Chittoor

News August 2, 2024

తిరుపతి: ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో MSc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ మేరకు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. GAT-B 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు www.spmvv.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 10.

News August 2, 2024

పెన్షన్ పంపిణీలో చిత్తూరుకు 7, తిరుపతికి 8వ స్థానం

image

రాష్ట్రవ్యాప్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు 7వ స్థానం, తిరుపతి జిల్లాకు 8వ స్థానం లభించినట్లు జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 270619 మంది ఉండగా 264268 మందికి పెన్షన్ పంపిణీ జరిగినట్లు తెలిపారు. 97.67 శాతం పంపిణీతో 7వ స్థానంలో చిత్తూరు జిల్లా ఉన్నట్లు తెలిపారు. 267772 మందికిగాను 261291 పంపిణీ చేసి 97.58 శాతంతో 8వ స్థానంలో తిరుపతి జిల్లా ఉన్నట్లు తెలిపారు.

News August 1, 2024

SVU : PG ఫలితాలు విడుదల

image

తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది (PG) ఎం ఫార్మసీ (M.Pharmacy) 3, 4, M.A, M.COM 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 1, 2024

పూతలపట్టులో విషాదం.. వ్యక్తి మృతి

image

పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు హరిజనవాడలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మామిడి తోటలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు తన నోట్లో పురుగుల మందు పిచికారి చేసుకోవడంతో అస్వస్థతకు గురి అయ్యాడు. రంగంపేటలోని ఓ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

News August 1, 2024

కుప్పం – పలమనేరు హైవేపై ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం <<13742093>>మండలం<<>> గుండి శెట్టిపల్లి వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాళ్లబూదుగూరు ఎస్సై నరేశ్ తెలిపారు.

News August 1, 2024

తిరుపతి: సాయంత్రం 4 గంటలకు 96.98% పెన్షన్ పంపిణీ

image

తిరుపతి జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 96.98% పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి: తిరుపతి(R)96.32, శ్రీకాళహస్తి(M)98.05, తిరుపతి(M)97.67, రేణిగుంట 96.79, చంద్రగిరి 96.74, వెంకటగిరి 97.21, నాయుడుపేట 97.58, వడమాల పేట 96.55 పంపిణీ చేసినట్లు తిరుపతి కలెక్టర్ యస్. వెంకటేశ్వర్ తెలిపారు.

News August 1, 2024

కుప్పం: 18 మంది సస్పెండ్

image

సీఎం చంద్రబాబు సమక్షంలో నిన్న టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు ఎంపీటీసీలను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేసిన కుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన 13 మంది ఎంపీటీసీలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

News August 1, 2024

చిత్తూరు జిల్లాలో ఉదయం 11 కే 90.28% పెన్షన్ పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. ఉదయం 11 గం. ల వరకు 90.28% పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి-96.97, నగరి-94.99, విజయపురం-94.43, చిత్తూరు -94, పుంగనూరు-92, పెద్దపంజాని -92, కార్వేటినగరం-92, ఐరాల-92, నిండ్ర-92, పుంగనూరు-91, పులిచెర్ల-91, పలమనేరు-91, సోమల-91 పంపిణీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

News August 1, 2024

పనులకు ప్రతిపాదనలు పంపండి: జడ్పీ ఛైర్మన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీల పరిధిలో రూ.30 లక్షలు, ఎమ్మెల్యేల పరిధిలో రూ.50 లక్షల పనులు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. ఇందులో 50 శాతం పనులు వాటర్ వర్క్స్, మిగిలినవి రోడ్లు, కాలువల పనులకు వాడుకోవాలన్నారు. మండలాల వారీగా జడ్పీటీసీలు సంబంధిత పనుల వివరాలు, అంచనా వ్యయంతో వివరాలను సిద్ధం చేసి రెండు వారాల్లోపు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News August 1, 2024

8న చిత్తూరు జిల్లాలో SMC ఎన్నికలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఆగస్టు 8న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ వెంకట రమణారెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.