Chittoor

News February 3, 2025

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచారంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆదివారం ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

News February 2, 2025

పుంగనూరుకు చేరుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు

image

సోమల మండలంలో జరుగు ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేరుకున్నారు. ఆయనతోపాటు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ చదల్ల గ్రామంలోని ఎం. వేణుగోపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సోమల బహిరంగ సభలో పాల్గొననున్నారు.

News February 2, 2025

నేడు పుంగనూరుకు రానున్న జనసేన అగ్రనాయకత్వం

image

సోమల ZP హైస్కూల్‌లో ఇవాళ ‘జనంలోకి జనసేన’ భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతోపాటూ పార్టీ అగ్రనాయకత్వం తరలిరానున్నారు. నాయకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభలో నేతలు ఏం మాట్లాడుతారన్న చర్చ ఆసక్తిగా మారింది. టిడ్కో ఛైర్మన్ అజయ్, తిరుపతి MLA ఆరిని శ్రీనివాస్, ఉ.చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌లు హాజరుకానున్నారు. 

News February 2, 2025

గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి: చిత్తూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాల పురోగతి పై ప్రత్యేక దృష్టి సారించిందని, రానున్న మూడు నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన ఇంటి నిర్మాణాలు చేపట్టి పురోగతి సాధించాలని హౌసింగ్, ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం హౌసింగ్ డిమాండ్ సర్వే, గృహ నిర్మాణ పురోగతి పై హౌసింగ్ పీడీ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News February 1, 2025

చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన నగరి DSP 

image

చిత్తూరు జిల్లా సచివాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను నగరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఎస్పీ మహమ్మద్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. నగరి డివిజన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందికర సమస్యలు ఉంటే తనను సంప్రదించవచ్చని, తగిన న్యాయం చేస్తామని తెలిపారు. తాను ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటానని తెలిపారు.

News January 31, 2025

పింఛన్ల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ 

image

ఫిబ్రవరి 1న సామాజిక పింఛన్ల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో పింఛన్ల పంపిణీ పై సమీక్షించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని 2.66 లక్షల మంది లబ్ధిదారులకు రూ.113 కోట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి రోజే 100 శాతం పంపిణీ జరిగేలా చూడాలన్నారు.

News January 31, 2025

చిత్తూరు: జైలు నుంచి వచ్చి మళ్లీ దొంగతనం

image

చోరీ కేసులో నిందితులను గురువారం చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. DSP సాయినాథ్ వివరాల మేరకు.. గతంలో చిత్తూరులో బైకులు చోరీ చేసిన కేసుల్లో ఏలూరుకు చెందిన గౌస్ మొహిద్దిన్, రైల్వేకోడూరుకు చెందిన మణికంఠ అరెస్ట్ అయ్యారు. కాగా వారు ఈనెల 16న జైలు నుంచి విడుదలై 17న చిత్తూరు సెల్వరాజ్ ఇంట్లో చోరీచేశారు. దీంతో నిందితులని పట్టుకుని 238గ్రాముల వెండి, 65 గ్రాముల బంగారు ఆభరణాలు సీజ్ చేశామన్నారు.

News January 31, 2025

ఆ కారణంతోనే మాపై కేసులు: ఎంపీ మిథున్ రెడ్డి

image

రాజకీయ కక్షతోనే చంద్రబాబు తమపై కేసులు పెడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. మంగళంపేటలో 75 ఎకరాలు కొన్నామని, ఈ భూమి అటవీశాఖకు సంబంధించినది కాదని అన్నారు. తమ ఊర్లో హాస్పిటల్‌ నిర్మాణానికి రూ.15 కోట్ల విలువైన భూమిని ఇచ్చామని, అలాంటిది కేవలం రూ.3 కోట్ల భూమిని కబ్జా చేశామని చెప్పడం సరికాదన్నారు.

News January 31, 2025

TDPకి పెద్దిరెడ్డి వార్నింగ్

image

YCP శ్రేణలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదని, వారి జోలికి వస్తే TDP భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించిన CMచంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ నేత పురందీశ్వరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తనపై వస్తున్నవన్ని తప్పుడు ఆరోపణలని ఆయన మరోమారు స్పష్టం చేశారు.

News January 30, 2025

బైరెడ్డిపల్లిలో విషాదం 

image

చిన్నారి మృతి చెందిన ఘటన బైరెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. T.N.కుప్పం గ్రామానికి చెందిన రాజేశ్, రూప దంపతుల కుమార్తె వైష్ణవి(10) కి జ్వరం రావడంతో ఇద్దరు RMP డాక్టర్ల వద్ద చూపించారు. రెండు రోజులైన జ్వరం తగ్గకపోవడంతో పలమనేరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి ఆమె ఆరోగ్యం క్షిణించిందని వైద్యులు సూచించారు. పెద్దాసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది.