Chittoor

News January 28, 2026

రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు

image

కుప్పం (M) మల్లానూరు నుంచి అడవి బూదుగూరు మీదుగా తమిళనాడు బోర్డర్ వరకు రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లనూరు నుంచి తమిళనాడు బోర్డర్ వరకు సింగల్ రోడ్డు ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ నిధులు మంజూరు చేసింది.

News January 28, 2026

రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు

image

కుప్పం (M) మల్లానూరు నుంచి అడవి బూదుగూరు మీదుగా తమిళనాడు బోర్డర్ వరకు రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లనూరు నుంచి తమిళనాడు బోర్డర్ వరకు సింగల్ రోడ్డు ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ నిధులు మంజూరు చేసింది.

News January 27, 2026

CM పర్యటనకు భారీ బందోబస్తు: SP

image

CM చంద్రబాబు కుప్పం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు SP తుషార్ డూడి పేర్కొన్నారు. CM పర్యటనకు సంబంధించి కుప్పం కడ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో, శాంతిపురం (M) తుమిసి సమీపంలోని డొంకుమాకులపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

News January 27, 2026

CM చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు

image

CM చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. ఈనెల 30, 31న ఆయన పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. TDP శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అదేవిధంగా కుప్పంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పర్యటనకు సంబంధించి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఇవాళ కుప్పంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

News January 27, 2026

గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

రామకుప్పం Dr.BR అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రజనీ కుమార్ తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, Jr inter MPC లో 40, Bipc లో 40, 6 నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్లకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం http://apgpcet.apcfss.in ను సంప్రదించాలన్నారు.

News January 26, 2026

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన SP

image

చిత్తూరు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ రిపబ్లిక్ డే పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని సోమవారం ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. సిబ్బందికి ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఎంటీఓ వీరేశ్ పాల్గొన్నారు.

News January 26, 2026

చిత్తూరు: జెండా వందనం చేసిన కలెక్టర్

image

చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధికార యంత్రాంగానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డా. థామస్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా అధికార యంత్రాంగం, విద్యార్థులు పాల్గొన్నారు.

News January 26, 2026

చిత్తూరులో పీజీఆర్ఎస్ రద్దు

image

సోమవారం కలెక్టరేట్, పోలీసు జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఆ కార్యక్రమం రద్దు చేసినట్లు వెల్లడించారు. వచ్చేవారం నుంచి యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.

News January 25, 2026

చిత్తూరు: గురుకులాలు పిలుస్తున్నాయ్.!

image

పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో బాయ్స్ కోసం రామకుప్పం, పూతలపట్టు, విజిలాపురం, గర్ల్స్ కోసం జీడీనెల్లూరు, చిత్తూరు, పలమనేరు, కుప్పం లో గురుకులాలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరెందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 19 లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

News January 25, 2026

చిత్తూరు జిల్లాలో 66 పశు వైద్య శిబిరాలు

image

జిల్లా వ్యాప్తంగా 66 పశువైద్య శిబిరాలు శనివారం నిర్వహించినట్లు జిల్లా పశువైద్యాధికారి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ శిబిరాలను 2,276 మంది పాడి రైతులు సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 7,505 పశువులకు వైద్యం అందించినట్లు వివరించారు. అలాగే గొర్రెలు, మేకలకు కూడా సేవలు అందించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 516 ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు.