India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న రాస్ భవనంలో కృత్రిమ కాలు ఇవ్వడానికి ఈనెల 27వ తేదీన క్యాంపు నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాస్ ప్రతినిధులు కోరారు. అర్హులైన దివ్యాంగులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వైద్య సర్టిఫికెట్, వికలత్వం కనిపించేలా రెండు ఫొటోలు తీసుకొని రావాలని సూచించారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చిలో PG M.A, M.Sc 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
పీలేరు మండలం, కావలిపల్లె పంచాయతీ, ఒంటిల్లులో టీడీపీ నేత గిరి నాయుడుపై జరిగిన హత్యాప్రయత్నంపై డీఎస్పీ రామచంద్ర రావు విచారణ చేపట్టారు. హత్యాయత్నం ఘటన జరిగిన ఇంటిని డీఎస్పీ, పీలేరు సీఐ మోహన్ రెడ్డి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు మాస్కులు, గ్లౌజులు తొడిగి ఉన్నట్లు బాధితుడు పోలీసులకు చెప్పారు. నిందితులతో తాను ప్రతిఘటించానని, వారు తమ ద్విచక్ర వాహనాల్లో పరారీ అయ్యారన్నారు.
తిరుపతి పద్మావతి నగర్కు చెందిన టీపీ దాస్, మోహన్(35) అన్నాదమ్ముళ్లు. మోహన్ ఇటీవల రెండో పెళ్లి చేసుకోగా.. ఆమె వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయాడు. నిన్న సాయంత్రం అన్నతో కలిసి మద్యం తాగాడు. తరువాత దాసు బయటకు వెళ్లాడు. అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిన అన్న భార్య సునీత(40), కూతుళ్లు దేవశ్రీ(13), నీరజ(10)లను మోహన్ కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో 10 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తిరుపతి, రేణిగుంట, పాకాల, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం గూడూరు, సూళ్లూరుపేట స్టేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిని ఆధునికరించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తి వివరాలను దాచిపెట్టి ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని బీసీవై అధినేత రామచంద్రయాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా బుధవారం విచారణ జరిగింది. ఈ విచారణకు ఇరువర్గాల న్యాయవాదులతో పాటు పుంగనూరు రిటర్నింగ్ అధికారి హైకోర్టుకు హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.
తిరుపతి పద్మావతి వర్సిటీ సమీపంలోని మునిరెడ్డి నగర్లో బుధవారం రాత్రి జరిగిన హత్యల ఘటనా స్థలాన్ని ఎస్పీ సుబ్బారాయుడు పరిలించారు. ఘోర ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యలకు ఆస్తి గొడవలా? లేక అక్రమ సంబంధమా? అనే కోణంలో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం ఘటనలో పోలీసులపై వేటు పడింది. సబ్ కలెక్టరేట్కు వన్ టౌన్ CI వల్లీబాషా పటిష్ఠ బందోబస్తు కల్పించలేదని గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనను వీఆర్కు పంపించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం లేకపోవడం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం వంటి అభియోగాలను ఆయనపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అలాగే మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేశారని సమాచారం.
అన్నప్రసాదాల తయారీలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్మిల్లర్లతో ఈవో బుధవారం సమావేశం నిర్వహించారు. ఏపీ, టీఎస్కు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దన్నర కాలం నాటివి కావడంతో వాటికి మరమ్మతులు చేయాలని అక్కడి సిబ్బంది ఈవో దృష్టికి తీసుకెళ్లారు.
ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు 27వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ MLT పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 870 ఉద్యోగాలు ఉన్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.