India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసిందని నోడల్ అధికారిణి, పీవీకేన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

యాదమరి(M) ముస్లిం వాడ 14 కండ్రిగకు చెందిన ఇంతియాజ్ పుట్టుకతోనే మూగవాడు. ఇటీవల రాయి పనికి వెళ్లగా.. అక్కడ జరిగిన బ్లాస్టింగ్లో రెండు కళ్లు, కుడిచేయి మణికట్టు వరకు కోల్పోయాడు. ఇతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కలెక్ట్రేట్లో నిన్న జరిగిన గ్రీవెన్స్ డేకు బాధిత కుటుంబం హాజరై కలెక్టర్ సుమిత్ కుమార్కు సమస్యను వివరించారు. ఆయన మానవతా థృక్పథంతో PSR ఫండ్స్ నుంచి రూ.లక్ష అందజేశారు.

చిత్తూరు జిల్లా యాదమరి(M) తోటికాడ ఇండ్లు గ్రామంలో ఈనెల 11న ఓ యువకుడు <<17373260>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. విజయ్ కుమార్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో అతడి తండ్రి సదాశివన్, అన్న శివకుమార్ కలిసి విజయ్ను కర్రలతో కొట్టి, తాడుతో గొంతు బిగించి చంపేశారు. ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోలీసులు ఎంట్రీతో అసలు విషయం తెలిసింది. నిందితులను అరెస్ట్ చేశారు.

గుడిపాల మండలంలో తేనెటీగల దాడిలో <<17433386>>30 మందికి <<>>గాయాలైన విషయం తెలిసిందే. బసవాపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న శుభకార్యానికి గ్రామస్థులు హాజరయ్యారు. పక్కనే చెట్టుపై తేనే తుట్టెను ఓ కోతి కదిలించడంతో తేనెటీగలు ఒక్కసారిగా ఫంక్షన్ హాల్ ఆవరణలోకి వెళ్లి సుమారు 30 మందిపై దాడి చేసి కుట్టాయి. వారిని 108 వాహనంలో PHCకి తరలించి వైద్య సేవలు అందించారు.

ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న 47 మందికి పోలీసులు జరిమానా విధించారు. చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర తన సిబ్బందితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అత్యంత వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ పాదచారులను ఇబ్బందులకు గురిచేసిన వారిని గుర్తించారు. ఇలా 47 మందిని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం రూ.52 వేల జరిమానా వసూలు చేశారు.

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి(లైవ్) కిలో రూ.120, స్కిన్ రూ.174 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.198 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున పలు దుకాణాల్లో అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.900గా ఉంది. మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు అన్నారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో ఇంజినీరింగ్ పనుల బకాయి బిల్లులు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని జేసీ విద్యాధరి అన్నారు. అన్నదాత సుఖీభవ అందని రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2025కు అర్హులైన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి ఓ ప్రకటనలో కోరారు. 10 ఏళ్ల సర్వీసు ఉన్నవారు అర్హులన్నారు. ప్రతిపాదనలు రెండు కాపీలను ఉపవిద్యా శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన ప్రతిపాదనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.

కాణిపాకంలో ఫ్రీ బస్ పథకాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. మహిళల జీవన విధానంలో ఉచిత బస్సు ప్రయాణం విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సూపర్-6 పథకాల సాకారానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.

మద్యం కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఆరోపించారు. ఆయన అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారు. దొడ్డిపల్లి సప్త కన్యకమ్మల ఆలయం నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మారిందని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.