Chittoor

News September 4, 2025

చిత్తూరు జిల్లా విద్యార్థులకు గమనిక

image

చిత్తూరు జిల్లా విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని DEO వరలక్ష్మి కోరారు. దరఖాస్తుకు సర్టిఫికెట్లు అవసరం లేదని, పరీక్ష రాసే సమయానికి అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ పిల్లలు రూ.50 పరీక్ష ఫీజు ఆన్‌లైన్ అప్లికేషన్ సమయంలో ఇచ్చే ఎస్బీఐ కలెక్ట్ లింక్‌లోనే చెల్లించాలన్నారు.

News September 4, 2025

చిత్తూరు జిల్లాలో 6 బార్లకు రీనోటిఫికేషన్

image

చిత్తూరు జిల్లాలోని ఆరు బార్లు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు రీనోటిఫికేషన్ జారీ చేశారు. చిత్తూరు నగరంలో 5, పలమనేరులో ఓ బార్ ఏర్పాటుకు ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రూ.5.10 లక్షల నాన్ రీఫండబుల్ రుసుము చెల్లించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 4, 2025

చిత్తూరు జిల్లాలో లోకల్ వార్..!

image

చిత్తూరు జిల్లాలో పల్లె రాజకీయం జోరందుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం 3నెలల ముందే నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో జనవరిలోనే <<17606799>>‘పల్లె పోరు’<<>> జరిగే ఛాన్సుంది. జిల్లాలో 697 పంచాయతీలు(సర్పంచ్ స్థానాలు) ఉన్నాయి. వీటితో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. చిత్తూరు కార్పొరేషన్, నగరి, పుంగనూరు, పలమనేరు, కుప్పం మున్సిపాల్టీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది.

News September 4, 2025

ఆ కంపెనీలకు తాళాలు వేస్తాం: చిత్తూరు MLA

image

చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు ఆశించిన మేర ధర లభించలేదు. గతంలో ప్రభుత్వం స్పందించి మద్ధతు ధర రూ.8గా నిర్ణయించింది. అన్ని మామిడి పల్ఫ్ కంపెనీలు(గుజ్జు పరిశ్రమలు) ఈ ధర చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికీ కొన్ని కంపెనీలు రూ.8 ఇవ్వడం లేదని చిత్తూరు MLA జగన్‌మోహన్ తెలిపారు. రూ.8 చొప్పున ఇవ్వన కంపెనీలకు తాళాలు వేస్తామని MLA హెచ్చరించారు. కంపెనీలు ఎలా స్పందిస్తాయో మరి.

News September 4, 2025

ఎంపీడీవోలు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వివిధ మౌలిక వసతుల కల్పన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. బుధవారం చిత్తూరులోని జడ్పీ కార్యాలయంలో జిల్లాలో 15వ ఫైనాన్స్ నిధులపై వివిధ మండలాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారో సంబంధిత ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు.

News September 3, 2025

చిత్తూరు జిల్లాలో ముగ్గురికి రాష్ట్రస్థాయి అవార్డులు

image

చిత్తూరు జిల్లాలో ముగ్గురు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. నరహరిపేట జడ్పీ టీచర్ ఫిజిక్స్ టీచర్ నౌషద్ అలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన 30 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందించారు. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సైతం రూపొందించారు. పుంగనూరు మండలం రాంనగర్ స్కూల్ టీచర్ హేమలత, నక్కబండ కేజీబీవీ టీచర్ నౌజియా సైతం రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

News September 3, 2025

CTR: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

image

చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ వ్యభిచారం గృహంపై మంగళవారం సాయంత్రం పోలీసులు రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జయప్ప వీధిలో జ్యోత్స్న అనే మహిళ విటులును రప్పించి వ్యభిచారం చేయిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు దాడి చేసి ఓ మహిళ, ఓ విటుడితో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర నుంచి ఆమె అద్దె ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం.

News September 3, 2025

చిత్తూరు జిల్లాలో 24 RMP క్లినిక్‌ల మూసివేత

image

చిత్తూరు జిల్లాలోని RMP క్లినిక్‌లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 76 కేంద్రాలను పరిశీలించారు. 24 క్లినిక్‌లు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని DMHO సుధారాణి వెల్లడించారు.

News September 3, 2025

చిత్తూరు: మహిళ మృతిలో ట్విస్ట్

image

SRపురం(M) పాతపాళ్యానికి చెందిన పూజ మృతి హత్య అని తేలింది. SI సుమన్ వివరాల మేరకు.. యాదమరి(M) వరదరాజులపల్లెకు చెందిన వ్యక్తితో పూజకు వివాహం జరగ్గా మూడేళ్ల కిందట అతను చనిపోయాడు. ఆ తర్వాత భాస్కర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గతనెల 17న పూజను అతను కొట్టి చంపేసి ఉరేసుకున్నట్లు నమ్మించాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి ఆమెది హత్య అని నిర్ధారించారు. నిన్న రీపోస్ట్‌మార్టం చేశారు.

News September 2, 2025

చిత్తూరు: దోమల నియంత్రణకు చర్యలు ఏవీ..!

image

వాతావరణ మార్పుతో పాటు దోమలు ఎక్కువైపోయాయి. అటు పంచాయతీలు..ఇటు పట్టణాలు రెండు వైపులా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చిన్నపాటి క్లినిక్లు కూడా రోగులతో నిండిపోయాయి. ఆరోగ్య శాఖ ప్రకటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.