Chittoor

News June 20, 2024

వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి, భూమన

image

తాడేపల్లిలో వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, విజయానంద రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు.

News June 20, 2024

తిరుపతి కలెక్టర్‌కు ఘన సత్కారం

image

తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. మైనింగ్, జియాలజీ శాఖ కమిషనర్‌గా పదోన్నతిపై వెళ్తుండడంతో కలెక్టరేట్ అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

News June 20, 2024

జగన్ సమావేశానికి వెళ్లలేకపోయిన చెవిరెడ్డి

image

ఇవాళ జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులతో జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి వెళ్లడానికి చిత్తూరు, అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు బెంగళూరు నుంచి విజయవాడకు విమానం బుక్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం 7.30కి బయల్దేరాల్సి ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దు అయ్యింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తదితరులు సమావేశానికి దూరమయ్యారు.

News June 20, 2024

హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు

image

తిరుపతి కేంద్రంగా భారత, ఆంధ్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లయిడ్ న్యూట్రీషియన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.రమణప్రసాద్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాస్ లేక ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 20, 2024

అందరి దృష్టి పెద్దిరెడ్డిపైనే..!

image

ఓటమి తర్వాత వైసీపీ అభ్యర్థులు, నేతలు ప్రజల్లోకి రాలేదు. కొందరు ఆ పరాభవం నుంచి ఇంకా తేరుకోలేదు. జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇటీవల పుంగనూరు పర్యటన ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఇవాళ జగన్ గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పెద్దిరెడ్డి హాజరవుతారా? ఓటమిపై ఏమైనా సందేశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

News June 20, 2024

శ్రీసిటీలో 60 ఉద్యోగాలు

image

శ్రీ సిటీలోని ALSTOM కంపెనీలో ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC తిరుపతి జిల్లా అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిప్లమా, ఐటిఐ వెల్డర్ పూర్తిచేసి 18-22 సంవత్సరాల్లోపు యువతి, యువకులు అర్హులన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/zHku28A3SuT8a24E6 వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.

News June 20, 2024

అనంతలో పెద్దిరెడ్డి మైనింగ్ మాఫియా: కాంట్రాక్టర్లు

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో మైనింగ్‌ మాఫియా నడిపారని వైసీపీ కాంట్రాక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, కూడేరు రవి ఆరోపించారు. తాము అన్ని రకాల అనుమతులు తీసుకున్నా.. అక్రమ కేసులు పెట్టి తమ క్వారీలను లాక్కున్నారని మండిపడ్డారు. అమిగోస్ మినరల్స్ ద్వారా రూ.1000 కోట్ల ఖనిజం దోచేశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన తమను పెద్దిరెడ్డి అనుచరులమంటూ అమిగోస్ ప్రతినిధులు బెదిరించారన్నారు.

News June 20, 2024

పుంగనూరులో నిధుల దుర్వినియోగంపై మెమో

image

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో రూ.1.36 కోట్ల జనరల్ ఫండ్ దుర్వినియోగం జరిగింది. ఈ విషయమై సంబంధిత అధికారులకు మెమో జారీ చేసినట్లు ఎంపీడీవో మునిరెడ్డి వెల్లడించారు. జడ్పీ సీఈవో గ్లోరియా ఆదేశాల మేరకు గతంలో పుంగనూరు ఎంపీడీవో, ఏవోగా పని చేసిన వారికి నిధుల దుర్వినియోగంపై సంజాయిషీ నోటీసులు ఇచ్చామని చెప్పారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

News June 20, 2024

తిరుపతి: సమర్థవంతంగా పనిచేయాలి

image

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల అధికారులు సిబ్బందితో బుధవారం సమావేశమై వారి పనితీరును సమీక్షించారు. స్థానిక పోలీసు గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. 2024 సంవత్సరంలో క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 34 కేసులు నమోదు కాగా.. అన్నింటిని ఛేదించి 83% రికవరీ రేటుతో సమర్థవంతంగా పనిచేసిన తిరుపతి క్రైమ్ పోలీసులను ప్రశంసించారు. కేసుల చేదనలో ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు.

News June 19, 2024

TPT: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత శిక్షణ

image

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి, యువకులకు అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడి సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు SV మెడికల్ కళాశాల ఎదురుగా NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 24.