Chittoor

News July 3, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18 మందికి జరిమానా

image

తిరుపతి నగర పరిధిలో డిఎస్పీ రమణ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందిని అదుపులోకి తీసుకుని కానిస్టేబుల్ గిరిబాబు కోర్టులో హాజరు పరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి 4వ అదనపు మున్సిఫ్ కోర్టు జడ్జి గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు.

News July 3, 2024

శ్రీకాళహస్తి: ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు శిక్ష

image

శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముగ్గురు ముద్దాయిలకు శిక్ష విధిస్తూ తిరుపతి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నిరోధక కోర్టు జూనియర్ సివిల్ జడ్జి బుధవారం తీర్పును వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం ఆటోనగర్ కు చెందిన కొల్లగుంట శివ, తిరుపతికి చెందిన బోయలపల్లి మురళి, మురళి లకు 6నెలలు జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించారు.

News July 3, 2024

జిల్లా కలెక్టర్‌కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

image

తిరుపతి జిల్లా కలెక్టర్ గా నియమితులైన వెంకటేశ్వర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నూతన జిల్లా కలెక్టర్ కు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్ర సాదర స్వాగతం పలికారు. గురువారం జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 3, 2024

TPT : రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) నందు గురువారం ఉదయం 10 గంటలకు రీసర్చ్ అసోసియేట్ (మెడికల్/పారామెడికల్) పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. MSC నర్సింగ్, MPT న్యూరో, MSC న్యూరో ఫిజియాలజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News July 3, 2024

ఏర్పేడు : IITలో 21న కాన్వొకేషన్ కార్యక్రమం

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు జూలై 21వ తేదీ ఆదివారం 6వ కాన్వొకేషన్ (Convocation) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన అభ్యర్థులు 20వ తేదీ హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News July 3, 2024

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి బాగానే ఉన్నారు: నల్లగుండ్ల

image

తంబళ్లపల్లె MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వదంతులు వచ్చాయి. అదంతా అవాస్తవమని వైసీపీ నేత నల్లగుండ్ల మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. ‘చిన్నపాటి అనారోగ్యంతో బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నేను నిన్న MLAను కలిశా. 6, 7వ తేదీల్లో ఎమ్మెల్యే స్వగ్రామం యర్రాతివారిపల్లెలో అయ్యప్ప మాలదీక్ష తీసుకుంటారు’ అని ఆయన చెప్పారు.

News July 3, 2024

అవాస్తవాలను నమ్మవద్దు: TTD

image

శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశారని, దిట్టం పెంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై TTD స్పందించింది. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి వార్తలు నమ్మవద్దు. ఈవో శ్యామలారావు మొన్న అర్చకస్వాములు, ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాలపై చర్చించారు. కానీ ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదు’ అని TTD స్పష్టం చేసింది.

News July 3, 2024

TDP నాయకుల వేధింపులకు యువకుడి బలి: YCP

image

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అయ్యవార్లగొల్లపల్లెలో కేశవ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కేశవ తల్లికి పింఛన్ ఆపేసి టీడీపీ నాయకులు వేధించారు. అతి తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పెన్షన్ అడిగిన కొడుకును టీడీపీ బలితీసుకుంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కడుపు నొప్పి భరించలేక తన సోదరుడు పురుగు మందు తాగాడని కేశవ అన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 3, 2024

తిరుపతిలో DSCకి ఉచిత శిక్షణ

image

తిరుపతిలోని స్టడీ సర్కిల్లో డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, సాధికారత అధికారి రబ్బానీబాషా వెల్లడించారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హులని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు తిరుపతిలోని బీసీ స్టడీ సర్కిల్‌ను సంప్రదించాలని కోరారు.

News July 3, 2024

చిత్తూరు: జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించాలి

image

కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎస్పీ మణికంఠ సూచించారు. పోలీసు అధికారులతో మంగళవారం ట్రైనింగ్ సెంటర్లో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కల్పించాలన్నారు. అక్రమ రవాణా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.