Chittoor

News November 19, 2024

అసహనం వ్యక్తం చేసిన చిత్తూరు కలెక్టర్

image

జిల్లాలో గోకులం షెడ్ నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పశుసంవర్ధక శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించకపోగా, పలు చోట్ల షెడ్ల నిర్మాణం పూర్తి అయిన బిల్లులు ఎందుకు అప్లోడ్ చేయలేదని నిలదీశారు. నిధుల కొరత లేదని, రైతులకు అవగాహన కల్పించి గోకులం షెడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

News November 18, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి

image

ట్రాక్టర్ ఢీకొని కర్ణాటకకు చెందిన స్కూటరిస్టు దుర్మరణం చెందినట్లు పీటీఎం ఎస్ఐ నరసింహుడు తెలిపారు. పీటీఎం మండలం, మల్లెలగ్రామం చెన్నరాయునిపల్లి వద్ద గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం, చిలక నేర్పు గ్రామానికి చెంది రైతు రామాంజి(48) అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కర్ణాటకకు తరలించారు.

News November 18, 2024

శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇక జనరల్ ఖాతాకు

image

టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దళారులు లేకుండా స్వామి వారి దర్శనంతో పాటు ఆలయాల పున: నిర్మాణం, జీర్ణోద్ధరణ చేయాలని ఏర్పాటు చేశారు. నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నూతన బోర్డు ఆ పేరు మార్చడంతో పాటు నిధులను జనరల్ ఖాతాకు జమ చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంపై మరింత స్పష్టత టీటీడీ ఇవ్వాల్సి ఉంది.

News November 18, 2024

పోలీసులపై ప్రివిలేజ్ మోషన్: తిరుపతి MP

image

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తే కనీసం తీసుకోవడానికి కూడా వారు ఆసక్తి చూపలేదని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై జుగుప్సాకర పోస్టులను పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులతో కలిసి ఆయన ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 40 నిమిషాల పాటు తమను పట్టించుకోలేదని, వారిపై ప్రివిలైజేషన్ మూవ్ చేస్తామని హెచ్చరించారు.

News November 18, 2024

తిరుమలలో అన్యమత ప్రచారం.. ఇద్దరిపై కేసు

image

పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన పాపవినాశనం ఆవరణంలో అన్యమత ప్రచారానికి పాల్పడ్డ ఇద్దరు మహిళలపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాపవినాశనం వద్ద శంకరమ్మ, మీనాక్షి భక్తుల ముందే ఆదివారం ఓ మతానికి సంబంధించి పాటలకు రీల్స్ చేయడం పెను దుమారం రేపింది. దీంతో భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 18, 2024

నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం.వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 17, 2024

గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు

image

గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండో పట్టణ SI రవి కుమార్ తెలిపారు. ఏఎస్ఐ మోసెస్ 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ తనను పట్టించుకోకపోవడమే కాకుండా అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య ఎస్తర్ రాణి శనివారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రామచంద్ర ఆదేశాలతో ఎస్ఐ విచారణ చేపట్టి ఏఎస్ఐపై కేసు చేశారు. 

News November 17, 2024

నేడు నారావారిపల్లెకు CM రాక.. వివరాలు ఇవే 

image

చంద్రగిరి మాజీ MLA నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 9.20కు హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి 9.25కు బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి 10.10గంటలకు తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన 10.50 గంటలకు నారావారిపల్లెకు చేరుకుని అంత్యక్రియలలో పాల్గొననున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

News November 16, 2024

బి.కొత్తకోట: క్షుద్రపూజలు చేస్తున్న వైసీపీ నేతలు అరెస్ట్

image

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో క్షుద్ర పూజలు నిర్వహించిన ఇద్దరు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. అరెస్టైన వారిలో ఒకరు మదనపల్లె చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యుడు ఏ.వీ సుబ్బారెడ్డి కాగా మరొకరు కదిరికి చెందిన వజ్ర భాస్కరరెడ్డి ఉన్నారు. బి.కొత్తకోట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ పురాతన ఆలయంలో పూజలు నిర్వహించగా అరెస్టుచేశామని తెలిపారు.

News November 16, 2024

తిరుపతి: 15ఏళ్ల బాలికపై అఘాయిత్యం

image

తిరుపతి జిల్లా BN కండ్రిగ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. SI విశ్వనాథనాయుడు వివరాల ప్రకారం.. కల్లివెట్టు గ్రామానికి చెందిన శివ(23) ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో ఓ గ్రామం వద్ద ఇంటి ముందు మంచంలో నిద్రపోతున్న 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది గమనించి బాలిక తల్లిదండ్రులు శివని పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.