Chittoor

News December 28, 2024

చిత్తూరు: 30 నుంచి దేహదారుడ్య పరీక్షలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలకు ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. 990 మంది మహిళలు, 4248 మంది పురుషులు జిల్లా పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ మేరకు సిబ్బందికి పోలీసు గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు.

News December 28, 2024

తిరుపతి: విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్ అరెస్ట్

image

తిరుపతి వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొ.ఉమామహేశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన విద్యార్థి వర్సిటీలో మొదటి సం.చదువుతోంది. ఆమె తరగతి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రొ. లైంగింకంగా వేధించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News December 27, 2024

మాజీ మంత్రి రోజా కుమార్తెకు గ్లోబల్ అవార్డు

image

మాజీ మంత్రి ఆర్‌కే రోజా కుమార్తె అన్షు మాలిక సామాజిక ప్ర‌భావానికి సంబంధించిన గ్లోబ‌ల్ ఎంట్ర‌ప్రెన్యూర్స్ అవార్డ్ గెలుచుకున్నారు. దీంతో ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. అన్షు మాలిక‌కు గ్లోబ‌ల్ ఎంట్ర‌ప్రెన్యూర్స్ అవార్డు రావడంతో ఎంతో ఆనంందంగా ఉందని అన్నారు. ఆమె కృషి, పట్టుదల ఫలించాయని అన్నారు. ఆనంతరం అభినందనలు తెలిపారు.

News December 27, 2024

మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2010 సెప్టెంబర్ 1న జిల్లాలో రెండు ప్రధాన అభివృద్ధి పనులు ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు. రెండోది మన్నవరం ఎన్టీపీసీ-భెల్‌ ప్రాజెక్టు పనులను మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

News December 27, 2024

కాలినడకన తిరుమల చేరుకున్న పీవీ సింధు

image

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన గురువారం తిరుమలకు చేరుకున్నారు. నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.

News December 25, 2024

అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన

image

తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.’ అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు.

News December 25, 2024

తిరుపతి: వైకుంఠ ఏకాదశికి పటిష్ఠ బందోబస్తు

image

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో తోపులాటలు చోటు చేసుకోకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించేలా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి క్యూ లైన్లలో తోపులాటలు జరపకుండా టోకెన్లు పొందాలని సూచించారు. టీటీడీ, పోలీసుల సూచనలు పాటించాలన్నారు.

News December 25, 2024

చిత్తూరు: వార్షిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ

image

చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మణికంఠ వార్షిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరించాలన్నారు. చోరీలకు అడ్డకట్టవేసేలా నిఘా పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేశారు.

News December 24, 2024

PV.సింధు దంపతులను కలిసిన మాజీ మంత్రి రోజా

image

హైదరాబాదులోని అన్వయ కన్వెన్షన్ హాల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV.సింధూ, వెంకట దత్త సాయి దంపతులను మాజీ మంత్రి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.

News December 24, 2024

టీటీడీలో ఫుడ్ సేఫ్టి విభాగం ఏర్పాటు

image

టీటీడీలో త్వరలో ఫుడ్ సేఫ్టి విభాగం ఏర్పాటు చేసి సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీస‌ర్‌ పోస్టు నియమించుకునేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం రూ.3.36 కోట్ల‌తో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదం. ఒంటిమిట్ట ఆలయ విమాన గోపురానికి రూ.43 ల‌క్ష‌ల‌తో బంగారు కలశం ఏర్పాటు. ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి 3.60 ఎకరాల స్థలానికి నిర్ణ‌యించిన రూ.20కోట్ల‌కు పైగా ఉన్న‌ లీజు ధరను తగ్గించాలి.