India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 32 బెంచ్లను ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి పదవికి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతులను కూడా ఉన్నతాధికారులు రాజీనామాలు సమర్పించాలని కోరినట్లు సమాచారం.
చిత్తూరు జడ్పీ సీఈవోగా గతంలో పని చేసిన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. బైరెడ్డిపల్లె ఎంపీడీవోగా ఉన్న ఆయనకు సీఈవోగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన అనేక అక్రమాలు చేశారని టీడీపీ నేతలు నరసింహులు, గీర్వాణి ఆరోపించారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై జులై 7వ తేదీ లోపు నివేదిక అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పంలోని R&B గెస్ట్హౌస్లో సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో నివేదిక తయారు చేయాలన్నారు. ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జులై 1న ఇంటి వద్దే ఫించన్ నగదు అందజేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని డీఆర్డీఏ, మెప్మా పీడీలు, ఐసీడీఎస్, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లెకు చెందిన రామాంజులు(27) ఊరికి సమీపంలోని బోరు వద్ద ఓ మహిళతో ఉన్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళను దారుణంగా నరికి చంపారు. తర్వాత రామాంజులుపై దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడటంతో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా నరకడంతో ఆమె ఎవరనేది తెలియరాలేదు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పుంగనూరు, తంబళ్లపల్లెలోనే గెలిచింది. ఈ ఫలితాల నుంచి కోలుకోక ముందే ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. గతంలో రాష్ట్రమంతటా చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఆయన నియోజకవర్గం పుంగనూరులోనే భారీ షాక్ తగిలింది. ఒకేరోజు 12 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. కలికిరి జడ్పీటీసీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారని సమాచారం.
చిత్తూరు జిల్లా కుప్పం డివిజన్ పరిధిలో కొత్తగా 2 మండలాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని సీఎం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు రాళ్లబూదుగూరు, మల్లనూరును మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 24 గంటలు గడవకముందే నూతన మండలాల ఏర్పాటు ప్రక్రియను సీఎం కార్యాలయం ప్రారంభించింది.
తిరుపతికి చెందిన ఎం.మౌనిక దగ్గర ఎం.ఆర్.పల్లికి చెందిన డెంటల్ డాక్టర్ పవిత్ర తన ‘సిరి డెంటల్ కేర్’ అభివృద్ధి కోసం ఏప్రిల్ 15, 2019న రూ.5 లక్షలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బుకు పవిత్ర చెక్ ఇవ్వగా బ్యాంకులో డబ్బు లేకపోవడంతో మౌనిక కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో తిరుపతి 2వ కోర్టు పవిత్రకు 6 నెలలు జైలు శిక్ష రూ.5 వేలు ఫైన్ ను గురువారం ఖరారు చేసింది.
పదవుల కోసం దిగజారే మనస్తత్వం తనది కాదని వైసీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ మేయర్, నాలుగో డివిజన్ కార్పొరేషన్ పదవికి ఎప్పుడో రాజీనామా చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామాను గోప్యంగా ఉంచినట్టు కొందరు ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పదవులను పట్టుకొని వేలాడనని తెలిపారు.
Sorry, no posts matched your criteria.