Chittoor

News April 16, 2025

చిత్తూరు: ‘ప్రభుత్వానికి, ప్రజలకు వారధి జర్నలిస్టులే’

image

ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి వంటి వారు అని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఈ నెల 22న జరగనున్న APWJF 4వ జిల్లా మహాసభలకు ఆహ్వానిస్తూ కలెక్టర్ ఛాంబర్‌లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వాస్తవాలను ప్రచురించడంలో జర్నలిస్టులు కృషి చేస్తున్నారన్నారు. వారి సంక్షేమానికి అండగా ఉంటామన్నారు.

News April 16, 2025

చిత్తూరు: జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

image

చిత్తూరులో ఈనెల 19న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను చిత్తూరు ఎంపీ దగ్గుమాళ్ల ప్రసాద్ రావు, చిత్తూరు ఎమ్మెల్యే జగన్ మోహన్ మంగళవారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయింట్, సీడప్ సంయుక్త ఆధ్వర్యంలో పీవీకెఎన్ డిగ్రీ కాలేజీలో ఉదయం 10 గంటలకు 20 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 15, 2025

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

image

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కొత్తగా 199 పోస్టులు రానున్నాయి. వీటిలో 117 ఎస్‌జీటీ, 82 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 164 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 82 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 82 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.

News April 15, 2025

చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన ఎంపీ

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మంగళవారం కలిశారు. పలు అంశాలపై సమీక్షించారు. ప్రజా సంక్షేమం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఎంపీ సూచించారు.

News April 15, 2025

చిత్తూరు: కిలో 7 రూపాయలే..!

image

మామిడి సాగుకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల మామిడి పండుతుంది. కానీ రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఓవైపు పూత, దిగుబడి సమస్య వేధిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతును కకావికలం చేస్తున్నాయి. నిన్న జిల్లాలో వీచిన గాలులకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వాటిని మండీలకు తరలిస్తే కేజీకి రూ.7 నుంచి రూ.10 మించి ధర లభించలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

News April 15, 2025

చిత్తూరు TDP నేత ఇంట్లో విషాదం

image

TDP నేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జీడీనెల్లూరు(M) జూపల్లిలో TDP నేత గోపాల్ రెడ్డి ఉండగా.. భార్య మీనా పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. తమిళనాడులోని గుడికి సోమవారం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం మీనా పూలమాలలు తీసుకుని బయల్దేరారు. రాత్రి గోపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. ‘దేవుడికి వేయాల్సిన మాల నీపై వేయాల్సి వచ్చింది’ అంటూ మీనా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

News April 14, 2025

చిత్తూరు: కలిసి పనిచేసుకుందాం..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP, YCP కార్యకర్తలు నువ్వానేనా అంటూ గొడవలు పడుతుంటే నేతలు మాత్రం కలిసి మెలిసి బిజినెస్‌లు చేసుకుంటున్నారు. జిల్లాలోని ఓ ఇద్దరు MLAల సహకారంతో ఓ మాజీ మంత్రి అప్పుడు(2024కు ముందు), ఇప్పుడు తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంట. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మంత్రికి మైనింగ్ బిజినెస్‌పై మంచి పట్టు ఉంది. ఆయనతో కలిసి చిత్తూరు జిల్లా మాజీ మంత్రి మైనింగ్ చేస్తున్నారని సమచారం.

News April 14, 2025

పుంగనూరు: టీచర్ మృతి.. అసలేం జరిగిందంటే?

image

పుంగనూరు మండలం సుగాలిమిట్టలో లారీ ఢీకొని నిన్న ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లెకు చెందిన శారద(40) కదిరిలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. విజయవాడలో ఆమె కుమార్తె కీర్తి ఇంటర్ చదువుతుండగా 973 మార్కులు వచ్చాయి. దీంతో విజయవాడ నుంచి కుమార్తెను తీసుకుని అరుణాచలం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి కారులో వస్తుండగా లారీ ఢీకొని చనిపోయారు.

News April 14, 2025

చిత్తూరు: ఏడాదిలో ఒక కోటి లక్ష రూపాయాల జరిమానా

image

ఏడాది కాలంలో తాగి వాహనం నడిపిన వాహనచోదకులకు కోటి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. 2024 ఏప్రిల్-11 నుంచి నేటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1,01,52,500 జరిమానా విధించామన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

News April 13, 2025

చిత్తూరు: ఏడాదిలో ఒక కోటి లక్ష రూపాయాల జరిమానా

image

ఏడాది కాలంలో తాగి వాహనం నడిపిన వాహనచోదకులకు కోటి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. 2024 ఏప్రిల్-11 నుంచి నేటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1,01,52,500 జరిమానా విధించామన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

error: Content is protected !!