Chittoor

News August 21, 2025

ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు: చిత్తూరు SP

image

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల పొందేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ మణికంఠ గురువారం స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చామన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుందన్నారు. మైక్ అనుమతులను మీసేవ కేంద్రాలలో పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

News August 21, 2025

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: కలెక్టర్

image

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. తల్లితండ్రుల కలను నెరవేర్చడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. విద్యపై చేసే ఖర్చు ఎప్పటికీ వృథా కాదన్నారు.

News August 20, 2025

హంద్రీనీవా కాలువను పరిశీలించిన కలెక్టర్

image

హంద్రీనీవా కుప్పం కెనాల్ పనులను బుధవారం చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. హంద్రీనీవా కాలువ పనులు దాదాపు పూర్తికాగా పనుల పురోగతికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలను కుప్పంకు విడుదల చేయనున్నారు. దీంతో చివరి దశలో ఉన్న పనులను త్వరతగితన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News August 20, 2025

CTR: వినాయక విగ్రహాలకు పర్మిషన్ ఇలా పొందండి

image

చిత్తూరు జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<>ganeshutsav.net<<>> దీనిపై క్లిక్ చేయండి
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్‌లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది. ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకోండి.

News August 20, 2025

CTR: వేంకన్న పాదం పెట్టిన స్థలం గురించి తెలుసా?

image

చిత్తూరు జిల్లా రొంపిచర్ల-ఎం.బెస్తపల్లి మార్గంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తులు చిన్నగుడి కట్టి పూజలు చేస్తున్నారు. పెరటాసి నెల శనివారాల్లో ఇక్కడ పూజలు ఘనంగా జరుగుతాయి. తిరుమల వెళ్తూ శ్రీవారు ఇక్కడ ఎడమ పాదం మోపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రదేశాన్ని వేంకటేశుని పాదం అని పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. TTD స్పందించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News August 20, 2025

చిత్తూరు: అధ్వానంగా రోడ్లు

image

చిత్తూరు జిల్లాలో ఇటీవల వరుసగా వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రధాన మార్గాలతో పాటు గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు చేరింది. కొన్ని చోట్ల రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. పై ఫొటో పుంగనూరు-శంకర్రాయలపేట రోడ్డు దుస్థితిని తెలియజేస్తోంది. అధికారులు తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. మీ ఏరియా రోడ్లూ ఇలానే ఉన్నాయా?

News August 20, 2025

చిత్తూరు నగరంలో ‘సే టు నో డ్రగ్స్’

image

చిత్తూరు నగరంలోని 32, 34, 40, 41 వార్డ్ పరిధిలో మంగళవారం మత్తు పదార్థాల నిషేధంపై ‘సే టు నో డ్రగ్స్’ కార్యక్రమాన్ని WMSKలు నిర్వహించినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. వార్డ్ ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను వివరించామన్నారు. యువత మత్తుకు బానిస కావద్దని సూచించారన్నారు. డ్రగ్స్ విక్రయించిన, సేవించిన చట్టరీత్యా నేరమన్నారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు.

News August 19, 2025

20న పేటమిట్టలో జాబ్ మేళా

image

పేటమిట్ట అమరరాజ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. 25 కంపెనీల్లో ఖాళీగా ఉన్న 1200 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఆరోజు రంగంపేట క్రాస్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.

News August 19, 2025

కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలు

image

వినాయక చవితి చవితి సందర్భంగా కాణిపాకంలో ఈనెల 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 27న గ్రామోత్సవం, పుష్పకావిల్లు, 28న ధ్వజారోహణం నిర్వహిస్తారు. 29న నెమలి, 30న మూషికం, 31న శేష, సెప్టెంబర్ 1న వృషభం, 2న గజ వాహనాలపై స్వామివారు దర్శనమిస్తారు. 3న రథోత్సవం జరుగుతుంది. 4న అశ్వ వాహన సేవ, 5న ధ్వజావరోహరం నిర్వహించనున్నారు. 6 నుంచి 16 వరకు ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి.

News August 19, 2025

కాణిపాకం రావాలని CMకు ఆహ్వానం

image

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆహ్వానించారు. ఈనెల 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సచివాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికలు ఆవిష్కరించారు. వేద పండితులు ఆశీర్వచనంతో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.