India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరులో 19, 20 తేదీల్లో ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేశ్వరి తెలిపారు.19న మిషన్ వాత్సల్య పథకంలో ఒక కౌన్సిలర్, ఒక అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, 20న మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న 3 మల్టీపర్పస్ హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో జగదీశ్ (40)అనే వ్యక్తిని సునీల్ అనే వ్యక్తి హత్య చేశాడు. మద్యం మత్తులో జగదీశ్ భార్యతో సునీల్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో సునీల్ను ప్రశ్నించడంతో పదునైన ఇనుప చువ్వతో జగదీశ్ గుండెలపై పొడిచాడు. తీవ్రగాయాలైన జగదీశ్ను ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అలిపిరి సీఐ రామ్ కిషోర్ విచారణ చేస్తున్నారు. సునీల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చి తాను కన్నుమూసిన ఘటన పలమనేరులో చోటు చేసుకుంది. మండలంలో ఓ బాలిక(16) ప్రభుత్వ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈక్రమంలో విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. పురిటి నొప్పులు అధికమవడంతో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యుల సిఫార్సుతో చిత్తూరుకు తరలించారు. రక్తస్రావం అధికమవడంతో శిశువుకు జన్మనిచ్చి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
గంగవరం మండలంలో నాలుగు రోడ్ల వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బైకులు అధిక వేగంతో వస్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరులో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి రిటైల్ ధర కేజీ రూ.148, లేయర్ రూ.136, స్కిన్ లెస్ రూ.168. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గినట్లు వ్యాపారులు వాపోయారు. గిట్టుబాటు ధర లభించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ ప్రసాదరావు హాజరయ్యారు. పలు అంశాలపై అధికారులతో వారు చర్చించారు. జడ్పీ సీఈవో రవి కుమార్ నాయుడు, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, రవి కుమార్, గోపాల్ నాయక్, వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలమైంది. కాగా నిందితుడు టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపించింది. కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి కుమారుడే గణేశ్ అని ట్వీట్ చేసింది. గణేశ్ తండ్రికి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ పలు ఫొటోలను పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ యువతికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.
చిత్తూరు పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధి పై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్గాటించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం యువతిపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు నిర్భంధించి దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 108లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామయ్య కథనం ప్రకారం.. లక్ష్మీరెడ్డి గతంలోఎస్పీ హర్షవర్ధన్ రాజుకు కిరణ్ రాయల్పై ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు విచారించి గురువారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.