India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించి నేటితో 71 వసంతాలు పూర్తయింది. 1954 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చేతులమీదుగా వర్సిటీని ప్రారంభించారు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. కాగా ఇవాళ సాయంత్రం యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో వర్సిటీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో జరిగింది. బొమ్మనపల్లికి చెందిన బాలాజీ (41) స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గ్రామ సమీపంలో ఉన్న ఆవుల షెడ్డులో పాలు పితకడానికి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. అక్కడ ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. అతని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుంగనూరు (మం) బండ్లపల్లి సచివాలయ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు సోమవారం పంపిణీ చేయాల్సిన
రూ. 6.30 లక్షల పింఛను సొమ్ముతో పరారయ్యాడు. దీనిపై ఎంపీడీవో లీలా మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఎస్ఐ కెవి రమణ కేసు నమోదు చేశామన్నారు. కార్యదర్శిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
చౌడిపల్లి బోయకొండ గంగమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వారందరి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. బోయకొండ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యత్వం కోసం115 మంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు ఫారాలను పరిశీలించినట్లు వివరించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.
ఏడు రాష్ట్రాలు దాటి మోటార్ సైకిల్ పై వెళ్తున్న సాయుధ దళాలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. చిత్తూరులోని కాణిపాకం బైపాస్ రోడ్డులో సోమవారం ట్రై నేషన్, ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధ మోటార్ సైకిల్ యాత్రను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఇలాంటి యాత్రలు యువతకు గొప్ప స్ఫూర్తి అని ఆయన చెప్పారు. యాత్ర చేస్తున్న వారికి ఘన వీడ్కోలు పలికారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. మొత్తం 1,339 చౌక దుకాణాల పరిధిలోని 5.40 లక్షల కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు అందించనున్నారన్నారు. ఇందుకుగాను జిల్లాకు 8 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 3 వేల మెట్రిక్ టన్నుల చక్కెర వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 2 నుంచి 7 వరకు వైద్య పరిక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ ఆదివారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 6 గంటలకు చిత్తూరు పాత జిల్లా పోలీసు కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు 2, 3న, పురుష అభ్యర్థులకు 4 నుంచి 7 వరకు పరిక్షలు నిర్వహిస్తారన్నారు.
చిత్తూరు కలెక్టరేట్లో ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ప్రజా వేదికను వినియోగించుకోవాలని సూచించారు.
చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.122, మాంసం రూ.177 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.201 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
కుప్పంలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు బుల్లెట్ బైక్పై సీఎం బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. పరమసముద్రం వద్ద హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి ఇచ్చే బహిరంగ సభకు వెళ్లగా.. మంత్రి నిమ్మల బుల్లెట్ బైక్పై ఈ సమావేశానికి వచ్చారు. టీడీపీ శ్రేణులకు అభివాదం ఆయన చేశారు.
Sorry, no posts matched your criteria.