Chittoor

News January 30, 2025

చిత్తూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం

image

కార్వేటి నగరం మండలం సిద్దగుంట గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. జనార్దన్ అనే వ్యక్తి తన ఇంట్లో ఓ మహిళ చేత క్షుద్ర పూజలు చేయిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గత మూడు నెలలుగా ఇదేవిధంగా మహిళ చేత క్షుద్ర పూజలు చేయిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

News January 30, 2025

చిత్తూరు:TISలో మార్పులకు అవకాశం

image

ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు TIS లాగిన్‌లో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, నగరపాలక సంస్థ పరిధిలోని టీచర్లు TIS లాగిన్‌లో ఈ నెల 31 లోపు మార్పులు చేసి, సబ్మిట్ చేయాలన్నారు. TIS వివరాల ఆధారంగానే టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయన్నారు.

News January 30, 2025

విద్యార్థినిలకు చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు సమస్యలు ఉంటే వారు సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయంలో మిషన్ వాత్సల్య పథకం అమలు తీరుపై సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులను వేధించడం, ఈవ్ టీజింగ్ వంటి సమస్యలు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.

News January 29, 2025

చిత్తూరు: కూతురిని రూ. 25 వేలకు అమ్మిన కసాయి తండ్రి

image

కూతురిని రూ. 25 వేలకు అమ్మిన కసాయి తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య దంపతులకు ముగ్గురు మగ పిల్లలు, ఏడుగురు ఆడపిల్లలు సంతానం. నగరి సమీపంలో రమణయ్య కుటుంబం బాతులు మేపుతుండేవారు. భార్య అనారోగ్యం కావడంతో తన ఐదో కూతురు మల్లిక(10)ను నగరికి చెందిన బాలాజీకి రూ.25 వేలకు అమ్మాడు. చిన్నారిని గ్రామస్థులు రక్షించి పోలీసులకు అప్పగించారు. RK పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 29, 2025

ఎవ్వరూ అధైర్య పడొద్దు: పెద్దిరెడ్డి

image

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంగళవారం తిరుపతిలో బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేశ్ కలిశారు. రానున్న రోజుల్లో పుంగనూరులో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలపై పెద్దిరెడ్డి దిశా నిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తమ కుటుంబం ఎల్లప్పుడు అండగా ఉంటుందని పెద్దిరెడ్డి చెప్పినట్లు రాజేశ్ తెలిపారు.

News January 28, 2025

చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. క్లీనర్ స్పాట్ డెడ్

image

చంద్రగిరి మండలం, మామండూరు జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి కోళ్లు లారీ ఢీకొట్టింది. దీంతో కోళ్లు లారీ క్లీనర్ వెంకటేశ్ క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.‌ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

News January 27, 2025

చిత్తూరు: ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి

image

చిత్తూరు నగరపాలక పరిధిలో సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఆసక్తిగల అభ్యర్థులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. రూ.2.50 లక్షలు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణం అందిస్తామన్నారు. ఆసక్తిగలవారు వార్డ్ పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు వార్డ్ అమినిటి కార్యదర్శిని కలవాలన్నారు.

News January 26, 2025

చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

చిత్తూరు నగరం మురుకంబట్టు సమీపంలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన విద్యార్థిని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. దీంతో ఆదివారం ఉరేసుకుని మృతి చెందిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 26, 2025

బంగారుపాలె: లోయలోకి దూసుకెళ్లిన లారీ  

image

బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో ఒకరు మృతి చెందారు. బెంగళూర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ అతివేగంగా రావడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News January 26, 2025

చిత్తూరు: పెళ్లి పేరుతో వంచన

image

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై పొక్సో కేసు నమోదైన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. కలికిరి సీఐ రెడ్డి శేఖరరెడ్డి వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన యువతి కలికిరి మండలంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వాయల్పాడులో ఇంటర్ చదువుతోంది. ఈక్రమంలో అమ్మమ్మ ఊరిలోని జునైద్ అహమ్మద్‌తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని వంచించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.