Chittoor

News August 3, 2024

చిత్తూరు: బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు

image

బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్ వద్ద బెంగళూరు నుంచి వెళ్తున్న బస్సు వేకువ జామున బోల్తా పడింది. మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా, 13 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

News August 3, 2024

చిత్తూరు : వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

చిత్తూరు జిల్లాలోని డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) నందు -9 పోస్టులు, మిషన్ శక్తి ప్రాజెక్టు కింద -9 పోస్టులు, ICDS – నందు 8 మొత్తం 26 కాంట్రాక్ట్ ప్రాతిపదికగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 10.

News August 3, 2024

తిరుపతి : B.Tech డైరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

image

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నందు 2024-25 విద్యా సంవత్సరానికి B.Tech డైరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ చంగల్ రాయులు ప్రకటనలో పేర్కొన్నారు. AP EAPCET-2024 ప్రవేశపరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 12.

News August 3, 2024

మదనపల్లె వైస్ ఛైర్మన్‌పై ఏడు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో పైళ్ల దగ్ధం కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఫైళ్ల దగ్ధంకు సంబంధించి మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక వెంకటచలపతిపై వన్ టౌన్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. జింక చలపతిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదు కాగా మాధవ రెడ్డి, బాబ్జాన్ తదితరులు పరారీలో ఉన్నారు.

News August 3, 2024

భక్తుల సౌకార్యాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు

image

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి శ్యామల రావు శుక్రవారం తనిఖీ చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై భక్తులను ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

News August 3, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నిర్వహించే వేడుకలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశా నిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టరేట్లో పోలీసు పెరెడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పై శుక్రవారం జిల్లా వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News August 2, 2024

తిరుపతి: ట్రాఫిక్ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి

image

తిరుపతి స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రెడ్డి నాయక్ విధి నిర్వహణలో ఉంటూ గుండెపోటుకు గురయ్యారు. సిబ్బంది హుటాహుటిన ఆయనను రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రిలో ఎస్ఐ మృతదేహానికి ఎస్పీ సుబ్బారాయుడు పూలమాలలు వేసి, గౌరవ వందనం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News August 2, 2024

పుంగనూరు: తహసిల్దారుల నియామకం

image

నియోజకవర్గంలో పలు మండలాలకు నూతన తహశీల్దార్లను కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమలకు బెన్ను రాజ్, చౌడేపల్లికి హనుమంతు, సదుంకు కులశేఖర్ ను నియమించారు. జిల్లాలో 30 మంది తహశీల్దార్లకు పోస్టింగులు ఇచ్చారు.

News August 2, 2024

SVU: డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జులైలో జరిగిన డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. B.A, B.COM, BSC, BCA, BBA, BA 2, 4వ సెమిస్టర్ల ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 2, 2024

పెద్దిరెడ్డి భయపెట్టినా నన్ను గెలిపించారు: ఆదిమూలం

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి రూ.కోట్ల విలువైన మద్యం, డబ్బు ఎన్నికల్లో పంచి నన్ను ఓడించాలనుకున్నారు. భయపెట్టినా సరే ప్రజలు నన్ను గెలిపించారు. ఆయన పుంగనూరులో గెలిచినా అక్కడ ప్రజల్లో తిరగలేకుండా ఉన్నారు. ఇదంతా కర్మ ఫలం’ అని బీఎన్ కండ్రిగలో జరిగిన పింఛన్ల పంపిణీలో ఆదిమూలం ఈ వ్యాఖ్యలు చేశారు.