EastGodavari

News March 9, 2025

నెల్లూరులో నలుగురు దేవరపల్లి వాసులు అరెస్టు

image

రాగితీగలు, BSNLకు చెందిన వస్తువులు చోరీ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇటీవల జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేయగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతానికి చెందిన రమణయ్య, దుర్గారావు, సింహాద్రి, నరసయ్యను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

News March 9, 2025

తూ.గో: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఏఆర్ ఎస్ఐ మృతి

image

ఆటో ఢీకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రిలోని స్వరూప్ నగర్‌కు చెందిన విశ్రాంత ఏఆర్‌ SI త్రిమూర్తులు (65) శనివారం మృతిచెందాడు. బొమ్మూరు ఎస్ఐ ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆయన స్కూటీపై వెళుతుండగా శ్రీరామ్‌పురం ఫారెస్టు రోడ్డులో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన త్రిమూర్తులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.

News March 8, 2025

గోకవరం: మైనర్ బాలిక అపహరణ కేసులో వ్యక్తి అరెస్ట్

image

మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో గోకవరం(M) రాంపయర్రంపాలెం గ్రామానికి చెందిన రాయుడు శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. రాజమండ్రి కోర్టులో శుక్రవారం హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, ప్రేమ పెళ్లి పేరుతో మైనర్ బాలికను అపహరించినట్లు తేలడంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.

News March 8, 2025

రాజమండ్రి: ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచాలి

image

ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని అప్పుడే పర్యావరణ పరిరక్షణ లక్ష్యం సాధ్యం అవుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో వ్యవసాయ, హార్టికల్చర్ క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, సిబ్బందికి సూచించారు. 

News March 7, 2025

తూ.గో జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. తూ.గో జిల్లా వాసులు ఎక్కువగా ఉమ్మడి తూ.గో జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థల్లో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా తూ.గో జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

News March 7, 2025

గోకవరం: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

గోకవరం, కొత్తపల్లి గ్రామంలో పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం కారు – బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇదే ఘటనలో గాయపడిన మహిళను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News March 7, 2025

కాకినాడ : చాలా ఘోరం కదా..?

image

చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ)చనిపోయాడు.

News March 7, 2025

సీతానగరం : కారు ఆపి దాడి.. ఇద్దరికి జైలు 

image

రాజంపేట వద్ద 2022 FEB 6న కారును నిలిపి అందులోని వారిపై సీతానగరం(M) మునికూడలి వాసులు కర్రలతో దాడి చేశారు. ఈ మేరకు తీగిరెడ్డి ప్రసాద్, దాసరి జానకిరామ్‌కు గురువారం శిక్ష పడింది. రాజమండ్రి సెవెంత్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 5,500 జరిమానా, 3 నెలలు జైలు శిక్ష విధించారని సీతానగరం ఎస్సై రామ్ కుమార్ తెలిపారు. కోర్టులో హాజరు పరిచిన కానిస్టేబుల్ షరీఫ్‌ను సీఐ సత్య కిశోర్ అభినందించారు.

News March 7, 2025

రాజమండ్రి : డ్రంక్ &డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష.. 29 మందికి జరిమానా

image

రాజమండ్రిలో నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 30 మందికి కోర్టు శిక్ష విధించిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం రాజమండ్రి కోర్టులో వీరిని హాజరుపరచగా జడ్జి సి.రమ్య ఆధ్వర్యంలో 29 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.2.90లక్షలు జరిమానా, ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించింది. 

News March 7, 2025

పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి : ఆదిరెడ్డి శ్రీనివాస్

image

గోదావరి లంకల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి బడ్జెట్లో రూ.469 కోట్లు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

error: Content is protected !!