India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి 29 మందితో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీన టీటీడీ ఛైర్మన్గా బిఆర్ నాయుడు సహా పలువురు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. టీటీడీ అధికారులు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఎవరెవరు వస్తారు, ఏ రోజు వస్తారు అనేది పూర్తి స్థాయిలో వెల్లడించాలని టీటీడీ అధికారులు ఇప్పటికే సభ్యులకు తెలియజేసినట్లు తెలుస్తుంది.
ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రాజెక్ట్ ఆఫీసర్-02, అసిస్టెంట్ మేనేజర్-01 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బీటెక్, ఎంటెక్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 07.
ఆవును తప్పించబోయి యువకుడు మరణించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తొట్టంబేడు మండలంలోని రాంబట్లపల్లె గ్రామానికి చెందిన సి.హెచ్. మోహన్ రెడ్డి (41) తిరుపతిలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తిరుపతిలోనే నివాసం ఏర్పరచుకున్నారు జీవనం సాగించేవాడు. ఆవును తప్పించబోయి ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడు.
వరదయ్యపాళెం మండలంలోని గోవర్ధనపురం గ్రామానికి చెందిన సుదేవ్ (22) అతని స్నేహితులు మూడు రోజుల క్రితం నాయుడుపేటకి వెళ్లారు. తిరిగి వస్తుండగా నాయుడుపేట బైపాస్లో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సుదేవ్కి తీవ్ర గాయాలతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఘటనపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
దీపం – 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ..పేదల సమస్యలు అర్థం చేసుకున్న మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, DY.CM పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయాలని నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
హోం మంత్రి తిరుపతి జిల్లాలో 2 రోజులు పర్యటించనున్నారు. 3న మధ్యాహ్నం 12.05 కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొనున్నారు. 12.35 నుంచి 1.30 గంటల వరకు అలివేలు మంగాపురం గ్రామంలో పర్యటించనున్నారు. 3.10 గంటలకు పద్మావతి మహిళా యూనివర్సిటీలో అనంతపురం డీఐజీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. 11 కు అలిపిరి కపిల తీర్థం ఆలయం దర్శించనున్నారు.
తిరుపతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది. వెస్ట్ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన సతీష్(22) చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతనికి అన్లైన్ ద్వారా బాలిక పరిచయమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతనిపై అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి రిమాండు తరలించారు.
తిరుపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చెందిన బాలిక(3)ను అదే ఏరియాకు చెందిన సుశాంత్ (22) చాక్లెట్లు ,లేస్ ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపాడు. గ్రామంలోని స్కూలు వెనుక పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. తర్వాత పూడ్చిపెట్టాడు. బాలిక కనబడలేదని తల్లిదండ్రుల ఫిర్యాదుతో వడమాలపేట పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.
పుంగనూరు అల్లర్ల కేసులో A1గా రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టుకు వెళ్లగా ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి పలమనేరు DSP కార్యాలయానికి శుక్రవారం వెళ్లారు. డీఎస్పీ ప్రభాకర్ రావుకు ష్యూరిటీలను సమర్పించడంతో ఆయన ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.
తిరుపతి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పండుగ వాతావరణంలో పంపిణీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో 2,65,488 మందికి 5295 మంది సచివాలయ సిబ్బంది ద్వారా రూ.112.37 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు. ఏదేని కారణం చేత పెన్షన్ల నేడు తీసుకోలేని వారికి 2వ తేదీన పంపిణీ చేస్తామని వారు వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.