Chittoor

News August 9, 2024

తిరుమల చేరుకున్న గోవా రాష్ట్ర మంత్రి 

image

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్ధం గోవా రాష్ట్ర మంత్రి విశ్వజిత్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహాల వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బసచేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేకం సేవలో దర్శించుకోనున్నారు.

News August 8, 2024

తిరుమల చేరుకున్న గోవా రాష్ట్ర మంత్రి 

image

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్ధం గోవా రాష్ట్ర మంత్రి విశ్వజిత్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహాల వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బసచేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేకం సేవలో దర్శించుకోనున్నారు.

News August 8, 2024

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి CRPF భద్రత..?

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేంద్ర హోం శాఖ CRPF భద్రత కల్పించినట్టు సమాచారం. ఇటీవల పుంగనూరులో అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల నుంచి హాని ఉందని.. భద్రత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

News August 8, 2024

విదేశాల నుంచి తిరిగి వచ్చిన రోజా

image

మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గానికి చేరుకున్నారు. నిండ్ర మండలం జీఎన్ కండ్రిగ, వైఎన్ కండ్రిగ గ్రామాల్లో గురువారం పర్యటించారు. వైఎన్ కండ్రిగకు చెందిన వైసీపీ కార్యకర్త పవన్ అనారోగ్యంతో చికిత్స పొందగా ఆయనను రోజా పరామర్శించారు. అనంతరం GNకండ్రిగకు చెందిన కోనమ్మ మృతిచెందగా వారి కుటుంబాన్ని ఓదార్చారు. కార్యకర్తలకు అండగా ఉండాల్సిన సమయంలో రోజా విదేశాల్లో ఉన్నారంటూ ఓ ఫొటో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే.

News August 8, 2024

పీఎం విశ్వకర్మ యోజనకు రిజిస్ట్రేషన్ చేసుకోండి: చిత్తూరు కలెక్టర్ 

image

పీఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధిపొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ తెలిపారు‌. 5 శాతం వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్ అందిస్తారని చెప్పారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతి వృత్తుల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు.

News August 8, 2024

రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

image

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. భాను ప్రకాశ్ రెడ్డి, కోలా ఆనంద్ తదితరులు శ్రీకాళహస్తీశ్వర స్వామి శేష వస్త్రంతో సన్మానించి.. స్వామివారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, పుల్లయ్య నాయుడు, హరీష్, భరత్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

News August 8, 2024

బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్సీ

image

కుప్పం-తిరుపతి బస్సు సర్వీసును ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఆయన రిబ్బన్ కట్ చేసి, పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సును నడిపారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం పెంచులయ్య, సీఎంఏ నరసింహులు, కౌన్సిలర్లు జిమ్ దాము, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

News August 8, 2024

త్వరలో తిరుపతికి ఓబరాయ్ హోటల్స్

image

తిరుపతిలో ఏడు నక్షత్రాల ఓబెరాయ్ హోటల్స్ కు స్థలాన్ని కేటాయించినా గత ప్రభుత్వంలో కొన్ని కారణాలు చేత ప్రాజెక్టు అటకెక్కింది. ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్వీ జూపార్కు సమీపంలో (దేవలోక్) ఓబెరాయ్ హోటళ్ల కోసం కేటాయించిన స్థలాన్ని టూరిజం, రెవిన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పరిశీలించారు. సంబంధిత అధికారులకు కలెక్టర్ తగు సూచనలు చేశారు.

News August 8, 2024

తిరుపతి సెబ్ డీఎస్పీ బదిలీ

image

తిరుపతి సెబ్ డీఎస్పీ వెంకటాద్రిని రేణిగుంటకు బదిలీ చేస్తూ DGP ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా రేణిగుంట DSP భావ్య కిశోర్ రాజమండ్రికి, పుత్తూరు శ్రీనివాస రావు CID DSPగా, RSASTF DSP రవిబాబు పుత్తూరుకు, సెబ్ DSP వెంకటనారాయణను తిరుపతి డిఎస్పీగా బదిలీ అయ్యారు.

News August 8, 2024

పలమనేరు: 19మంది మెప్మా సిబ్బందిపై వేటు

image

‘డాయ్’ యాప్ మోసాలపై మెప్మా సిబ్బందిపై వేటు పడింది. డాయ్ యాప్ మోసాలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. దీని మేరకు సిటీ మిషన్ మేనేజర్ ఉమేష్ జాదవ్, ముగ్గురు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజేశ్, 14 మంది ఆర్పీలను తొలగించేలా మెప్మా పీడీ ఆదేశాలను జారీ చేశారు. అలాగే వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశించారు.