Chittoor

News September 18, 2024

తిరుపతి: 108లో ఉద్యోగ అవకాశాలు

image

108 వాహనాల్లో ఫైలట్ (డ్రైవర్), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి 108 సర్వీస్ జిల్లా మేనేజర్ సంజీవ రెడ్డి తెలిపారు. ఫైలెట్ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత, హెవీ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వివరాలకు తిరుపతి మధురానగర్ లోని 108 సర్వీసెస్ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News September 18, 2024

తిరుమల: 21న వర్చువల్ సేవల కోటా విడుదల

image

తిరుమలలో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

News September 17, 2024

18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌లో కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

News September 17, 2024

సెప్టెంబర్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల

image

తిరుమలలో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

News September 17, 2024

20వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ ‌పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 17, 2024

తిరుపతి: చాట్ బాట్ ద్వారా 310 ఫోన్లు రికవరీ

image

చాట్ బాట్ ద్వారా11వ విడతలో రూ.62 లక్షల విలువ గల 310 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…10 విడతలలో సుమారు రూ.6, 07 కోట్లు విలువచేసే 3,530 సెల్ ఫోన్లు బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వాట్సప్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

News September 17, 2024

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం

image

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని FactCheck.AP.Gov.in పేర్కొంది. వాస్తవానికి ఆగస్టు 29వ తేదీన విజయవాడ గురునానక్ కాలనీలో, మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్ వీడియో ఇది అని తెలిపింది. తిరుమల ప్రతిష్ట మంటగలిపేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని ట్విటర్‌లో తెలిపింది.

News September 17, 2024

శ్రీవారి భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఈవో

image

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలని ఈవో శ్యామలరావు సూచించారు. మంగళవారం తిరుమలలో దుకాణదారులతో ఆయన సమావేశం అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా వారికి అవగాహన కల్పించారు. నియమ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 17, 2024

చిత్తూరు: సీటుకోసం బ్యాగు వేస్తే బంగారు నెక్లెస్ పాయె..!

image

సీటుకోసం బస్సు కిటికీ లోంచి బ్యాగు వేస్తే రూ.4 లక్షల నెక్లెస్ కొట్టేసిన ఘటన చిత్తూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం.. బెంగళూరుకు చెందిన లక్ష్మి చిత్తూరు బస్టాండ్‌కు వచ్చింది. బెంగళూరు వెళ్లే బస్సు రావడంతో సీటు కోసం కిటికిలో నుంచి ఓ సీటులోకి తన హ్యాండ్ బ్యాగు వేసింది. ఆ సీటులో వేరేవాళ్లు కూర్చొని ఉండడంతో దిగేసింది. కాసేపటికి బ్యాగు తెరచి చూసేసరికి 64 గ్రాముల బంగారం నెక్లెస్ కనిపించలేదు.

News September 17, 2024

చిత్తూరు: టీడీపీలో చేరిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ

image

గంగాధర్ నెల్లూరు మండలం ఎట్టేరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ హరీశ్ యాదవ్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సాదరంగా ఆహ్వానించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తానని హరీశ్ యాదవ్ అన్నారు.