Chittoor

News April 6, 2025

సీతారాముడికి చిత్తూరు ఎస్పీ పూజలు 

image

చిత్తూరు నగరంలోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఎస్పీ మణికంఠ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, రాజశేఖర్ రాజు, డీఎస్పీ సాయినాథ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News April 6, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.184లు ఉండగా, బ్రాయిలర్ స్కిన్ లెస్ కిలో రూ.210గా ఉంది. లేయర్ మాంసం కిలో రూ.178లకు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800 నుంచి 900 వరకు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతాలలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News April 5, 2025

శ్రీరామనవమి వేడుకలు.. చిత్తూరు SP సూచనలు 

image

చిత్తూరు జిల్లా ప్రజలకు SP మణికంఠ చందోలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమిని చైత్రశుద్ధ నవమి రోజున ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని ఈ పండుగ మనకు ధర్మాన్ని ఆచరించాలనే సందేశం ఇస్తుందని SP అన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు వేడుకలు చేసుకోవాలని ఆయన సూచించారు. 

News April 5, 2025

గ్రూప్ -2 కు ఎంపికైన చౌడేపల్లి కానిస్టేబుల్

image

గ్రూప్-2 పరీక్షలలో చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆదినారాయణ ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చురుగ్గా పాల్గొంటూ.. అటు గ్రూప్‌-2లో ప్రతిభ చూపాడు. ఆయనను సీఐ రాంభూపాల్, ఎస్సై నాగేశ్వరరావుతో పాటు సహచర సిబ్బంది అభినందించారు. 

News April 5, 2025

SR పురం : తండ్రిని హత్య చేసిన కుమారుడు అరెస్ట్

image

SRపురం మండలం పాపిరెడ్డిపల్లెలో శ్రీనివాసులు (60)ను కొడుకు నాగరాజు బుధవారం హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తండ్రి తరచూ మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టేవాడు. అది సహించలేక నాగరాజు తండ్రి తలపై ఇటుకతో కొట్టాడు. తీవ్రంగా గాయపడి శ్రీనివాసులు మృతిచెందగా..మృతుని అన్న ఫిర్యాదుతో కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్సై సుమన్ నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 5, 2025

హుబ్లీ రైల్వే డివిజన్ సభ్యునిగా ఎమ్మెల్సీ భరత్

image

హుబ్లీ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహా కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ నియమితులయ్యారు. రాష్ట్ర శాసనసభ జనరల్ సెక్రటరీ సిఫార్సు మేరకు ఈ నియామకం చేసినట్లు నైరుతి రైల్వే డివిజనల్ మేనేజర్ అరవింద హెర్లె శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

News April 5, 2025

ప్రమాదకరంగా చిత్తూరు-పుత్తూరు రోడ్డు

image

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారి ప్రమాదకరంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ గుంతలు తీసి మట్టిని రోడ్డుపై వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News April 4, 2025

చిత్తూరు: 11 లోపు అభ్యంతరాలు చెప్పండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీ, మున్సిపాలిటీ, నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ/లాంగ్వేజ్ పండిట్స్/పీఈటీల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపు తన కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఉపాధి పనులు

image

చిత్తూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద రూ.150 కోట్లతో మెటీరీయల్ కాంపొనెంట్ పనులను చేపట్టనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి పనుల మంజూరులో MLA, MLC అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో ప్రత్యేక అధికారుల నియామకం

image

వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం డివిజన్‌కు ఒక్కో అధికారిని నియమిస్తూ చిత్తూరు డీఎంహెచ్ఓ సుధారాణి ఉత్తర్వులు జారీ చేశారు. జీడీ నెల్లూరు డివిజన్‌కు డీఐఓ హనుమంతరావు, పలమనేరుకు టీబీ అధికారి వెంకటప్రసాద్, కుప్పంకు గంగాదేవి, చిత్తూరుకు అనుష, నగరికి నవీన్ తేజ్, పూతలపట్టుకు గిరి, పుంగనూరుకు అనిల్ కుమార్‌ను నియమించారు.