India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏర్పేడు మండలం బండారుపల్లిలో కరెంట్ షాక్ తగిలి యశోద మృతిచెందిన విషయం తెలిసిందే. పశువుల గడ్డి కోసం వెళ్లిన ఆమె తిరిగి వస్తుండగా కరెంట్ వైర్లు తగిలి చనిపోయారు. ఆ సమయంలో ఆచుట్టు పక్కల ఎవరూలేరు. ఆమె వెంట వచ్చిన కుక్కనే గట్టిగా కేకలు వేస్తూ అటూఇటూ తిరిగింది. ఇది గమనించిన గ్రామస్థులు కరెంట్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్థులు అక్కడికి వచ్చిన తర్వాత ఆ కుక్క యశోద ఒడి వద్ద అలా ఉండిపోయింది.
నిమోనియా దినోత్సవ గోడపత్రికను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిమోనియా వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలపై వైద్య అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గ్రామాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలన్నారు.
తిరుపతి జిల్లాలో కన్నీరు పెట్టించే ఫొటో ఇది. ఏర్పేడు(M) బండారుపల్లికి చెందిన యశోద పొలానికి వెళ్లారు. గడ్డిమోపు తెస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తగిలి కరెంట్ షాక్ కొట్టింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయం తెలియని పెంపుడు కుక్క ఆమె ఒడిలో అలాగే ఒదిగి ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు.
తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. ఏర్పేడు(M) బండారుపల్లిలో కరెంటు షాక్తో యశోద మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఆమె పొలం నుంచి గడ్డిమోపు తెస్తుండగా.. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోయినప్పటికీ పెంపుడు కుక్క ఆమె ఒడిలో ఒదిగి ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
రెవెన్యూ అంశాలపై తహశీల్దార్లు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లో చిత్తూరు, నగరి డివిజన్లకు సంబంధించిన RDOలు,తహశీల్దార్లతో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరితో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన రేణిగుంట విమానాశ్రయం పాత మార్గంలోని రామకృష్ణాపురం సర్కిల్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 35 సంవత్సరాల గుర్తు తెలియని యువకుడు షర్టు లేకుండా డ్రాయర్ ధరించి ఉన్నాడన్నారు. రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడానికి తీరిక లేని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. మంగళవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడిస్తానని బీరాలు పలికిన పెద్దిరెడ్డి నేడు అసెంబ్లీకి వెళ్లడానికి ముఖం చాటేశారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. (కోట్లలో)
➤హంద్రీ-నీవాకు రూ.2014.23
➤తిరుపతి కార్పొరేషన్కు రూ.350
➤తెలుగుగంగ ప్రాజెక్టు పనులకు రూ.879.24
➤గాలేరు నగరికి రూ.2438.94
➤SVUకి రూ.226.38
➤వెటర్నరీ వర్సిటీకి రూ. 153
➤పద్మావతి వర్సిటీకి రూ.72.73
➤ ద్రవిడ వర్సిటీకి రూ.27.91
➤శ్రీసిటీ ఐఐటీకి రూ.19.52
చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి ఇంటి వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ బీపీ, షుగర్, గుండె, థైరాయిడ్, పెరాలసిస్, క్యాన్సర్ వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందుగానే వ్యాధులు గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుందన్నారు.
చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి ఇంటి వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ బీపీ, షుగర్, గుండె, థైరాయిడ్, పెరాలసిస్, క్యాన్సర్ వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందుగానే వ్యాధులు గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.