India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.105, మాంసం రూ.152 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.173 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున పలు దుకాణాల్లో అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

పెనుమూరు మండలం కత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుజాత DSC SA తెలుగులో 85.29 మార్కులతో ఓసీ కేటగిరిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచారు. అలాగే TGTలో 76.86 మార్కులతో 16వ స్థానం, పీజీటీలో 78 మార్కులు సాధించి 21వ ర్యాంకు సాధించారు. ఈమెనాలుగేళ్లుగా పిల్లల్ని, కుటుంబాన్ని వదిలి నంద్యాలలో కోచింగ్ తీసుకుంటున్నారు. నాలుగేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

పూతలపట్టు మండలం బందర్లపల్లి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయింది. ట్రైన్ నుంచి అదుపుతప్పి వ్యక్తి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూతలపట్టు సీఐ కృష్ణమోహన్, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. ఈనెల 29, 30 తేదీల్లో సీఎం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 29న ఆయన కుప్పం చేరుకుని సొంతింట్లో బసచేస్తారు. 30వ తేదీ సతీ సమేతంగా పరమసముద్రం వద్ద హంద్రీనీవా జలాలను విడుదల చేసి జల హారతి ఇస్తారు. అక్కడే జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.

శుక్రవారం విడుదలైన మెగా DSC ఫలితాల్లో తిరుపతి జిల్లా యువకుడు సత్తా చాటాడు. ఎర్రవారిపాలెం మండలం ఓఎస్ గొల్లపల్లికి చెందిన ముండ్రే శేషాద్రి ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ☞ S.A SOCIAL-80.63(9ర్యాంక్) ☞ SGT-86.33( 53ర్యాంక్) ☞ S.A తెలుగు -73.05(42ర్యాంక్) ☞ T.G.T తెలుగు -71.00(127ర్యాంక్) ☞ T.G.T SOCIAL-70.93(82ర్యాంక్) సాధించాడు. ఈ మేరకు ఆయన్ను పలువురు అభినందించారు.

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, డబ్బులు డిమాండ్ చేయడంపై శుక్రవారం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేశ్ బాబు కథనం మేరకు.. కలెక్టర్ పేరుపై గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులను పరిచయం చేసుకొని డబ్బు అడగడం మొదలుపెట్టాడు. కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్కు ఆహ్వానం అందింది. ఈవో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందించారు. కాగా ఇప్పటికే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి

కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ను గుర్తు తెలియని వ్యక్తులు ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో నిజమైన ఫేస్ బుక్ ఖాతా నుంచి అలెర్ట్ మెసేజ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ తన ఒరిజినల్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అత్యవసర సమాచారం అంటూ మెసేజ్ను పోస్ట్ చేశారు. నకిలీ అకౌంట్తో జాగ్రత్త వహించాలని సూచించారు.

వైసీపీ నేత భూమన బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మాట్లాడారు. టీటీడీని వైసీపీ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన చేసిన ఆరోపణలను ఖండించారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఈ.వో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించారు. వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, ఎస్పీ మణికంఠ చందోలు, JC విద్యాధరి ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. వారికి ఈవో ఆహ్వాన పత్రికలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ కోరారు.
Sorry, no posts matched your criteria.