Chittoor

News March 10, 2026

రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్

image

కుప్పం రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేస్తున్నట్లు రెస్కో చైర్మన్ ప్రతాప్ తెలిపారు. మార్చి 10 నుంచి 25 వరకు వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయడం జరుగుతుందని, రెస్కో పరిధిలో గృహ వినియోగదారులు 31.01.2026 వరకు పాత బకాయిలు ఉంటే పూర్తిగా వడ్డీ మాఫీ (సర్ చార్జ్) తో బిల్లులు చెల్లించవచ్చన్నారు. రెస్కో పరిధిలోని గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 10, 2026

రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్

image

కుప్పం రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేస్తున్నట్లు రెస్కో చైర్మన్ ప్రతాప్ తెలిపారు. మార్చి 10 నుంచి 25 వరకు వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయడం జరుగుతుందని, రెస్కో పరిధిలో గృహ వినియోగదారులు 31.01.2026 వరకు పాత బకాయిలు ఉంటే పూర్తిగా వడ్డీ మాఫీ (సర్ చార్జ్) తో బిల్లులు చెల్లించవచ్చన్నారు. రెస్కో పరిధిలోని గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 9, 2026

పాకాల రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

image

పాకాల రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు ట్రైన్ కిందపడి వ్యక్తి మృతి చెందాడు. పాకాల భారతంమిట్ట ఏడవ క్రాస్ వీధికి చెందిన విశ్వనాథ నాయుడు సోమవారం హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 9, 2026

చిత్తూరు: పెరిగిన ధరలు.. ఆందోళనలో ప్రజలు

image

పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో పెరిగిన గ్యాస్ ధరలు సామాన్య ప్రజానీకానికి భారంగా మారాయి. చిత్తూరు జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు, పొందిన నాటి నుంచి 21 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

News March 9, 2026

చిత్తూరు: 18 వరకు గడువు పెంపు

image

పంచాయతీలో ఓటరు ముసాయిదా జాబితా ప్రచురణ గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. మార్చి 9కి జాబితాను ప్రచురించాలని ముందుగా ఉన్నతాధికారులు గడువు ఇచ్చారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా నమోదులో ఆలస్యం అవుతోంది. ఇంకా 10% మ్యాపింగ్ ప్రక్రియ చేయాల్సి ఉందన్నారు. ఇచ్చిన గడువులోగా వాటిని పూర్తి చేస్తామన్నారు.

News March 9, 2026

చిత్తూరు: పకడ్బందీగా పది పరీక్షలు

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్టు డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 129 కేంద్రాలలో 24,931 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగా విద్యార్థులు చేరుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్‌లకు అనుమతి లేదన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

News March 9, 2026

పోలీస్ శాఖ PGRSను సద్వినియోగం చేసుకోండి : ఎస్పీ

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. ఉదయం10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్పీ కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు వివరించారు.

News March 8, 2026

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు గ్రీవెన్స్ డే

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా డయల్ 1100 కు కాల్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

News March 8, 2026

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు గ్రీవెన్స్ డే

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా డయల్ 1100 కు కాల్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

News March 8, 2026

చిత్తూరు: పెరుగుతున్న చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.179 నుంచి రూ.186, మాంసం రూ.260 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.295 నుంచి రూ.320వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 72 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.