Chittoor

News July 11, 2024

తిరుపతి: భార్య మృతదేహాన్ని ముళ్లచెట్లలో పడేసిన భర్త

image

భార్య మృతదేహాన్ని ముళ్లచెట్లలో భర్త పడేసిన ఘటన తిరుపతిలో జరిగింది. సీఐ జయనాయక్ వివరాల ప్రకారం.. ఒరిశాకు చెందిన ఓ బేల్దారి బాబురావు ఇద్దరు భార్యలతో తిరుపతికి వచ్చి వేర్వేరు కాపురం పెట్టాడు. బాబురావు రాత్రివేళల్లో మద్యం తాగి రెండోభార్య మిత్తాషబార్(29)తో రోజూ గోడవపడేవాడు. ఆమె ఇంట్లో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కన్పించగా మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకుని కరకంబాడి రోడ్డులోని ముళ్లచెట్లలో పారేశాడు.

News July 11, 2024

బైరెడ్డిపల్లె: ఎద్దు పొడిచి వ్యక్తి మృతి

image

ఎద్దు పొడిచి వ్యక్తి మృతి చెందిన ఘటన బైరెడ్డిపల్లెలో జరిగింది. బైరెడ్డిపల్లెకు చెందిన జయచంద్రానాయుడు(37) గ్రామ సమీపంలోని పొలం వద్దకు ఎధ్దును మేతకు తీసుకెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఎద్దు పొడిచింది. దీంతో తీవ్రగాయాలవ్వడంతో అక్కడి రైతులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. స్థానిక వైద్యాధికారి విజయచందర్ అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

News July 11, 2024

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జయప్రదం చేయండి: కలెక్టర్

image

కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రపంచ జనాభా అవగాహన దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ నందు కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్ లో ప్రపంచ జనాభా దినోత్సవ బ్యానర్ ను, పోస్టర్లను కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.శ్రీహరి ఇతర వైద్య సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.

News July 10, 2024

పులిచెర్ల : కమలాపురంలో వర్షం

image

పులిచెర్ల మండలం కమలాపురంలో వాతావరణం పూర్తిగా మారింది. ఒక గంట క్రితం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. దీనితో చెట్లు, కొమ్మలు విరిగిపడే అవకాశం ఉన్నందువలన స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున పంట పొలాలు దగ్గరికి వెళ్లకూడదని అన్నారు.

News July 10, 2024

సరికొత్త కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీకారం

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గురువారం డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గురువారం ఉదయం 10గంటల నుంచి 11 గంటల వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలను స్వీకరిస్తారు.

News July 10, 2024

తిరుపతి: సిగరెట్లు అమ్మితే రూ.200 ఫైన్

image

తిరుపతి జిల్లాలో పాఠశాలలు, కాలేజీల సమీపంలో సిగరెట్లు, బీడీలు అమ్మితే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణిగుంట పోలీసులు పలు దుకాణాల్లో సోదాలు చేశారు. కొందరు సిగరెట్, బీడీ అమ్ముతున్నట్లు గుర్తించి వారికి రూ.200 జరిమానా విధించారు. విద్యాసంస్థల వద్ద బీడీ, సిగరెట్ వంటి ధూమపాన వస్తువులు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 10, 2024

కాలువను శుభ్రం చేసిన తిరుపతి కలెక్టర్

image

పరిసరాల పరిశుభ్రతతో డయేరియాను అరికట్టవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో అతిసార నియంత్రణ మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి కలెక్టర్ స్వయంగా కాలువను శుభ్రం చేశారు. పంచాయతీ కార్మికులతో కలిసి కాలువలోని పూడికలు తొలగించారు. అందరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.

News July 10, 2024

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారిని మంగళవారం 67,245 మంది దర్శించుకున్నారు. 25,054 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చింది.

News July 10, 2024

చిత్తూరులో టీచర్ ఆత్మహత్య

image

చిత్తూరులో ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని గిరింపేట మున్సిపల్ హైస్కూల్లో షరీఫ్(38) హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం పురుగు మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

News July 10, 2024

చిత్తూరు జిల్లాలో 68 మందికి మెమోలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 68 మంది టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు డీఈఓ దేవరాజు మెమోలు జారీచేశారు. వాటిని డీవైఈఓ, ఎంఈవోలకు పంపారు. సక్రమంగా ఫేషియల్ అటెండెన్స్ వేయకుండా విధులకు డుమ్మా కొట్టడంతో మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. 24 గంటల్లో లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.