Chittoor

News June 24, 2024

కుప్పానికి తిరిగి వచ్చిన బస్సులు

image

కుప్పం ఆర్టీసీ డిపోలో ఒకప్పుడు 118 బస్సులు ఉండేవి. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పుంగనూరుతో పాటు ఇతర డిపోలకు కుప్పం బస్సులు తీసుకెళ్లారు. ఇటీవల చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో వివిధ ప్రాంతాలకు తరలించిన బస్సులను తిరిగి కుప్పానికి తీసుకు వచ్చారు. ఈక్రమంలో 55 బస్సులు ఇవాళ తిరిగి కుప్పం రావడంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

News June 24, 2024

చిత్తూరు: టీ, బిస్కెట్లకే రూ.35 లక్షలు..!

image

చిత్తూరు ZP సమావేశాల్లో ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో సమావేశంలో టీ, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు, డ్రైఫూట్స్‌కు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఈ ఏడాది జనవరి సమావేశంలో ఏకంగా రూ.7.45 లక్షలు వాటికే వినియోగించారు. ఇలా 7 సమావేశాలకు రూ.35.61 లక్షల బిల్లులు పెట్టారు. ఈ తరహా ఖర్చులకు జనరల్ ఫండ్ నుంచి 15% వినియోగించాలని నిబంధన ఉండగా.. ఉల్లంఘించారని విచారణలో తేలింది.

News June 24, 2024

బి.కొత్తకోట: చేపల వేటకు వెళ్లి రైతు మృతి

image

ఆలేటి వాగుకు చేపల వేటకు వెళ్లి రైతు మృతి చెందాడని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. పీటీఎం మండలం, రాపూరివాండ్లపల్లె గ్రామం, ఉప్పరవాండ్లపల్లెకు చెందిన రైతు ఎస్.నాగరాజ(50)శనివారం చేపలవేటకు బి.కొత్తకోట మండలంలోని ఆలేటివాగుకు వెళ్లాడు. చేపలు వేటాడుతుండగా పొర పాటున వాగులోపడి మృతి చెందాడు. సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News June 24, 2024

కుప్పంలో చంద్రబాబు పర్యటన.. భారీ ఎత్తున వైసీపీ నేతల చేరిక?

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రానున్నారు. ఈ సమయంలో వైసీపీ నుంచి భారీ ఎత్తున ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు భారీ ఎత్తున పార్టీ మారనున్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పార్టీ మారడంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

News June 24, 2024

మిస్సెస్ ఇండియా పోటీల్లో అదరగొట్టిన తిరుపతి మహిళ

image

బెంగళూరు కేంద్రంగా జరిగిన మిస్సెస్ ఇండియా పోటీల్లో తిరుపతి వాసి సత్తా చాటింది. జైపూర్‌కు చెందిన స్టార్‌లైట్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల మిస్సెస్ ఇండియా పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి నగరానికి చెందిన పుష్ప పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన పుష్ప ఫ్యాషన్ రంగంలో ఆసక్తితో ఈ పోటీల్లో పాల్గొని అదరగొట్టారు. ఆమెను పలువురు జిల్లా వాసులు అభినందించారు.

News June 24, 2024

చిత్తూరు: భారీగా పెరుగుతున్న టమాటా ధర

image

చిత్తూరు జిల్లాలోని మార్కెట్లలో టమాట ధర రోజురోజుకీ పెరుగుతోంది. టమాట మార్కెట్లో గత పది రోజులుగా ధరలు పెరుగుతూ ప్రస్తుతం 14 కిలోల బాక్సు ధర రూ.1000 నుంచి రూ.1090కి చేరుకుంది. బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు తరలి వస్తుండడం, ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పంట లేకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు.

News June 24, 2024

శ్రీకాళహస్తి: లారీ ఢీకొని జూనియర్ లైన్‌మెన్ స్పాట్ డెడ్

image

లారీ ఢీకొనడంతో విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న హేమంత్ దుర్మరణం చెందారు. భాస్కరపేటలో నివాసముంటున్న హేమంత్ ఆదివారం మిట్టకండ్రిగలోని సొంతింటికి వెళ్లి రాత్రి బైకుపై భార్య దివ్యతో కలిసి బయలుదేరారు. హౌసింగుబోర్డు కాలనీ వద్ద బైకును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 24, 2024

ఏర్పేడు : IISERలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

ఏర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నందు కాంట్రాక్టు ప్రాతిపదికగా రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సోమవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/job/ వెబ్ సైట్ చూడగలరు. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని కోరారు.

News June 24, 2024

నేడు మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ఈనెల 24న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో “మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10గం.ల నుంచి మ.1గం.వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.

News June 23, 2024

పుంగనూరు: బీసీవై పార్టీ కమిటీల రద్దు

image

భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి కమిటీలు, సభ్యత్వాలు పూర్తిగా రద్దు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీల నియామకం, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆ ప్రకటనలో తెలియజేశారు.