Chittoor

News December 24, 2024

టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు

image

* టీటీడీ ఆల‌యాలు, ఆస్తుల GLOBAL EXPANSION కోసం అవసరమైన సూచనల కొరకు నిపుణుల‌తో క‌మిటీ ఏర్పాటు. * దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం. * స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు. * టీటీడీ వైద్యులు, సిబ్బంది నియామకం, పరికరాలు కొనుగోలు. * భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు.

News December 24, 2024

చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నేడు ఆప్షనల్ సెలవు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఇవాళ ఆప్షనల్ సెలవును ప్రకటిస్తున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. తప్పనిసరిగా అన్ని పాఠశాలలు సెలవు ప్రకటించాలని ఆమె ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవన్నారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ఈ నిబంధన వర్తించదు.

News December 24, 2024

తిరుపతిలో వ్యభిచారం.. ఒకరి అరెస్ట్

image

తిరుపతి నగరంలో మరోసారి వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. నగరంలోని సత్యనారాయణపురంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. ఈక్రమంలో ఇద్దరు అమ్మాయిలతో కుమారి అనే మహిళ ఈ తంతు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుమారిని అరెస్ట్ చేశారు. ఇద్దరు అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కింద కేసు నమోదు చేసినట్లు అలిపిరి పోలీసులు వెల్లడించారు.

News December 24, 2024

కరుణ, త్యాగానికి ప్రతి క్రిస్మస్: తిరుపతి కలెక్టర్

image

కరుణ, ప్రేమ మార్గం జీసస్ మార్గం అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హై టీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, చర్చి పాస్టర్లు, పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

News December 23, 2024

చంద్రగిరి: హైవేపై ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

చంద్రగిరి మండలం, కోదండరామాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై తిరుపతికి వస్తున్న దంపతుల్లో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. కొంత దూరం వెళ్లి కారు వదిలి డ్రైవర్ పరారయ్యాడు. మృతుడు తిరుచానూరుకు చెందిన బాలాజీగా పోలీసులు గుర్తించారు‌. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 23, 2024

CTR: ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

చిత్తూరు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని హాస్పిటల్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్-03, ఫిమేల్ నర్సింగ్-07, సానిటరీ అటెండర్‌ కం వాచ్మెన్-06 మొత్తం 16 ఖాళీలు ఉన్నట్లు వివరించారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 27 అని పేర్కొన్నారు.

News December 22, 2024

చిత్తూరు: ఈ లెటర్ మీ ఇంటికి వచ్చిందా.. జాగ్రత్త

image

చిత్తూరు జిల్లాలో సైబర్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం మోసాలనే చూశాం. ఇది వాటికి మించినది. సైబర్ నేరగాళ్లు మీ ఇంటి ముందు ఓ ప్రముఖ కొరియర్ ఫాం పడేసి డెలివరి డేట్ మార్చాలనో లేదా అడ్రస్ మార్చాలనో అడుగుతారు. పొరపాటున మీరు ఫాంపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేశారో అంతే సంగతులు. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయం. ఇలాంటి వాటిపై తస్మాస్ జాగ్రత్త.

News December 22, 2024

మదనపల్లె: డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీ 

image

SVU పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో యథ్చేచ్చగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మదనపల్లెలో కొన్ని కాలేజీలలో యాజమాన్యాలు సీపీ కెమెరాలు ఆఫ్ చేయించి మరీ పరీక్షలు రాయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై SVU పరీక్షల నియంత్రణ అధికారి కిశోర్‌ను వివరణ కోరగా.. ఈ అంశం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

News December 22, 2024

చిత్తూరు: తండ్రే హత్య చేయించాడు.?

image

పుంగనూరు(M) లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో శనివారం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడిని మదనపల్లె(M) గుంపులపల్లె సోమశేఖర్‌రెడ్డి(36)గా పోలీసులు గుర్తించారు. తాగుడుకు బానిసై కుటుుబీకులను వేధిస్తుండటంతో అతడి తండ్రే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల మధ్య డబ్బు కోసం గొడవ జరగ్గా ఈ విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తోంది. సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.

News December 22, 2024

చిత్తూరు: నేటి నుంచి టీచర్లకు కౌన్సెలింగ్

image

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న పలు కేడర్ టీచర్లకు నేడు, రేపు (ఆది, సోమవారం) ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు HMగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. సీనియార్టీ జాబితాను ఇప్పటికే ఎంఈఓలకు పంపామన్నారు.