిత అధికారులు తప్పక హాజరు కావాలని డీఆర్ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 22, 2026

23 నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు: కలెక్టర్

image

మార్చి 23వ తేదీ నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని ఇరువారం దగ్గర తాత్కాలిక విద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ప్రవేశ ప్రక్రియలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సందేహాలకు 8919820152 / 9476007488 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News March 22, 2026

చిత్తూరు జిల్లా SP వినతి

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు SP ఆఫీసు వెల్లడించింది. ఉ.10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు తెలిపారు.

News March 22, 2026

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా డయల్ 1100 కు కాల్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

News March 22, 2026

పూతలపట్టు: ప్రమాదంలో మృతి చెందింది వీరే

image

పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్ (23), పవని (10), మహాలక్ష్మి (12), తుషార (4)లకు గాయాలు అయ్యాయి.

News March 22, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 21, 2026

చిత్తూరు: ఐదుగురు DTలకు విధులు

image

గ్రూప్-2 పరీక్షల్లో DTలుగా ఎంపికైన వారిలో 16 మందిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 5 మందిని కేటాయించగా వారిలో.. శివకుమార్, మదన్ మోహన్ రెడ్డి, యస్థాని బాషా, సుధాకర్, శశికిరణ్ ఉన్నారు. వీరు ఏడాది పాటు రెవెన్యూ విభాగంలో ప్రొబేషన్ కింద జిల్లాలో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.