India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☞ తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో చిత్తూరుకు ఐదో స్థానం
☞ చిత్తూరు జిల్లాలోని హోటళ్లలో తనిఖీలు
☞ చిత్తూరు నగరంలో వ్యభిచార గృహంపై దాడి
☞ పుంగనూరులో 12 మంది బైండోవర్
☞ చిత్తూరు: జైలులో వైసీపీ నాయకులకు రోజా పరామర్శ
☞ మల్లప్ప కొండ వద్ద రేపు మినీ కల్చరల్ ఈవెంట్
☞ పలమనేరు: తల్లిపై క్రికెట్ బ్యాట్తో దాడి చేసిన కుమారుడు

కార్వేటినగరం మండలం పళ్లిపట్టు మూడు రోడ్ల కూడలి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళత్తూరుకు చెందిన శ్రావణ్ కుమార్, చెన్నకేశవ అనే ఇద్దరు బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి కార్వేటినగరం నుంచి బైక్పై వస్తూ డివైడర్ను ఢీకొన్నారు. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చెన్నకేశవ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి చిత్తూరు (39 శాతం) జిల్లా తక్కువ పేదరికం ఉన్న జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది.

చిత్తూరు నగరంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. రామ్నగర్ కాలనీలో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమచారం రావడంతో 2టౌన్ CI నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, ముగ్గురు మహిళలతోపాటు ముగ్గురు విటులను స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుప్పం నియోజకవర్గ పరిధిలో జల్లికట్టు, ఎద్దుల పండుగ (మైలారు)ను నిషేధించినట్లు డీఎస్పీ పార్థసారధి స్పష్టం చేశారు. ఎక్కడైనా జల్లికట్టు, ఎద్దుల పండగను నిర్వహిస్తే వారు జంతు సంరక్షణ చట్టం క్రింద శిక్షార్హులన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSP హెచ్చరించారు.

చిత్తూరు జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తొలి రోజు సోమవారం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు మొత్తం 12,220 మందికి గాను 11,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 509 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1,809 మందికి గాను 1,709 మంది విద్యార్థులు హాజరు కాగా, 100 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.

చికెన్ పట్ల సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం సాయంత్రం చికెన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు దొరుకుతుందని, అపోహలను పక్కనపెట్టి చికెన్ తినొచ్చని అన్నారు.

శాంతిపురం (M) మఠం వద్ద శనివారం బైకుపై లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో <<15621064>>మృతుల సంఖ్య మూడుకు<<>> చేరింది. బైరెడ్డిపల్లె (M) మూగనపల్లికి చెందిన తల్లి కొడుకు తులసమ్మ, రవితేజ అక్కడికక్కడే మృతి చెందగా మరో కొడుకు పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో మూగనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చిత్తూరు జిల్లాలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికారులు 96 శాతం పంపిణీ చేశారు. 2,64,899 మంది లబ్ధిదారులకుగాను 2,54,375 మందికి (96.03) పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీడి నెల్లూరులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లాలో త్వరలోనే 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు CM చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం GDనెల్లూరులో పర్యటించిన ఆయన.. NTR జలాశాయంతోపాటూ ఇక్కడే బాలుర గురుకులాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మామిడి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు CM తెలిపారు. వాటితో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.