India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దీపావళి నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించినా, నిషేధిత రసాయనాలతో తయారైన టపాసులు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ L.సుబ్బరాయుడు హెచ్చరించారు. జిల్లాలో అక్రమంగా టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. పేలుడు పదార్థాలను ఇంట్లో నిల్వ ఉంచరాదని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉంచి నిర్ణీత ప్రమాణాల మేరకు విక్రయాలు చేసుకోవాలన్నారు.
ఏపీలో దాదాపు రూ.1397 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే వివిధ స్టేషన్లు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి స్టేషన్ను రూ.300 కోట్లతో ఆధునికీకరించనున్నారు. అంతర్జాతీయ హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సంబంధిత పనులకు ప్రధాని మోదీ ఇటీవల వర్చువల్గా శంకుస్థాపన చేయడంతో జోరుగా పనులు జరుగుతున్నాయి. పనులన్నీ పూర్తి అయ్యాక తిరుపతి రైల్వే స్టేషన్ పైఫొటోలో ఉన్నట్లు కనిపిస్తుంది.
తాడేపల్లి ప్యాలెస్కు ఊడిగం చేసే దొంగల ముఠాలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన ఒకరని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. ‘తిరుపతి దొడ్డాపురం వీధిలోని ఓ చిన్న ఇంట్లో భూమన రెంట్కు ఉండేవారు. మొదట్లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద జిరాక్స్ షాపులో పనిచేశారు. అలాంటి ఆయనకు ఇన్ని వేల రూ.కోట్లు ఎలా వచ్చాయి? శ్రీవారి సొమ్ము కాజేశారు. టీడీఆర్ బాండ్ల దోపిడీలో సంపాదించిన సొత్తే అది’ అని ఆరోపించారు.
తిరుపతి : శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎంఏ తెలుగు, ఎమ్మెస్సీ ఫిజిక్స్ నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు మహిళా యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ఈ నెల 31వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు TTD అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేదీ బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులను కోరింది.
ఇటీవల ఓ ఇంటర్ విద్యార్థిని గర్భవతిని చేసిన యువకుడిని అరెస్టు చేసినట్లు DSP కొండయ్యనాయుడు తెలిపారు. కురుబలకోట మండలానికి చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలికకు రాయచోటి మండలానికి ఖాదర్ బాషా(24) ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యాడు. బాలిక గర్భం దాల్చింది. బాలిక తల్లి విషయం పసిగట్టి ముదివేడులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం కురబలకోట వద్ద అరెస్టు చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కేవలం 45 నిమిషాల్లో పూర్తి అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆదివారం తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. నిన్న శ్రీవారిని 77,844 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,418 వేల మంది తలనీలాలు సమర్పించారు. కాగా నిన్న శ్రీనివాసుని హుండీకి రూ.3.27 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆదివారం వెల్లడించింది.
భోగస్ ఎపిక్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు వెంటనే తిరుపతి అసెంబ్లీ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారికి, నగరపాలక కమిషనర్ కు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2021 లో భోగస్ ఎపిక్ కార్డులు ఉపయోగించి ఓటు వేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ఈ ఘటనపై FIR నెంబర్ 15/2024 గా నమోదు చేసే విచారణ జరుగుతున్నట్లు చెప్పారు.ఆ ఎపిక్ కార్డులు కలిగి ఉన్నవారు శిక్ష అర్హులని చెప్పారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే సంక్షిప్త సమాచారాలు, మెయిల్స్ లలోని లింకులను ఓపెన్ చేయకుండా తిరస్కరించాలని చెప్పారు. మోసపోయాం అని గ్రహించిన తక్షణమే Cyber Helpline 1930 కు గాని సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ http://cybercrime.gov.in/ కు గాని జిల్లా పోలీస్ వాట్సప్ నెంబర్ 9440900005 కు గాని తెలపాలన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ శనివారం తక్కువగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 56,501 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,203 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.78 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.