EastGodavari

News March 18, 2024

తూ.గో, కోనసీమ జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు!

image

తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News March 18, 2024

తూ.గో జిల్లాలో విషాదం.. యాక్సిడెంట్‌లో మహిళ మృతి

image

తూ.గో జిల్లా రాజానగరం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు గోనగూడెం ISTS ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో బైక్‌ను ఓ భారీ వాహనం ఢీకొంది. భార్యాభర్తలు బైక్‌పై వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భార్య లోవకుమారి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మృతదేహంపై పడి భర్త కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. రాజమండ్రిలో ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News March 18, 2024

కాకినాడ జిల్లాలో ACCIDENT.. కన్నీటి ఘటన

image

కిర్లంపూడిలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు <<12873564>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన వెంకటేశ్ (20), హరిసాయి వెంకట్ (20) సామర్లకోటకు పనినిమిత్తం వెళ్లారు. తిరిగి వస్తుండగా రాజుపాలెం శివారులో బొలెరో వాహనం ఢీకొనగా చనిపోయారు. తండ్రి గతంలో చనిపోగా వెంకటేశ్ చిన్న ఉద్యోగం చేస్తూ సోదరి, తల్లిని పోషిస్తూ వస్తున్నాడు. హరిసాయి ఇంటర్ చదవగా ఉద్యోగప్రయత్నంలో ఉన్నాడు.

News March 18, 2024

కాకినాడ: పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

image

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచికి చెందిన పవన్‌కళ్యాణ్ అభిమాని తాడి గంగాధర్ నవీన్ (30), రాజేశ్, సురేశ్, వెల్దుర్తికి చెందిన సత్యనారాయణ, ఉమాశంకర్‌ 2 బైక్‌లపై ప్రత్తిపాడుకు వెళ్తుండగా విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీ కొంది. ఈ ఘటనలో నవీన్ చనిపోగా..మిగతావారికి గాయాలయ్యాయి. నవీన్ తల్లిదండ్రులతో HYDలో ఉండగా ఆదాయం సరిపోవట్లేదని భార్య, పిల్లలతో 2నెలల క్రితమే ఉత్తరకంచికి వచ్చాడని గ్రామస్థులు చెబుతున్నారు.

News March 18, 2024

తూ.గో జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్-1: జేసీ

image

తూ.గో జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాలలో APPSC గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి ఎన్.తేజ్ భరత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 8,258 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కి ఉదయం 5,056 (61.23 %) మంది హాజరయ్యారని, 3,202 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పేపర్-2కి మధ్యాహ్నం
5,007 (60.63 %)  మంది హాజరు కాగా.. 3, 251 మంది గైర్హాజరయ్యారన్నారు.

News March 18, 2024

నాయకులతో SVSN వర్మ మీటింగ్.. సూచనలు

image

పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు కలిసి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యేగా గెలుపించుకోవాలన్నారు. దీనికి కోసం ప్రతిఒక్కరూ కష్టపడాలన్నారు. వైసీపీ పాలనలో విసిగిన ప్రజలకు రాబోయే ఎన్నికలు ఒక వరం లాంటివని అన్నారు.

News March 17, 2024

రావులపాలెంలో జగన్ బహిరంగ సభ వాయిదా!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఈనెల 19న జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్ భారీ బహిరంగ సభ వాయిదా పడింది. ఈ మేరకు కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. పోలింగ్ తేదీకి ఎక్కువ రోజులు సమయం ఉండడంతో వాయిదా వేసినట్లు నాయకులు తెలిపారు. తిరిగి సభ ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని అన్నారు. ప్రజలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గమనించాలని కోరారు.

News March 17, 2024

తూ.గో: ఎలక్షన్@2024.. 4 చోట్ల సిట్టింగులకు నో ఛాన్స్!

image

వైసీపీ MLA అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి తూ.గో జిల్లాలో నలుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.
☞ జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుకు ప్రత్యామ్నాయంగా తోట నరసింహం,
☞ పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు కాకుండా వంగా గీత,
☞ ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్‌కు ప్రత్యామ్నాయంగా వరుపుల సుబ్బారావు,
☞ పి.గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును పక్కనబెట్టి విప్పర్తికి టికెట్లు ఇచ్చారు.

News March 17, 2024

అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక నేపథ్యం ఇదీ..

image

సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. 2 పర్యాయాలు మలికిపురం మండలం చింతలమోరి సర్పంచిగా, ఒకసారి పీఏసీఎస్ అధ్యక్షునిగా పనిచేసిన రాపాక 2009, 2019 ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం రాపాకను నియమించగా బరిలో ఉన్నారు.

News March 17, 2024

రాజోలులో మరోసారి జనసేన జెండా ఎగరేసేనా..?

image

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇది రాష్ట్రంలో 2వ అత్యల్ప మెజారిటీ. కొద్ది రోజులకే రాపాక YCPలో చేరగా.. తాజాగా MP సీటు దక్కించుకున్నారు. దీంతో రాజోలులో జనసేన నుంచి దేవా వరప్రసాద్‌ MLA బరిలో ఉన్నారు. YCP నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉన్నారు. మరి జనసేన మరోసారి జెండా ఎగరేసేనా..?

error: Content is protected !!