India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. దీంతో భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్గా స్వామి వారి దర్శనానికి వెళుతున్నారు. కాగా నిన్న శ్రీ వారిని 67,166 వేల మందికి పైగా దర్శించుకన్నట్లు అధికారులు తెలిపారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి వినాయక స్వామి చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శనము ఇచ్చారు. భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురు ప్రసాద్, ఏ ఈ ఓ విద్యాసాగర్ రెడ్డి, ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్గా కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నంను ప్రభుత్వం నియమించింది. సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్మెంట్ అయిన మునిరత్నం గడిచిన నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కుప్పం ఇన్ఛార్జ్గా ఉన్న మునిరత్నంను ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించడం పట్ల కుప్పం టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా SRపురానికి చెందిన కుమార్ ఒంగోలు PSలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అందిన సమాచారం..అప్పులు చేసి పరారై ఒంగోలు వచ్చి క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. అప్పులోళ్లు శనివారం ఒంగోలు వచ్చి టీడీపీ నేత సాయంతో ఘర్షణకు దిగారు. పోలీసులు అందరినీ స్టేషన్కు పిలిపించి సర్ది చెప్పారు. మళ్లీ వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిచి.. SI చేయిచేసుకున్నాడంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో ఎస్పీ మణికంఠ డిటిసి నిరంజన్ రెడ్డితో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగిన 119 రోడ్డు ప్రమాదాలలో 64 మంది మరణించగా, 211 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ప్రమాదాల నివారణకు సమిష్టిగా పనిచేయాలని కోరారు.
వ్యభిచారం చేస్తున్న పదిమందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఓ లాడ్జీలో వ్యభిచారం చేస్తున్న ఏడుగురు విటులు, ఇద్దరు మహిళా బాధితులతో పాటు నిర్వాహకురాలు రజియా బేగంను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధిత మహిళలను వారి తల్లిదండ్రులకు అప్పగించి, తిరిగి ఈ వృత్తిలోకి రాకుండా కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఉద్యానవన శాఖలో అమలు చేస్తున్న పలు పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లో పథకాలను తెలిపే పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40% రాయితీ అందిస్తున్నట్టు చెప్పారు. పాలి హౌసులు, షెడ్ నెట్ హౌసులు, మల్చింగ్ కు 50% రాయితీ అందిస్తున్నామన్నారు. చిన్న ట్రాక్టర్లు, స్ప్రేయర్లు రాయితీతో అందిస్తామన్నారు.
తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యిపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆయన అక్టోబర్ 3న తిరుమలకు వచ్చే అవకాశం ఉందని జనసేన నాయకులు వెల్లడించారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతి శివారులో ఉన్న తల్లి, తండ్రి బతుకుతెరువు కోసం బెంగళూరుకు వెళుతూ.. బాలికను అవ్వ దగ్గర వదిలారు. వరుసకు చెల్లి(13) అయిన బాలికపై యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వినాయక చవితికి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.
ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26న పథకానికి సంబంధించి జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు విధానం, సబ్సిడీ, అర్హత గల యూనిట్ల వివరాలు తెలుస్తాయని చెప్పారు.
Sorry, no posts matched your criteria.