Chittoor

News August 11, 2024

తిరుపతి- కాచిగూడ మార్గంలో 2 ప్రత్యేక రైళ్లు

image

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి- కాచిగూడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ- తిరుపతి(07653), తిరుపతి- కాచిగూడ (07654) రైళ్లు ఉమానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.

News August 10, 2024

చిత్తూరు జిల్లాలో TODAY TOP NEWS

image

➽ తిరుపతి: ఆకట్టుకుంటున్న కపిల తీర్థం
➽ తిరుపతిలో భారీ వర్షం
➽ చిత్తూరు: వ్యక్తి ప్రాణం తీసిన జల్లికట్టు
➽ పుత్తూరు నూతన డీఎస్పీగా రవికుమార్ బాధ్యతలు
➽ SVU: LLB ఫలితాలు విడుదల
➽ మదనపల్లెలో దంపతులపై దాడి
➽ బి.కొత్తకోటలో పేకాట రాయళ్లు అరెస్టు
➽ రోడ్డుపై SVU విద్యార్థుల ఆందోళన

News August 10, 2024

SVU: LLB ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చిలో 5 సంవత్సరాల ఎల్.ఎల్.బి (CBCS) 3, 7 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 10, 2024

కుప్పం : బస్సు కదలాలంటే.. నెటాల్సిందే!

image

కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో డొక్కు బస్సులతో ప్రయాణికులకు నిత్యం అగచాట్లు తప్పడం లేదు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో 50 కి పైగా బస్ సర్వీసులను పెంచారు. కండీషన్‌లో లేని బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కుప్పం క్రిష్ణగిరి మధ్య రాకపోకలు సాగించే అంతర్ రాష్ట్ర బస్ శనివారం ఆర్టీసీ బస్టాండ్లో మొరాయించడంతో ఇదిగోండి ఇలా తోసి స్టార్ట్ చేశారు.

News August 10, 2024

తిరుమలలో ఆర్జితసేవలు రద్దు: టీటీడీ

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 15న తిరుప్పావడతోపాటు ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయని టీటీడీ తెలిపింది.

News August 10, 2024

ఏర్పేడు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్‌కు దరఖాస్తులు

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బిటెక్ EEE/ డిప్లమాEEE పూర్తిచేసిన అభ్యర్థుల అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 18.

News August 10, 2024

చిత్తూరు: వ్యక్తి ప్రాణం తీసిన జల్లికట్టు

image

జల్లుకట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన యాదమరిలో చోటుచేసుకుంది. కొట్టాలలో మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరలో జల్లికట్టు నిర్వహించారు. దీనికి తమిళనాడు సరిహద్దు పరిసర ప్రాంతాల, మండలంలోని ఎద్దులు అధిక సంఖ్యలో వచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగారుపాళెంకు చెందిన దిలీప్‌కుమార్(40)పైకి దూసుకెళ్లింది. ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు.

News August 10, 2024

చిత్తూరులో 13న జాబ్ మేళా

image

చిత్తూరు నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ తెలిపారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కరూర్ వైశ్య బ్యాంకు, ఎన్ఎస్ ఇన్స్ట్రూమెంట్స్ కంపెనీలలో పలు పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

News August 10, 2024

తిరుపతి: B.Tech ఫలితాలు విడుదల

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో ఈ ఏడాది మే నెలలో బీటెక్ (B.Tech) ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు మహిళ యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 10, 2024

తిరుపతి: మెరిట్ లిస్ట్ విడుదల

image

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో పారామెడికల్ DANS/DLMT కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మెరిట్ లిస్ట్‌ను https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ పొందవచ్చని సూచించారు.