Chittoor

News February 25, 2025

మొగిలి: హంస వాహనంపై మొగిలేశ్వర స్వామి

image

బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో వెలసిన మొగలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు స్వామివారు హంస వాహనంపై గ్రామంలో ఊరేగారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించారు.

News February 24, 2025

చిత్తూరు యువతి హీరోయిన్‌గా అరంగేట్రం

image

చిత్తూరు జిల్లాకు చెందిన సౌందర్య రవికుమార్ తమిళ చిత్రంలో తళుక్కుమన్నారు. నటన పట్ల ఆసక్తిగల సౌందర్య తన ప్రతిభతో గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళంలో దర్శకుడు గౌతమ్ మీనన్ అసిస్టెంట్ బాలు పులిచెర్ల దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ కే దాస్ చిత్రంలో సౌందర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కుమార్తె సౌందర్య చిన్ననాటి నుంచి కళల రంగంలో రాణిస్తోంది.

News February 24, 2025

అసెంబ్లీలో YCPని ప్రతిపక్షంగా గుర్తించాలి: పెద్దిరెడ్డి 

image

అసెంబ్లీలో వైసీపీని ప్రభుత్వం ప్రతిపక్షంగా గుర్తించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించినట్లు ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వాటిని ఎక్కడా నిరూపించలేదన్నారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌కు మాట్లాడే అవకాశం కల్పించాలని,  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. 

News February 24, 2025

తిరుపతి: పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

తిరుపతిలో ఆదివారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్లు అలిపిరి సీఐ రామకృష్ణ తెలిపారు. పదేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా రమణాచార్య అనే వ్యక్తి బాలికను మద్యం మత్తులో ఇంట్లోకి తీసుకెళ్లి బలవంతం చేయబోయాడు. తన మాట వింటే డబ్బులు ఇస్తానంటూ ఆశ చూపాడు. దీంతో బాలిక భయంతో ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లికి చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 24, 2025

చిత్తూరులో ఏడు మంది అరెస్టు

image

చిత్తూరు నగరంలోని సంతపేట పాంచాలపురంలో జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.7,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. తేనె బండ శివారులో జూదమాడుతున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 7 మందిని కోర్టుకు హాజరు పరచమన్నారు. జూదం లాంటి చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

News February 24, 2025

చిత్తూరు: ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించవచ్చని ఆయన చెప్పారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు.

News February 23, 2025

చిత్తూరులో చికెన్ ధరలు ఇవే..

image

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ ధర రూ.155 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.177గా ఉంది. అదే విధంగా లేయర్ చికెన్ ధర రూ.127గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 23, 2025

వ్యవసాయ సంఘాల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్ 

image

చిత్తూరు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. అర్హులైన వారికి పారదర్శకంగా రుణాలు మంజూరు చేసేందుకు దృష్టి సారించాలన్నారు. సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. జేసీ విద్యాధరి, అధికారులు పాల్గొన్నారు.

News February 22, 2025

చిత్తూరు జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక.. ఏపీ CS, DGPకి నోటీసులు
✒ తవణంపల్లి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
✒ వెదురుకుప్పంలో అగ్ని ప్రమాదం
✒ బెంగళూరు-చెన్నై హైవేపై ప్రమాదం
✒ చిత్తూరులో 19 మందికి జరిమానా
✒ తిరుపతి: ఒకే వేదికపై 100 మంది కవలలు
✒ వ్యవసాయ సంఘాల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్

News February 22, 2025

తవణంపల్లి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి

image

చంద్రగిరి మండలం కాశీపెంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద రెండు లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తవణంపల్లి మండలం, మారేడుపల్లెకు చెందిన డ్రైవర్ సౌందర్ రాజు (35) గా గుర్తించారు. లారీని పార్క్ చేసి చూసుకొని క్రమంలో మరో లారీ ఢీకొనడంతో లారీల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు.